PAK vs ENG: పాకిస్తాన్ విజయంపై బాబర్ ఆజం పోస్ట్ వైరల్..
- ఇంగ్లండ్ను ఓడించి సిరీస్ను 2-1తో కైవసం చేసుకున్న పాకిస్తాన్
- పాకిస్థాన్ ఆటగాళ్లకు మాజీ కెప్టెన్ బాబర్ ఆజం అభినందనలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నోమన్ అలీ, సాజిద్ ఖాన్ల స్పిన్ మాయజాలంతో శనివారం జరిగిన చివరి టెస్టు మ్యాచ్లో పాకిస్థాన్ తొమ్మిది వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను ఓడించి సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. దీంతో.. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 పట్టికలో పాకిస్తాన్ ఒక స్థానం ఎగబాకి ఏడవ స్థానానికి చేరుకుంది. ఆరో స్థానంలో ఇంగ్లండ్ ఉంది. ఇదిలా ఉంటే.. తొలి మ్యాచ్లో ఓటమి తర్వాత పాకిస్థాన్ క్రికెట్ బోర్డు జట్టులో భారీ మార్పులు చేసింది. బాబర్, షాహీన్, నసీమ్ షాలను జట్టు నుంచి తప్పించింది. ఇంగ్లండ్తో వరుసగా రెండో విజయం సాధించిన పాకిస్థాన్ ఆటగాళ్లకు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం అభినందనలు తెలిపాడు. ‘X’ లో స్పందిస్తూ.. “గొప్ప పునరాగమనం చేయడానికి అపూర్వమైన ప్రయత్నం. నోమన్ మరియు సాజిద్ అద్భుతమైన ప్రదర్శన చేశారు. పాకిస్థాన్ జట్టుకు అభినందనలు.’ అని ఎక్స్లో రాసుకొచ్చారు.
Phenomenal effort once again to make a grand comeback. Amazing turnaround by Noman and Sajid!
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
Congratulations, Team Pakistan 🇵🇰 ❤️ pic.twitter.com/J56VIITp5z
— Babar Azam (@babarazam258) October 26, 2024
Minister Gottipaati Ravi Kumar: గడిచిన ఐదేళ్లలో విద్యుత్ కొనుగోళ్లలో పారదర్శకత లేదు..
పాకిస్థాన్ స్పిన్నర్లు నోమన్ అలీ, సాజిద్ ఖాన్లు శనివారం ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ను మూడు రోజుల్లోనే ముగించారు. చివరిదైన మూడో టెస్టులో తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ను 2-1తో కైవసం చేసుకున్నారు. 38 ఏళ్ల లెఫ్టార్మ్ స్పిన్నర్ అలీ, 31 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్ ఖాన్ కలిసి రెండో టెస్టులో 20 వికెట్లు పడగొట్టారు. వీరిద్దరూ శనివారం మరోసారి అద్భుతం చేశారు. ఈ ఇద్దరు కలిసి 19 వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ మూడో రోజు 112 పరుగులకు కుప్పకూలింది. పాకిస్థాన్లో ఇంగ్లండ్కు ఇదే అత్యల్ప ఇన్నింగ్స్ స్కోరు. అంతకుముందు 1987లో లాహోర్లో ఇంగ్లండ్ జట్టు 130 పరుగులకే పరిమితమైంది. తొలి ఇన్నింగ్స్లో 77 పరుగుల ఆధిక్యంలో ఉన్న పాకిస్థాన్.. 36 పరుగుల విజయ లక్ష్యాన్ని అందుకుంది. లంచ్కు ముందు ఒక వికెట్కు 37 పరుగులు చేసి సాధించింది. ఈ విధంగా.. 2021 తర్వాత పాకిస్థాన్ తన మొదటి హోమ్ సిరీస్ను గెలుచుకుంది. 2021లో పాకిస్థాన్ 2-0తో దక్షిణాఫ్రికాను ఓడించింది. పాకిస్తాన్ ఈ విజయంతో రెండేళ్ల క్రితం బెన్ స్టోక్స్ నేతృత్వంలోని ఇంగ్లండ్ పర్యటనలో ఎదురైన 0-3 ఓటమికి ఆతిథ్య జట్టు ప్రతీకారం తీర్చుకుంది.
IND vs NZ: రోహిత్-కోహ్లీ వైఫల్యం నుండి పంత్ రనౌట్ వరకు.. భారత్ ఓటమికి కారణాలు ఇవే..!
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!