Ayodhya Donation Theft Case: నిందితులకు షాక్.. వాదిస్తే రూ.5 లక్షల జరిమానా.. బార్ అసోసియేషన్ సంచలన నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya Donation Theft Case: అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం కేసులో అరెస్టైన ఎనిమిది మంది నిందితులకు న్యాయ సహాయం అందించబోమని ఫైజాబాద్ బార్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితుల తరఫున ఎవరైనా న్యాయవాది కోర్టులో హాజరైతే రూ.5 లక్షల జరిమానా విధిస్తామని అసోసియేషన్ హెచ్చరించింది. సోమవారం జరిగిన సాధారణ సమావేశంలో ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు.
భక్తుల మనోభావాల దృష్ట్యా నిర్ణయం
రామమందిరానికి భక్తులు సమర్పించిన విరాళాల దుర్వినియోగం ఆరోపణలు తమ మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని ఫైజాబాద్ బార్ అసోసియేషన్ కార్యదర్శి శైలేంద్ర జైస్వాల్ తెలిపారు. అందుకే నిందితుల తరఫున వాదించకూడదని సభ్యులంతా నిర్ణయించినట్లు వెల్లడించారు.
Also Read
- AIADMK MLA Resignation: ఏఐఏడీఎంకేకు మరో షాక్.. ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ రాజీనామా
- Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
- Mustard Oil Ban in US: భారత్లో హెల్దీ.. అమెరికాలో నిషేధం.. ఆవ నూనెపై నిజాలు ఇవే..!
- iPhone 18 Launch Date: యాపిల్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 18 ప్రో లాంచ్ డేట్ లీక్..! ఫీచర్లు, ధరలు వైరల్..
ట్రస్ట్ మాజీ ప్రతినిధులపై కూడా డిమాండ్
సమావేశంలో పలువురు న్యాయవాదులు శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్తో అనుబంధం ఉన్న చంపత్ రాయ్, అనిల్ మిశ్రా, గోపాల్ రావు అయోధ్యను మూడు రోజుల్లో వీడాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే నగరాన్ని దిగ్బంధిస్తూ ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఎనిమిది మంది నిందితులు జ్యుడీషియల్ కస్టడీలో
అవినాశ్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవ్ కుష్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, కరుణేష్ పాండే, రామ్ శంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ, రామశంకర్ అలియాస్ తిన్నూ యాదవ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా రామమందిర విరాళాల నగదు, విలువైన వస్తువుల లెక్కింపులో పనిచేసిన వారేనని, విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై జూన్ 29 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు అధికారులు తెలిపారు.
విస్తరిస్తున్న దర్యాప్తు
కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో నిందితుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలు, ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. అలాగే మాజీ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వాంగ్మూలాన్ని ఇప్పటికే నమోదు చేసిన పోలీసులు, అవసరమైతే ఇతర ట్రస్ట్ ప్రతినిధుల వాంగ్మూలాలను కూడా నమోదు చేయనున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Ayodhya Donation Theft Case: నిందితులకు షాక్.. వాదిస్తే రూ.5 లక్షల జరిమానా.. బార్ అసోసియేషన్ సంచలన నిర్ణయం
-
AIADMK MLA Resignation: ఏఐఏడీఎంకేకు మరో షాక్.. ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ రాజీనామా
-
OG 2: పవన్ కళ్యాణ్ సరసన బుట్టబొమ్మ?.. పూజా హెగ్డేకు భారీ కమ్బ్యాక్ దక్కిందా?
-
Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
-
Kakanmath Temple: ఈ ఆలయాన్ని దెయ్యాలు నిర్మించాయా? వెయ్యేళ్లుగా చెక్కుచెదరని రహస్యం ఇదేనా?
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!