PAK vs ENG: పాకిస్తాన్ విజయంపై బాబర్ ఆజం పోస్ట్ వైరల్..
- ఇంగ్లండ్ను ఓడించి సిరీస్ను 2-1తో కైవసం చేసుకున్న పాకిస్తాన్
- పాకిస్థాన్ ఆటగాళ్లకు మాజీ కెప్టెన్ బాబర్ ఆజం అభినందనలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నోమన్ అలీ, సాజిద్ ఖాన్ల స్పిన్ మాయజాలంతో శనివారం జరిగిన చివరి టెస్టు మ్యాచ్లో పాకిస్థాన్ తొమ్మిది వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను ఓడించి సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. దీంతో.. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 పట్టికలో పాకిస్తాన్ ఒక స్థానం ఎగబాకి ఏడవ స్థానానికి చేరుకుంది. ఆరో స్థానంలో ఇంగ్లండ్ ఉంది. ఇదిలా ఉంటే.. తొలి మ్యాచ్లో ఓటమి తర్వాత పాకిస్థాన్ క్రికెట్ బోర్డు జట్టులో భారీ మార్పులు చేసింది. బాబర్, షాహీన్, నసీమ్ షాలను జట్టు నుంచి తప్పించింది. ఇంగ్లండ్తో వరుసగా రెండో విజయం సాధించిన పాకిస్థాన్ ఆటగాళ్లకు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం అభినందనలు తెలిపాడు. ‘X’ లో స్పందిస్తూ.. “గొప్ప పునరాగమనం చేయడానికి అపూర్వమైన ప్రయత్నం. నోమన్ మరియు సాజిద్ అద్భుతమైన ప్రదర్శన చేశారు. పాకిస్థాన్ జట్టుకు అభినందనలు.’ అని ఎక్స్లో రాసుకొచ్చారు.
Phenomenal effort once again to make a grand comeback. Amazing turnaround by Noman and Sajid!
Also Read
- Cockroach Trend Goes Global: పాకిస్థాన్కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్లో "కాక్రోచ్" పేరుతో కొత్త పార్టీలు..
- DMK vs TVK: టీవీకే అభ్యర్థుల విద్యా అర్హతలపై డీఎంకే సంచలన ఆరోపణలు.. ఫేక్ డిగ్రీలంటూ ఆధారాల విడుదల..!
- Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్రావు కీలక వ్యాఖ్యలు..
- KTR: రైతుల కష్టాలపై కేటీఆర్ ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
Congratulations, Team Pakistan 🇵🇰 ❤️ pic.twitter.com/J56VIITp5z
— Babar Azam (@babarazam258) October 26, 2024
Minister Gottipaati Ravi Kumar: గడిచిన ఐదేళ్లలో విద్యుత్ కొనుగోళ్లలో పారదర్శకత లేదు..
పాకిస్థాన్ స్పిన్నర్లు నోమన్ అలీ, సాజిద్ ఖాన్లు శనివారం ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ను మూడు రోజుల్లోనే ముగించారు. చివరిదైన మూడో టెస్టులో తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ను 2-1తో కైవసం చేసుకున్నారు. 38 ఏళ్ల లెఫ్టార్మ్ స్పిన్నర్ అలీ, 31 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్ ఖాన్ కలిసి రెండో టెస్టులో 20 వికెట్లు పడగొట్టారు. వీరిద్దరూ శనివారం మరోసారి అద్భుతం చేశారు. ఈ ఇద్దరు కలిసి 19 వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ మూడో రోజు 112 పరుగులకు కుప్పకూలింది. పాకిస్థాన్లో ఇంగ్లండ్కు ఇదే అత్యల్ప ఇన్నింగ్స్ స్కోరు. అంతకుముందు 1987లో లాహోర్లో ఇంగ్లండ్ జట్టు 130 పరుగులకే పరిమితమైంది. తొలి ఇన్నింగ్స్లో 77 పరుగుల ఆధిక్యంలో ఉన్న పాకిస్థాన్.. 36 పరుగుల విజయ లక్ష్యాన్ని అందుకుంది. లంచ్కు ముందు ఒక వికెట్కు 37 పరుగులు చేసి సాధించింది. ఈ విధంగా.. 2021 తర్వాత పాకిస్థాన్ తన మొదటి హోమ్ సిరీస్ను గెలుచుకుంది. 2021లో పాకిస్థాన్ 2-0తో దక్షిణాఫ్రికాను ఓడించింది. పాకిస్తాన్ ఈ విజయంతో రెండేళ్ల క్రితం బెన్ స్టోక్స్ నేతృత్వంలోని ఇంగ్లండ్ పర్యటనలో ఎదురైన 0-3 ఓటమికి ఆతిథ్య జట్టు ప్రతీకారం తీర్చుకుంది.
IND vs NZ: రోహిత్-కోహ్లీ వైఫల్యం నుండి పంత్ రనౌట్ వరకు.. భారత్ ఓటమికి కారణాలు ఇవే..!
తాజావార్తలు
-
Tiger Attack: ఘోరం.. తునికాకు కోసం అడవికి వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి
-
Aadarsha Kutumbam AK47:వెంకీ – త్రివిక్రమ్ క్రేజీ ప్రాజెక్ట్లో..మరో బ్యూటీ ఎంట్రీ..!
-
Cockroach Trend Goes Global: పాకిస్థాన్కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్లో “కాక్రోచ్” పేరుతో కొత్త పార్టీలు..
-
DMK vs TVK: టీవీకే అభ్యర్థుల విద్యా అర్హతలపై డీఎంకే సంచలన ఆరోపణలు.. ఫేక్ డిగ్రీలంటూ ఆధారాల విడుదల..!
-
Eric Simons: ఐపీఎల్లో ధోని భవిష్యత్తు ఏంటి?.. వచ్చే సీజన్లో ఆడుతాడా?.. చెన్నై కోచ్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!