PAK vs ENG: పాకిస్తాన్ విజయంపై బాబర్ ఆజం పోస్ట్ వైరల్..
- ఇంగ్లండ్ను ఓడించి సిరీస్ను 2-1తో కైవసం చేసుకున్న పాకిస్తాన్
- పాకిస్థాన్ ఆటగాళ్లకు మాజీ కెప్టెన్ బాబర్ ఆజం అభినందనలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నోమన్ అలీ, సాజిద్ ఖాన్ల స్పిన్ మాయజాలంతో శనివారం జరిగిన చివరి టెస్టు మ్యాచ్లో పాకిస్థాన్ తొమ్మిది వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను ఓడించి సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. దీంతో.. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 పట్టికలో పాకిస్తాన్ ఒక స్థానం ఎగబాకి ఏడవ స్థానానికి చేరుకుంది. ఆరో స్థానంలో ఇంగ్లండ్ ఉంది. ఇదిలా ఉంటే.. తొలి మ్యాచ్లో ఓటమి తర్వాత పాకిస్థాన్ క్రికెట్ బోర్డు జట్టులో భారీ మార్పులు చేసింది. బాబర్, షాహీన్, నసీమ్ షాలను జట్టు నుంచి తప్పించింది. ఇంగ్లండ్తో వరుసగా రెండో విజయం సాధించిన పాకిస్థాన్ ఆటగాళ్లకు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం అభినందనలు తెలిపాడు. ‘X’ లో స్పందిస్తూ.. “గొప్ప పునరాగమనం చేయడానికి అపూర్వమైన ప్రయత్నం. నోమన్ మరియు సాజిద్ అద్భుతమైన ప్రదర్శన చేశారు. పాకిస్థాన్ జట్టుకు అభినందనలు.’ అని ఎక్స్లో రాసుకొచ్చారు.
Phenomenal effort once again to make a grand comeback. Amazing turnaround by Noman and Sajid!
Also Read
- Ananthika Sanilkumar: ‘ఎల్లమ్మ’లో హీరోయిన్ ఫిక్స్.. డీఎస్పీకి జోడీ ఎవరో తెలుసా?
- Cricket Record: 47 ఏళ్లకు అరంగేట్రం.. 51 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు.. క్రికెట్లో 96 ఏళ్ల రికార్డు బద్దలు..
- ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
- CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
Congratulations, Team Pakistan 🇵🇰 ❤️ pic.twitter.com/J56VIITp5z
— Babar Azam (@babarazam258) October 26, 2024
Minister Gottipaati Ravi Kumar: గడిచిన ఐదేళ్లలో విద్యుత్ కొనుగోళ్లలో పారదర్శకత లేదు..
పాకిస్థాన్ స్పిన్నర్లు నోమన్ అలీ, సాజిద్ ఖాన్లు శనివారం ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ను మూడు రోజుల్లోనే ముగించారు. చివరిదైన మూడో టెస్టులో తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ను 2-1తో కైవసం చేసుకున్నారు. 38 ఏళ్ల లెఫ్టార్మ్ స్పిన్నర్ అలీ, 31 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్ ఖాన్ కలిసి రెండో టెస్టులో 20 వికెట్లు పడగొట్టారు. వీరిద్దరూ శనివారం మరోసారి అద్భుతం చేశారు. ఈ ఇద్దరు కలిసి 19 వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ మూడో రోజు 112 పరుగులకు కుప్పకూలింది. పాకిస్థాన్లో ఇంగ్లండ్కు ఇదే అత్యల్ప ఇన్నింగ్స్ స్కోరు. అంతకుముందు 1987లో లాహోర్లో ఇంగ్లండ్ జట్టు 130 పరుగులకే పరిమితమైంది. తొలి ఇన్నింగ్స్లో 77 పరుగుల ఆధిక్యంలో ఉన్న పాకిస్థాన్.. 36 పరుగుల విజయ లక్ష్యాన్ని అందుకుంది. లంచ్కు ముందు ఒక వికెట్కు 37 పరుగులు చేసి సాధించింది. ఈ విధంగా.. 2021 తర్వాత పాకిస్థాన్ తన మొదటి హోమ్ సిరీస్ను గెలుచుకుంది. 2021లో పాకిస్థాన్ 2-0తో దక్షిణాఫ్రికాను ఓడించింది. పాకిస్తాన్ ఈ విజయంతో రెండేళ్ల క్రితం బెన్ స్టోక్స్ నేతృత్వంలోని ఇంగ్లండ్ పర్యటనలో ఎదురైన 0-3 ఓటమికి ఆతిథ్య జట్టు ప్రతీకారం తీర్చుకుంది.
IND vs NZ: రోహిత్-కోహ్లీ వైఫల్యం నుండి పంత్ రనౌట్ వరకు.. భారత్ ఓటమికి కారణాలు ఇవే..!
తాజావార్తలు
-
Ananthika Sanilkumar: ‘ఎల్లమ్మ’లో హీరోయిన్ ఫిక్స్.. డీఎస్పీకి జోడీ ఎవరో తెలుసా?
-
Cricket Record: 47 ఏళ్లకు అరంగేట్రం.. 51 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు.. క్రికెట్లో 96 ఏళ్ల రికార్డు బద్దలు..
-
Kangana Ranaut: కంగనా, రామ్దేవ్ వివాదానికి రాఖీతో ముగింపు.. మిఠాయిలతో మళ్లీ అన్నాచెల్లెళ్ల బంధం!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!