Lawrence Bishnoi Gang: 700 మంది షూటర్లు.. 11 రాష్ట్రాల్లో నెట్వర్క్.. మరో దావూద్ ఇబ్రహీం!
- 700 మంది షూటర్లు..
- 11 రాష్ట్రాల్లో నెట్వర్క్..
- మరో దావూద్ ఇబ్రహీం ని తలపిస్తున్న గ్యాంగ్
- ఈ గ్యాంగ్ గురించి పూర్తి వివరాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీపై బహిరంగంగా కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. ఈ హత్య వెనుక లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుల పేర్లు మరోసారి వెలుగులోకి వచ్చాయి. సల్మాన్ ఖాన్కు ఎవరు సహాయం చేసినా అవే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఫేస్బుక్ పోస్ట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశారు. మొట్టమొదట సిద్ధూ మూసేవాలా ఇప్పుడు బాబా సిద్దిఖీ హత్యలతో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఇప్పుడు క్రైమ్ ప్రపంచానికి మకుటం లేని రాజుగా మారే మార్గంలో ఉంది. రెండు దశాబ్దాల క్రితం అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం చేసినట్లే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ భీభత్సం విస్తరిస్తోంది. దావూద్ పేరు వింటేనే ప్రజలు వణికిపోయేవారు. లారెన్స్ బిష్ణోయ్ పని విధానం కొద్దిగా భిన్నంగా ఉన్నప్పటికీ, అది అదే దిశలో సాగుతోంది.
16 మంది గ్యాంగ్స్టర్లపై యూఏపీఏ చట్టం కింద ఛార్జ్ షీట్ ..
లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్లతో సహా 16 మంది గ్యాంగ్స్టర్లపై యూఏపీఏ చట్టం కింద ఛార్జ్ షీట్ దాఖలైంది. ఎన్ఐఏ తన ఛార్జిషీట్లో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ను దావూద్ ఇబ్రహీం యొక్క డీ-కంపెనీతో పోల్చింది. దావూద్ ఇబ్రహీం 90వ దశకంలో చిన్న చిన్న నేరాల నుంచి తన నెట్వర్క్ను ఏర్పరచుకున్న విధంగానే లారెన్స్ బిష్ణోయ్ ఉగ్రవాద సిండికేట్ పనిచేస్తున్నట్లు ఎన్ఐఏ ఛార్జ్ షీట్ వెల్లడించింది. దావూద్ ఇబ్రహీం మాదకద్రవ్యాల అక్రమ రవాణా, టార్గెట్ హత్యలు, దోపిడీ రాకెట్ల ద్వారా తన నెట్వర్క్ను విస్తరించాడు. తరువాత డి-కంపెనీని ఏర్పాటు చేయడానికి పాకిస్థాన్ ఉగ్రవాదులతో కలిసి పనిచేశాడు. అదే విధంగా చిన్న చిన్న నేరాలతో మొదలైన బిష్ణోయ్ గ్యాంగ్ సొంతంగా ముఠాగా ఏర్పడి ఇప్పుడు ఉత్తర భారతాన్ని శాసిస్తున్నది.
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
బిష్ణోయ్ గ్యాంగ్లో 700 మందికి పైగా షూటర్లు..
లారెన్స్ బిష్ణోయ్ ముఠాను కెనడా పోలీసులు, భారతీయ ఏజెన్సీల దృష్టిలో వాంటెడ్ క్రిమినల్ అయిన సత్వీందర్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ నడుపుతున్నాడు. బిష్ణోయ్ గ్యాంగ్లో 700 మందికి పైగా షూటర్లు ఉన్నారని, వారిలో 300 మంది పంజాబ్తో సంబంధం ఉన్నారని ఎన్ఐఏ ఛార్జ్ షీట్ వెల్లడించింది. బిష్ణోయ్, గోల్డీ బ్రార్ చిత్రాలు ఫెస్బుక్ , ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో పోస్ట్ చేయబడ్డాయి. కోర్టుకు వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు బిష్ణోయ్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల యువతలో ముఠాలో చేరాలనే ఆకాంక్ష పెరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. 2020-21 నాటికి బిష్ణోయ్ గ్యాంగ్ దోపిడీ ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించి ఆ డబ్బును హవాలా మార్గాల ద్వారా విదేశాలకు పంపించారు.
ఏయే రాష్ట్రాల్లో ఈ ముఠా విస్తరించింది?
ఎన్ఐఏ నివేదిక ప్రకారం.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఒకప్పుడు పంజాబ్కు మాత్రమే పరిమితం చేయబడింది. అయితే లారెన్స్ బిష్ణోయ్ తన సన్నిహిత సహచరుడు గోల్డీ బ్రార్ సహాయంతో హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్లోని ముఠాలతో కూటమిగా ఏర్పడి భారీ నెట్వర్క్ను సృష్టించాడు. ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, జార్ఖండ్లతో సహా ఉత్తర భారతదేశంలో విస్తరించింది. యువతను ముఠాల్లోకి చేర్చుకోవడానికి సోషల్ మీడియాతోపాటు అనేక ఇతర మార్గాలను ఉపయోగిస్తున్నారు.
విదేశీ కలలతో ప్రలోభపెట్టే
ముఠాలు యువతను కెనడాకు లేదా వారికి నచ్చిన దేశానికి తీసుకువెళతామని హామీ ఇస్తూ వారిని ఆకర్షిస్తాయి. ఎన్ఐఏ ప్రకారం.. పాకిస్థాన్కు చెందిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్విందర్ సింగ్ రిండా పంజాబ్లో లక్ష్య హత్యలు, నేర కార్యకలాపాలు నిర్వహించడానికి బిష్ణోయ్ షూటర్లను ఉపయోగిస్తాడు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..