Pune car crash: నిరసనలకు దిగొచ్చిన కోర్టు.. నిందితులకు బెయిల్ రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పూణెలో ఇద్దరు ఐటీ నిపుణుల మృతికి కారణమైన బాలుడికి గంటల వ్యవధిలోనే బెయిల్ మంజూరు చేయడంపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. మహారాష్ట్రలోనూ బాధిత కుటుంబాలు, ప్రజల నుంచి ఆందోళనలు వ్యక్తం చేయడంతో న్యాయస్థానం దిగొచ్చింది. దీంతో మైనర్ బాలుడికి మంజూరు చేసిన బెయిల్ను జువైనల్ జస్టిస్ బోర్డు రద్దు చేసింది. బాలనేరస్థుడిని జూన్ 5 వరకు రిమాండ్ హోమ్కు పంపింది. అతడిని వయోజనుడిగా విచారించాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకోలేదు.

Also Read
- టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
- Nagababu: జనసేన పార్టీ ఆ పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది.. ఎమ్మెల్సీ నాగబాబు కీలక వ్యాఖ్యలు.!
- Ketan Agarwal Case: షాపింగ్ కోసం కేతన్ నుంచి రూ.కోటి కొట్టేసిన సియా.. అవి ఎవరికిచ్చిందంటే..!
- Modi-Mojtaba: మోడీకి ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా లేఖ.. సారాంశం ఇదే!
ఆదివారం అర్ధరాత్రి పలువురు బాలురు బార్లో పీకలదాక మద్యం తాగి అనంతరం అత్యంత వేగంగా పోర్షే కారును నడపడంతో ఇద్దరు టెకీలు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం సంఘటనాస్థలికి పోలీసులు చేరుకుని నిందితుల్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ధర్మాసనం యాక్సిడెంట్కు కారణమైన బాలుడికి బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా రోడ్డుప్రమాదాలపై వ్యాసం రాసుకుని రమ్మని చెప్పింది. వ్యక్తిగత బాండ్, రవాణా కార్యాలయాన్ని సందర్శించి అన్ని నియమాలు, నిబంధనలు అధ్యయనం చేసి ప్రజెంటేషన్ ఇవ్వాలని తెలిపింది. మానసిక వైద్యులను సంప్రదించాలని సూచించింది. ఈ తీర్పు దేశ వ్యాప్తంగా ఆగ్రహాన్ని తెప్పింది.
ఇది కూడా చదవండి: AAP: ఢిల్లీలో నీటి సంక్షోభానికి బీజేపీ కుట్ర
బాధిత కుటుంబాలు న్యాయస్థానం తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. అంతేకాకుండా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవిస్ కూడా ఈ తీర్పును తప్పుపట్టారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. పోలీస్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇక సోషల్ మీడియా వేదికగా కోర్టుపై నెటిజన్లు మండిపడ్డారు. మొత్తానికి నిరసనలకు తలొగ్గి బెయిల్ రద్దు చేసింది.
12వ తరగతి ఫలితాల సందర్భంగా పూణెలోని రెండు పబ్బుల్లో స్నేహితులతో కలిసి మద్యం సేవించిన బాలుడు.. బైక్పై వెళ్తున్న 24 ఏళ్ల ఐటీ నిపుణులను కళ్యాణి నగర్ ప్రాంతంలోని 2.15 గంటల ప్రాంతంలో ఢీకొట్టాడు. బైక్ నడుపుతున్న అనీష్ అవధియా ఎగిరిపోయి ఆగి ఉన్న కారును ఢీకొట్టగా.. అశ్విని కోష్ట 20 అడుగుల ఎత్తులో గాలిలోకి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
ఇది కూడా చదవండి: Ebrahim Raisi: భారత్ తరుపున ఇరాన్ అధ్యక్షుడి అంత్యక్రియలకు హాజరైన ఉపరాష్ట్రపతి..
తాజావార్తలు
-
Minister Seethakka : కేంద్రానికి తెలంగాణ కౌంటర్.. సీతక్క వినతిలో కీలక డిమాండ్లు.!
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Market Crash: స్విగ్గీ, జొమాటోలకు రూ.1.41 లక్షల కోట్ల భారీ లాస్.. ఏం జరిగిందంటే?
-
Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
-
Tollywood: 2026 సెకండాఫ్ సినిమాలపైనే ఆశలు!
ట్రెండింగ్
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!