Police Brutality : అమాయకులపై బాచుపల్లి పోలీసుల జులుం…
రక్షించాల్సిన రక్షకభటులే.. భక్షిస్తున్నారు.. తప్పుచేయనివారిని హింసించి.. తప్పు ఒప్పుకోవాలంటూ చిత్రహింసలకు గురిచేస్తున్న ఘటన ఇది. అమాయకులపై బాచుపల్లి పోలీసుల జులుం వెలుగులోకి వచ్చింది. చేయని దొంగతనం ఒప్పుకో వాలంటూ చిత్ర హింసలు గురిచేశారు. దెబ్బలు తాళలేక చేయని నేరం ఒప్పుకుంది లక్ష్మి అనే మహిళ .. ఏదో ఒకటి తెచ్చిస్తేనే వదిలేస్తామని పోలీసుల ఆల్టిమేటం జారీ చేసింది. దీంతో చేసేదేం లేక.. భయంతో బాబాయ్ రాజేష్ చైన్ ను పోలీసులకు తెచ్చి ఇచ్చింది లక్ష్మీ.. అయినప్పటికీ వదలని రాక్షస రక్షకభటులు.. లక్ష్మిని రాజేష్ ను స్టేషన్ కు రావాలంటున్న సీఐ ఉపేంద్ర, ఎస్సై చంద్ర శేఖర్ హుకుం జారీ చేశారు. దీంతో.. చేయని నేరానికి స్టేషన్ ముందు పురుగుల మందు తాగాడు రాజేష్. దీంతో.. రాజేష్ ను గుట్టు చప్పుడు కాకుండా S.L.G hospitel లో జాయిన్ చేశారు పోలీసులు. అంతేకాకుండా.. ఖర్చు భరిస్తామని ఆసుపత్రి యాజమాన్యంకు హామీ ఇచ్చాడు సీఐ. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో రాజేష్ కొట్టుమిట్టాడుతున్నాడు. జరిగిన ఉదంతంతో లక్ష్మీ తో రాజీకి పోలీసులు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!
- KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..
- Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
- Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..
పోలీసుల వివరణ ఇలా… Pathan Mahabub Jani, Times of India Journalist , Bachupally అను వ్యక్తి తేదీ: 19.06.2024 నాడు తన ఇంట్లో 1) ఒక బంగారు చైన్, 2) ఒక బంగారు నెక్లెస్ మరియు 3) ఒక జత బంగారు చెవి కమ్మలు ఇట్టి మొత్తం వస్తువులు సుమారు 5 తులాల గలవి తేదీ:16.06.2024 నాడు దొంగాలిచబడినవి అని ఫిర్యాదు ఇవ్వగా బాచుపల్లి పోలీస్ వారు Cr No 605/2024 U/s 380 IPC Of PS Bachupally క్రింద కేసు నమోదు చేసినాము. సదరు ఫిర్యాదు దారుడు గారు ఇట్టి దొంగతనం వాళ్ళ ఇంట్లో పని చేసే పని మనిషి అయిన చిత్తారపు లక్ష్మి అను ఆమె పై దొంగతనం చేసి ఉండవచ్చు అని అనుమానం తెలపాగా క్రైమ్ పోలీసు వారు తేదీ: 01.07.2024 నాడు సదరు చిత్తారపు లక్ష్మి ని మహిళా పోలీస్ సమక్షములో విచారణించగా తెలిపినది కదా, ఫిర్యాదు దారుడు వాళ్ళ ఇంట్లో పని చేయుటకు వెళ్ళి బంగారు చైన్ ను దొంగలించి అట్టి చైన్ ను మా ఆడపడుచు భర్త అయైన రాజేష్ కు ఇచ్చినాను తెలిపింది.
-రాజేశ్ ను కేసు నమోదు (19th June-2024 ) నుండి ఒక రోజు కూడా పిఎస్ కు పిలువ లేదు.
-లక్ష్మిని కూడా మహిళా సిబ్బంది సమక్షములో విచారణ చేసినాము.
-ఈ రోజు రాజేశ్ అతని భార్య ఇద్దరు కలసి SLG Hospital Bachupally కి వెళ్ళి అడ్మిట్ అయినారు.
-అతను ప్రస్తుతం ఆరోగ్యంగా బాగానే ఉంది మాట్లాడుతున్నాడు.) అని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!
-
Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
-
KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..
-
Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
-
Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో