Asaduddin Owaisi: ముస్లింల నుంచి క్రమపద్ధతిలో బాబ్రీ మసీదుని లాక్కున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: రామ మందిర ప్రాణప్రతిష్ట వేడుక ముందు ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం కర్ణాటక కలబురిగిలో మీడియాతోమాట్లాడుతూ.. బాబ్రీ మసీదును ముస్లింల నుంచి ‘‘క్రమపద్ధతి’’లో లాక్కున్నారని అన్నారు. 1992లో బాబ్రీ మసీదును కూల్చివేయకుంటే ఈ రోజు ముస్లింలు ఇలాంటి వాటిని చూడాల్సిన అవసరం ఉండేది కాదన్నారు.
Read Also: Bhatti Vikramarka: ధనిక రాష్టాన్ని బీఆర్ఎస్ చేతుల్లో పెడితే ఆగం అయ్యింది..
Also Read
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
- Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
- Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
- Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
ముస్లింలు 500 ఏళ్లుగా బాబ్రీ మసీదులో నమాజ్ చేశారని, కాంగ్రెస్ పార్టీకి చెందిన జీబీ పంత్ యూపీ సీఎంగా ఉన్నప్పుడు మసీదులో విగ్రహాలు పెట్టారని ఆరోపించారు. ఆ సమయంలో అయోధ్య కలెక్టర్గా నాయర్ ఉండేవారని, ఆయన మసీదును మూసివేసి, అక్కడ పూజలు చేయడం ప్రారంభించారని అన్నారు. వీహెచ్పీ పుట్టినప్ప్పుడు రామమందిరం లేదని ఓవైసీ అన్నారు.
రామ మందిరం గురించి మహాత్మాగాంధీ ఎప్పుడూ ఏమీ ప్రస్తావించలేదని, చాలా క్రమపద్ధతిలో భారతీయ ముస్లింల నుంచి బాబ్రీని లక్కున్నారని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మెజారిటీ వర్గాలను సంతోషపెట్టే పనిలో నిమగ్నమయ్యాయని, మైనారిటీల గురించి మాట్లాడటం లేదని చెప్పారు. ఇండియా కూటమిలో ఉన్న ఆప్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రతీ మంగళవారం సుందరాకాండ పారయణం, హనుమాన్ చాలీసా నిర్వహిస్తామని చెబుతున్నారని, దీని గురించి ఎవరూ ఏమీ మాట్లాడటం లేదని, వారంతా మెజారిటీ వర్గాల ఓట్లను లక్ష్యంగా చేసుకునే పనిలో బిజీగా ఉన్నారని అసదుద్దీన్ ఓవైసీ దుయ్యబట్టారు.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
-
Gossip : రేపే థియేటర్లలో ‘గాసిప్’
-
Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
-
Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్లోకి స్వాగతం
-
Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!