Akhilesh Yadav : ఆడపిల్లల విషయంలో కోర్టును ఆశ్రయించిన అఖిలేష్ యాదవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhilesh Yadav : అయోధ్యలో 12 ఏళ్ల మైనర్పై జరిగిన అత్యాచారం కేసు రాజకీయ రూపం దాల్చింది. ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత, అయోధ్యలోని పూరకలందర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్పై అత్యాచారం చేసిన ఆరోపణలపై సమాజ్వాదీ పార్టీ భదర్స నగర్ అధ్యక్షుడు మోయిద్ ఖాన్, సర్వెంట్ రాజు ఖాన్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కారణంగా సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్లో పోస్ట్ చేసి, అత్యాచార బాధితులకు ప్రభుత్వం ఉత్తమ వైద్య సదుపాయాలను అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆడపిల్లల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. దీనిపై సమాజ్ వాజ్ పార్టీ అధినేత కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని.. పరిస్థితిని అర్థం చేసుకుని దర్యాప్తులో బాధుతులకు సాధ్యమైన భద్రతను అందించాలని అఖిలేష్ యాదవ్ కోరారు. ఇంతకు ముందు కూడా అఖిలేష్ ట్వీట్ చేసి బాధితురాలికి డిఎన్ఎ పరీక్ష చేయాలని డిమాండ్ చేశారు.
Read Also:Krmb-Grmb Meeting: ఈనెల 13,14 జీఆర్ఎంబీ, జీఆర్ఎంబీ సమావేశం..
Also Read
- Bhagirath Choudhary: మంత్రే లబ్ధిదారుడు.. సొంత మంత్రిత్వ శాఖ పథకం నుంచి రూ.99 లక్షల సబ్సిడీ..
- Herbal Hair Care: షాంపూలు రాకముందు జుట్టు మెరిసేలా ఉంచిన సహజ చిట్కాలు ఇవే..
- FIH Pro League: క్రికెట్ మాత్రమే కాదు.. హాకీలోనూ పాకిస్థాన్ను చిత్తుచిత్తుగా ఓడించిన భారత్.!
- Pawan Kalyan: జనసేన కీలక సమావేశం.. 25 పార్లమెంట్ కమిటీలతో పవన్ ప్రత్యేక భేటీ
యోగి ప్రభుత్వం దాడిపై అఖిలేష్ స్పందన
నిందితులు ఎస్పీ నేతతో సంబంధాన్ని కలిగి ఉన్నారు, దీనిపై రాష్ట్ర యోగి ప్రభుత్వం సమాజ్ వాదీ పార్టీకి వ్యతిరేకంగా గళం పెంచింది. ఈ విషయంపై యోగి ప్రభుత్వం ఎస్పీని కూడా కార్నర్ చేసి, నిందితుడు సమాజ్వాదీ పార్టీకి చెందినవాడని, అతను సమాజ్వాదీ పార్టీ ఎంపీతో తిరుగుతున్నాడని అన్నారు. ఇలాంటి నేరస్తులను కాల్చిచంపకపోతే పూలమాల వేస్తారా? అని ప్రశ్నించారు. యోగి ప్రభుత్వ దాడులపై ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ, ఇలాంటి సంఘటనలను రాజకీయం చేయాలనే దురుద్దేశంతో ఉన్న వ్యక్తుల ప్రణాళిక ఎప్పటికీ విజయవంతం కాకూడదన్నారు.
Read Also:Lovers On Bike: ఛీ.. ఛీ.. పట్టపగలు ప్రేమికులు నడిరోడ్డుపై బరితెగించారుగా..
12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం
అయోధ్యలో 12 ఏళ్ల మైనర్పై అత్యాచారం కేసు వెలుగులోకి రావడంతో కలకలం రేగింది. నిందితులు మైనర్తో నేరం చేయడమే కాకుండా ఆమెపై అసభ్యకరమైన వీడియో కూడా తీశారు, ఆ తర్వాత వారు ఆమెతో ఒకసారి కాదు చాలాసార్లు నేరానికి పాల్పడ్డారు. అయితే మైనర్ బాధితురాలు గర్భం దాల్చడంతో మైనర్పై అత్యాచారం జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. సుమారు రెండున్నర నెలల క్రితం మైనర్ బాధితురాలు కూలి పని చేసి పొలం నుంచి తిరిగి వస్తుండగా, బేకరీ యజమాని మొయీద్ ఖాన్ తనను కలవడానికి పిలిచాడని సర్వెంట్ రాజు బాధితురాలితో చెప్పగా, ఆ తర్వాత మొయీద్తో ఈ నేరానికి పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత సర్వెంట్ రాజు కూడా మైనర్పై అత్యాచారం చేశాడు. విచారణ అనంతరం నిందితులు మొయీద్ఖాన్, పనిమనిషి రాజుఖాన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
Samantha : సమంత వర్సెస్ శోభితా-చైతూ.. విడిపోయినా ఆగని సోషల్ మీడియా వార్!
-
Rahul Dev: భార్య మరణంతో కుప్పకూలిపోయా.. కొడుకే నా జీవితాన్ని మార్చేశాడు: రాహుల్ దేవ్
-
Bhagirath Choudhary: మంత్రే లబ్ధిదారుడు.. సొంత మంత్రిత్వ శాఖ పథకం నుంచి రూ.99 లక్షల సబ్సిడీ..
-
Herbal Hair Care: షాంపూలు రాకముందు జుట్టు మెరిసేలా ఉంచిన సహజ చిట్కాలు ఇవే..
-
FIH Pro League: క్రికెట్ మాత్రమే కాదు.. హాకీలోనూ పాకిస్థాన్ను చిత్తుచిత్తుగా ఓడించిన భారత్.!
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!