VeeraSimha Reddy :శివాలెత్తిస్తోన్న ‘వీరసింహా రెడ్డి’ ఫస్ట్ సింగిల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VeeraSimha Reddy : నటసింహ నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’లోని ఫస్ట్ సింగిల్ ముహూర్త సమయానికి నవంబర్ 25 ఉదయం 10 గంటల 29 నిమిషాలకు అభిమానులను పలకరించింది. “రాజసం నీ ఇంటి పేరు… పౌరుషం నీ ఒంటి పేరు… నిన్ను తలచుకున్నవారు లేచి నుంచుని మొక్కుతారు…” అంటూ మొదలయ్యే ఈ పాట నందమూరి ఫ్యాన్స్ ను పులకింప చేసింది. ఎందుకంటే బాలయ్య ఫ్యాన్ ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకొనే రచయిత రామజోగయ్య శాస్త్రి పదాలు పలికించినట్టు కనిపిస్తోంది. అలాగే అందుకు తగ్గ బాణీలు సమకూర్చిన ఎస్. థమన్, పాటలోనూ చిందులేస్తూ కనిపించడం మరో విశేషం! ‘అఖండ’లో బాలకృష్ణ అభిమానులను పులకింప చేస్తూ “జై బాలయ్యా…జై జై బాలయ్యా…” అంటూ సాగే పాటతో అదరహో అనిపించారు థమన్. అదే తీరున ఇందులోనూ “జై బాలయ్యా… జై బాలయ్యా… జై జై బాలయ్యా…” అనీ గాయకుడు కరిముల్లా నోట పలికింప చేశారు. అందుకే అభిమానులు పులకించిపోతున్నారు. ఈ పాటను జనసమూహాల మధ్య, దేవాలయాల పరిసరాల్లో చిత్రీకరించడం మరింత శోభనిచ్చింది. ఈ పాటకు శంకర్ నృత్య దర్శకత్వం వహించారు.
Read Also: Thodelu Movie Review: తోడేలు రివ్యూ (హిందీ డబ్బింగ్)
Also Read
- Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
- Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
- Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాల గుర్తింపు.! విచారణకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ..
- AIIMS Study: వాయు కాలుష్యంతో కడుపులోని బిడ్డ ఎదుగుదలకు బ్రేక్.. ఎయిమ్స్ పరిశోధనలో షాకింగ్ విషయాలు!
ఈ ఫస్ట్ సింగిల్ ఆరంభంలోనే బాలకృష్ణ రథం లాగుతూ కనిపిస్తారు. ఆయనను చూసి జనం పాట పాడేలా చిత్రీకరించారు. జనంతో పాటు మధ్య మధ్యలో బాలయ్య సైతం స్టెప్స్ వేయడం అలరిస్తుంది. స్పాట్ షాట్స్ సైతం ఆకట్టుకుంటాయి. “అచ్చ తెలుగు పౌరుషాల రూపం నీవయ్యా… అలనాటి రాయలోరి తేజం నువ్వయ్యా… మా తెల్లవారే పొద్దు నువ్వై పుట్టినావయ్యా… మా మంచి చెడ్డల్లోన జత కట్టినావయ్యా… జన్మబంధువంటూ నీకు జై కొట్టినామయ్యా…” అంటూ తరువాత పాట హుషారెక్కిస్తుంది. ఆపై “జై బాలయ్యా…జై బాలయ్యా… జై జై బాలయ్యా…” అంటూ మరింత ఉత్సాహం కలిగించేలా రామజోగయ్య కలం సాగిందని చెప్పవచ్చు. “మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా…” అనీ మరింతగా మురిపించారు.
Read Also: Minister KTR: శిల్పా లేఔట్ ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
పాట చూస్తోంటే బాలయ్యకు ఉన్న ‘మేన్ ఆఫ్ మాసెస్’ అనే ఇమేజ్ కు తగ్గట్టుగా చిత్రీకరించినట్టు కనిపిస్తోంది. సంక్రాంతి కానుకగా రానున్న ఈ చిత్రాన్ని గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు. పాటలో పదాల జాతరకు తగ్గట్టుగానే చిత్రీకరణలోనూ జాతర చూపించారు మలినేని గోపీచంద్. ఆయన దర్శకత్వానికి తగ్గట్టుగా రిషి పంజాబీ కెమెరా పనితనం సైతం కనువిందు చేస్తుంది. అలా విడుదలయిందో లేదో ఇలా ఈ పాటను అభిమానులు విశేషంగా చూస్తున్నారు. మరి సినిమా వారిని ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
-
Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
-
Thalaivar173 : డాక్టర్ గా సూపర్ స్టార్.. డైరెక్టర్ ఎవరంటే
-
Most Valuable Celebrities List : మోస్ట్ వ్యాల్యుబుల్ సెలబ్రిటి లిస్ట్ విడుదల.. టాప్ ప్లేస్లో ఎవరున్నారు? అల్లు అర్జున్ ర్యాంక్ ఎంత?
-
Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాల గుర్తింపు.! విచారణకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ..
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!