Balka Suman : ఒక్క ఏడాదిలోనే కాంగ్రెస్ పాలన ఫెయిల్..!
- కాంగ్రెస్ పాలన ఫెయిల్
- రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ కక్ష
- రైతుల నష్టంపై కాంగ్రెస్ నిర్లక్ష్యం : బాల్క సుమన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balka Suman : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒకే ఒక్క సంవత్సరం గడవకముందే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. రాష్ట్రంలోని శాసనసభ సభ్యులు, విపక్ష నేతలు, మాజీ ప్రజా ప్రతినిధులు ఒక్కొకరుగా కాంగ్రెస్ పాలన తీరును ఆగ్రహంతో ఎండగడుతున్నారు. ఇదే నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజల సమస్యలపై దృష్టి పెట్టకుండా రాజకీయ కక్ష సాధింపులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని ఆయన విమర్శించారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కావాలనే అప్రయోజనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
బాల్క సుమన్ అభిప్రాయంతో చెప్పిన విషయాల ప్రకారం, గతేడాది రాష్ట్రవ్యాప్తంగా చక్కగా వర్షాలు కురిశాయి. ఎంతో ప్రణాళికతో నిర్మించిన ఎత్తిపోతల పథకాలు, నీటిపారుదల ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నా, వాటిని సక్రమంగా వినియోగించకపోవడం వల్లే రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంటలు ఎండిపోయాయి, భూములు నిరుపయోగంగా మారాయి. దీనికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ఆయన స్పష్టం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం వ్యక్తిగత కక్షతో వ్యవహరిస్తున్నారని, ఇది ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా మారుతుందని విమర్శించారు. పునాదులు ఎత్తేసే ప్రయత్నం చేయడం కంటే ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టులను రక్షించాల్సిన అవసరం ఉందని సూచించారు.
అలాగే కేసీఆర్ను ప్రజల గుండెల నుంచి తీసివేయడం ఎవరూ చేయలేరని బాల్క సుమన్ అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ప్రజలకు చేసిన సేవలు, అభివృద్ధి కార్యక్రమాలు మరిచిపోలేనివని, ఆయనను ప్రజలు ఇప్పటికీ నమ్ముతున్నారని తెలిపారు. ప్రాజెక్టులను ఎండబెట్టవచ్చు గానీ, ప్రజల మనసుల్లో ఉన్న కేసీఆర్ను తొలగించడం సాధ్యం కాదని అన్నారు. ఇప్పుడు ప్రజల్లో కాంగ్రెస్ పాలనపై తీవ్ర అసంతృప్తి నెలకొంది. ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని, మరోసారి బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందన్నది అనివార్యమని బాల్క సుమన్ ధీమా వ్యక్తం చేశారు.
EX MLA Shakeel: ఆరోగ్య సమస్యల వల్ల దుబాయ్ వెళ్లా.. కార్యకర్తలకు దూరమయ్యా!
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!