Akhilesh Yadav : ఆడపిల్లల విషయంలో కోర్టును ఆశ్రయించిన అఖిలేష్ యాదవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhilesh Yadav : అయోధ్యలో 12 ఏళ్ల మైనర్పై జరిగిన అత్యాచారం కేసు రాజకీయ రూపం దాల్చింది. ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత, అయోధ్యలోని పూరకలందర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్పై అత్యాచారం చేసిన ఆరోపణలపై సమాజ్వాదీ పార్టీ భదర్స నగర్ అధ్యక్షుడు మోయిద్ ఖాన్, సర్వెంట్ రాజు ఖాన్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కారణంగా సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్లో పోస్ట్ చేసి, అత్యాచార బాధితులకు ప్రభుత్వం ఉత్తమ వైద్య సదుపాయాలను అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆడపిల్లల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. దీనిపై సమాజ్ వాజ్ పార్టీ అధినేత కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని.. పరిస్థితిని అర్థం చేసుకుని దర్యాప్తులో బాధుతులకు సాధ్యమైన భద్రతను అందించాలని అఖిలేష్ యాదవ్ కోరారు. ఇంతకు ముందు కూడా అఖిలేష్ ట్వీట్ చేసి బాధితురాలికి డిఎన్ఎ పరీక్ష చేయాలని డిమాండ్ చేశారు.
Read Also:Krmb-Grmb Meeting: ఈనెల 13,14 జీఆర్ఎంబీ, జీఆర్ఎంబీ సమావేశం..
Also Read
- Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్పై సస్పెన్స్..
- 185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
యోగి ప్రభుత్వం దాడిపై అఖిలేష్ స్పందన
నిందితులు ఎస్పీ నేతతో సంబంధాన్ని కలిగి ఉన్నారు, దీనిపై రాష్ట్ర యోగి ప్రభుత్వం సమాజ్ వాదీ పార్టీకి వ్యతిరేకంగా గళం పెంచింది. ఈ విషయంపై యోగి ప్రభుత్వం ఎస్పీని కూడా కార్నర్ చేసి, నిందితుడు సమాజ్వాదీ పార్టీకి చెందినవాడని, అతను సమాజ్వాదీ పార్టీ ఎంపీతో తిరుగుతున్నాడని అన్నారు. ఇలాంటి నేరస్తులను కాల్చిచంపకపోతే పూలమాల వేస్తారా? అని ప్రశ్నించారు. యోగి ప్రభుత్వ దాడులపై ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ, ఇలాంటి సంఘటనలను రాజకీయం చేయాలనే దురుద్దేశంతో ఉన్న వ్యక్తుల ప్రణాళిక ఎప్పటికీ విజయవంతం కాకూడదన్నారు.
Read Also:Lovers On Bike: ఛీ.. ఛీ.. పట్టపగలు ప్రేమికులు నడిరోడ్డుపై బరితెగించారుగా..
12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం
అయోధ్యలో 12 ఏళ్ల మైనర్పై అత్యాచారం కేసు వెలుగులోకి రావడంతో కలకలం రేగింది. నిందితులు మైనర్తో నేరం చేయడమే కాకుండా ఆమెపై అసభ్యకరమైన వీడియో కూడా తీశారు, ఆ తర్వాత వారు ఆమెతో ఒకసారి కాదు చాలాసార్లు నేరానికి పాల్పడ్డారు. అయితే మైనర్ బాధితురాలు గర్భం దాల్చడంతో మైనర్పై అత్యాచారం జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. సుమారు రెండున్నర నెలల క్రితం మైనర్ బాధితురాలు కూలి పని చేసి పొలం నుంచి తిరిగి వస్తుండగా, బేకరీ యజమాని మొయీద్ ఖాన్ తనను కలవడానికి పిలిచాడని సర్వెంట్ రాజు బాధితురాలితో చెప్పగా, ఆ తర్వాత మొయీద్తో ఈ నేరానికి పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత సర్వెంట్ రాజు కూడా మైనర్పై అత్యాచారం చేశాడు. విచారణ అనంతరం నిందితులు మొయీద్ఖాన్, పనిమనిషి రాజుఖాన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: లార్డ్స్లో భారత్తో చివరి వన్డే.. ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్!
-
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
-
Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్తో మోసం.. ‘బాస్ స్కామ్’పై సెబీ హెచ్చరిక..
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
-
Vikram-1: విక్రమ్-1 రాకెట్లో అంతరిక్షంలోకి ప్రధాని మోడీ చేతిరాత పోస్ట్కార్డ్.. చరిత్ర సృష్టించనున్న మిషన్ ఆగమన్
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!