Cyberabad CP: సైబరాబాద్ లో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నేరాల సంఖ్య పెరిగింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైబరాబాద్ పరిధిలో గతేడాది తో పోలిస్తే ఈ ఏడాది నేరాల సంఖ్య పెరిగిందని కమిషనర్ ఆఫ్ పోలీస్ అవినాష్ మహంతి తెలిపారు. గతేడాది 27, 322 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 29, 156 కేసులు రిజిస్ట్రల్ అయ్యాయి.. మహిళలపై నేరాలు తగ్గాయి.. ఈ ఏడాది 105 హత్య కేసులు నమోదు కాగా, సైబర్ క్రైమ్ నేరాలు పెరిగాయి.. గతేడాది 4, 850 కేసులు నమోదు కాగా 5, 342 సైబర్ క్రైమ్ కేసులు రికార్డ్ అయ్యాయి.. ఈ ఏడాది 3432 మందికి శిక్షలు ఖరారు అయినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక, 5342 సైబర్ క్రైమ్ కేసులు, సైబర్ క్రైమ్ ద్వారా 232 కోట్లు మాయం అయ్యాయి.. సైబర్ క్రైమ్ లో 46 కోట్లు రికవరీ చేశాం.. 277 డ్రగ్స్ కేసులు నమోదు,567 మంది అరెస్ట్ చేశామని సీపీ అవినాష్ మహంతి చెప్పుకొచ్చారు.
Read Also: Salaar: ‘సలార్’ నాన్ RRR రికార్డ్… నైజాం కింగ్!
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
డ్రగ్స్ కేసుల్లో ఇద్దరిపై పీడీ యాక్ట్ నమోదు చేశామని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి పేర్కొన్నారు. 6, 676 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నాం.. డ్రగ్స్ కేసుల్లో 27 కోట్లు విలువ చేసే మత్తు పదార్ధులను అదుపులోకి తీసుకున్నాం.. 52, 124 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయి.. ట్రాఫిక్ ఉల్లంఘనల ద్వారా 104 కోట్ల రూపాయల చలాన్ లు విధించాం.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించిన 24, 318 మంది డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేశామని ఆయన చెప్పారు. షీ టీమ్స్ ద్వారా 2, 587 మంది అరెస్ట్ చేశాం.. 52 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశామని సీపీ తెలిపారు.
Read Also: Mansoor Ali Khan: నువ్వు చేసిందే తప్పు… పోనిలే అని వదిలేస్తే ఎక్స్ట్రాలా… ఆ మాత్రం జరగాల్సిందేలే
ఈ ఏడాది 277 డ్రగ్ కేసులు నమోదు కాగా అందులో 567 మందిని అరెస్టు చేశామని సీపీ మహంతి తెలిపారు. ఇందులో ఇద్దరు సప్లయర్స్, 550 మంది పెడ్లర్స్ ఉన్నారు.. 6, 676 కిలోల గంజాయి, 13 లీటర్ల హాషిష్ ఆయిల్, 507 గ్రాముల కొకైన్, 261 గ్రాముల ఎండీఎంఏ, 120 గ్రాముల ఆల్ప్రోజోలం, 26 కిలోల ఛరస్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. 52, 124 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు కాగా, 1271 మంది కి శిక్ష విధించాం.. ఛలాన్ల కింద 104 కోట్ల 54 లక్షల , 12 వేల పై చిలుకు వసూలు చేశాం.. ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ కింద 1347 ఆపరేషన్స్ చేసి 1829 చిన్నారుల రెస్క్యూ చేశామని ఆయన వెల్లడించారు. ఇక, కేపీ చౌదరి కేసులో దర్యాప్తు కొనసాగుతుంది.. చౌదరి కన్ఫెషన్ లో అతను చెప్పిన ప్రతి ఒక్కరిని విచారిస్తున్నాం.. న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చాము.. కమర్షియల్ ఈవెంట్ కు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.. గైడ్ లైన్స్ పాటించాలి అని సీపీ అవినాస్ మహంతి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..