IND vs AUS: ఆస్ట్రేలియా టార్గెట్ 241.. భారం బౌలర్లపైనే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs AUS: ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్లో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఉన్నంతసేపు స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. ఈ మ్యాచ్ లో భారీ స్కోరును ఊహించుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. ఆసీస్ బౌలర్ల ముందు టీమిండియా బ్యాటర్లు తడబడటంతో.. తక్కువ స్కోరును నమోదు చేశారు. టీమిండియా బ్యాటింగ్ లో కేఎల్ రాహుల్ (66) అత్యధిక స్కోరు చేశాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ (54), రోహిత్ శర్మ (47), సూర్యకుమార్ యాదవ్ (18) పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లంతా 10 పరుగుల లోపే ఔటయ్యారు. భారత్ ఇన్నింగ్స్ లో 11 ఓవర్ల నుంచి 40 ఓవర్ల మధ్య కేవలం రెండు బౌండరీలు మాత్రమే ఉన్నాయి. దీనిబట్టి అర్ధం చేసుకోవచ్చు. ఆసీస్ బౌలర్లు ఎలా విరుచుకుపడ్డారనేది. ఇక.. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లతో చెలరేగాడు. ఆ తర్వాత జోష్ హేజిల్ ఉడ్, పాట్ కమిన్స్ తలో రెండు వికెట్లు సంపాదించారు. మ్యాక్స్ వెల్, జంపాకు కూడా చెరో వికెట్ లభించింది.
Read Also: Kodali Nani : టీడీపీకి బీ టీమ్ దగ్గుబాటి పురంధరేశ్వరి
Also Read
టాస్ ఓడి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. భారత్ ను బ్యాటింగ్ కు పంపింది. ఈ క్రమంలో ఆరంభంలో రోహిత్ శర్మ దూకుడు ఇన్నింగ్స్ ఆడి.. స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కానీ 47 పరుగుల వద్ద భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో క్యాచ్ ఔటయ్యాడు. అంతకుముందు గిల్ 4 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఇక.. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన పోయిన మ్యాచ్ లో సెంచరీ హీరో కేవలం 4 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత కోహ్లీ, కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడి స్కోరుబోర్డును నడిపించారు. ఆ తర్వాత జడేజా 9 పరుగులు చేసి ఔటయ్యాడు. సూర్యకుమార్ 18 పరుగులు పెవిలియన్ బాట పట్టాడు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు భారమంతా టీమిండియా బౌలర్లపైన ఉంది. మొదట్లో బుమ్రా, సిరాజ్ వికెట్లు తీస్తే.. ఆ తర్వాత మహమ్మద్ షమీ కూడా వికెట్లు తీయగల సత్తా ఉంది.
- Tags
- Australia
- final
- india
- match
- telugu news
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!