Cyberabad CP: సైబరాబాద్ లో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నేరాల సంఖ్య పెరిగింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైబరాబాద్ పరిధిలో గతేడాది తో పోలిస్తే ఈ ఏడాది నేరాల సంఖ్య పెరిగిందని కమిషనర్ ఆఫ్ పోలీస్ అవినాష్ మహంతి తెలిపారు. గతేడాది 27, 322 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 29, 156 కేసులు రిజిస్ట్రల్ అయ్యాయి.. మహిళలపై నేరాలు తగ్గాయి.. ఈ ఏడాది 105 హత్య కేసులు నమోదు కాగా, సైబర్ క్రైమ్ నేరాలు పెరిగాయి.. గతేడాది 4, 850 కేసులు నమోదు కాగా 5, 342 సైబర్ క్రైమ్ కేసులు రికార్డ్ అయ్యాయి.. ఈ ఏడాది 3432 మందికి శిక్షలు ఖరారు అయినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక, 5342 సైబర్ క్రైమ్ కేసులు, సైబర్ క్రైమ్ ద్వారా 232 కోట్లు మాయం అయ్యాయి.. సైబర్ క్రైమ్ లో 46 కోట్లు రికవరీ చేశాం.. 277 డ్రగ్స్ కేసులు నమోదు,567 మంది అరెస్ట్ చేశామని సీపీ అవినాష్ మహంతి చెప్పుకొచ్చారు.
Read Also: Salaar: ‘సలార్’ నాన్ RRR రికార్డ్… నైజాం కింగ్!
Also Read
- Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
- CM Chandrababu: ఎల్నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
- UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
డ్రగ్స్ కేసుల్లో ఇద్దరిపై పీడీ యాక్ట్ నమోదు చేశామని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి పేర్కొన్నారు. 6, 676 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నాం.. డ్రగ్స్ కేసుల్లో 27 కోట్లు విలువ చేసే మత్తు పదార్ధులను అదుపులోకి తీసుకున్నాం.. 52, 124 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయి.. ట్రాఫిక్ ఉల్లంఘనల ద్వారా 104 కోట్ల రూపాయల చలాన్ లు విధించాం.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించిన 24, 318 మంది డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేశామని ఆయన చెప్పారు. షీ టీమ్స్ ద్వారా 2, 587 మంది అరెస్ట్ చేశాం.. 52 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశామని సీపీ తెలిపారు.
Read Also: Mansoor Ali Khan: నువ్వు చేసిందే తప్పు… పోనిలే అని వదిలేస్తే ఎక్స్ట్రాలా… ఆ మాత్రం జరగాల్సిందేలే
ఈ ఏడాది 277 డ్రగ్ కేసులు నమోదు కాగా అందులో 567 మందిని అరెస్టు చేశామని సీపీ మహంతి తెలిపారు. ఇందులో ఇద్దరు సప్లయర్స్, 550 మంది పెడ్లర్స్ ఉన్నారు.. 6, 676 కిలోల గంజాయి, 13 లీటర్ల హాషిష్ ఆయిల్, 507 గ్రాముల కొకైన్, 261 గ్రాముల ఎండీఎంఏ, 120 గ్రాముల ఆల్ప్రోజోలం, 26 కిలోల ఛరస్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. 52, 124 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు కాగా, 1271 మంది కి శిక్ష విధించాం.. ఛలాన్ల కింద 104 కోట్ల 54 లక్షల , 12 వేల పై చిలుకు వసూలు చేశాం.. ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ కింద 1347 ఆపరేషన్స్ చేసి 1829 చిన్నారుల రెస్క్యూ చేశామని ఆయన వెల్లడించారు. ఇక, కేపీ చౌదరి కేసులో దర్యాప్తు కొనసాగుతుంది.. చౌదరి కన్ఫెషన్ లో అతను చెప్పిన ప్రతి ఒక్కరిని విచారిస్తున్నాం.. న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చాము.. కమర్షియల్ ఈవెంట్ కు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.. గైడ్ లైన్స్ పాటించాలి అని సీపీ అవినాస్ మహంతి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
-
CM Chandrababu: ఎల్నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
-
Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!