IPL Auction 2025: ఆర్సీబీ నిర్ణయంతో సంతోషంగా ఉన్నా.. మ్యాక్స్వెల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- ముగ్గురిని మాత్రమే రిటైన్ చేసుకున్న ఆర్సీబీ
- మ్యాక్స్వెల్ను వదిలేసిన ఆర్సీబీ
- ఆర్సీబీతో ప్రయాణం ముగియలేదంటున్న మ్యాక్సీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్రాంచైజీ ముగ్గురిని మాత్రమే రిటైన్ చేసుకుంది. విరాట్ కోహ్లీ (రూ.21 కోట్లు), రజత్ పాటిదార్ (రూ.11 కోట్లు), యశ్ దయాళ్ (రూ.5 కోట్లు)ను ఆర్సీబీ అట్టిపెట్టుకుంది. చాలామంది స్టార్ ఆటగాళ్లను వేలంలోకి వదిలేసింది. 2021 నుంచి జట్టులో ఉన్న ఆస్ట్రేలియా హిట్టర్ గ్లెన్ మ్యాక్స్వెల్ను ఆర్సీబీ రిటైన్ చేసుకోలేదు. ఇది చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆర్సీబీ తనను అట్టిపెట్టుకోవడంపై తాజాగా మ్యాక్సీ స్పందించాడు.
తనని రిలీజ్ చేసే ముందు ఆర్సీబీ ఫ్రాంచైజీ సుదీర్ఘంగా చర్చించిందని గ్లెన్ మ్యాక్స్వెల్ తెలిపాడు. హెడ్కోచ్ ఆండీ ప్లవర్, ఫ్రాంఛైజీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మో బోబాట్ తనతో గంటన్నర మాట్లాడారని, రిటైన్ చేసుకోకపోవడానికి గల కారణాలను వివరించారని చెప్పాడు. ఈఎస్పీఎన్ అరౌండ్ ది వికెట్ పాడ్కాస్ట్లో మ్యాక్స్వెల్ మాట్లాడుతూ… ‘ఆర్సీబీ నుంచి రిలీజ్ చేసే ముందు మో బోబాట్, ఆండీ ఫ్లవర్ నాతో జూమ్ కాల్లో మాట్లాడారు. రిటైన్ చేసుకోకపోవడానికి గల కారణాలను వివరించారు. జట్టు వ్యూహం, మంచి ఫలితాలు రాబట్టడానికి ఎలా ముందుకు సాగాలనుకుంటున్నారనే విషయాలను చెప్పారు. ఆర్సీబీ తీసుకున్న నిర్ణయంతో నేను సంతోషంగానే ఉన్నా’ అని తెలిపాడు.
Also Read
- Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
- Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
- Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
- Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
Also Read: Virat Kohli: అయ్యో విరాట్ ఎంతపనాయే.. పదేళ్లలో ఇదే తొలిసారి!
‘ఆర్సీబీ సిబ్బందిలో కూడా మార్పులు చేస్తోంది. ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుంది. రిలీజ్ చేసే ముందు ఆటగాళ్లతో మాట్లాడడం మంచి విషయం అని నేను భావిస్తున్నా. ఆర్సీబీతో నా ప్రయాణం ముగియలేదు. నేను మరలా జట్టులోకి రావాలనుకుంటున్నాను. ఆర్సీబీకి ఆడుతాననే నమ్మకం ఉంది. ఇది ఓ గొప్ప ఫ్రాంఛైజీ. ఐపీఎల్సమయంను బాగా ఆనందించాను’ అని గ్లెన్ మ్యాక్స్వెల్ పేర్కొన్నాడు. ఆర్సీబీలో మ్యాక్సీ కీలక ఆటగాడు అన్న విషయం తెలిసిందే. గతంలో ఎన్నో మ్యాచ్ల్లో విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడాడు. ఐపీఎల్ 2024లో 9 ఇన్నింగ్స్ల్లో 52 పరుగులే చేసి నిరాశపరిచాడు.
తాజావార్తలు
-
Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
-
Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
-
Celebrity Wedding : ఖుష్బూ కూతురు పెళ్లి వేడుకలో మెరిసిన టాలీవుడ్ స్టార్స్.. ఒకే ఫ్రేమ్లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
MK Stalin: తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాజకీయ ఉత్కంఠ.. స్టాలిన్ బరిలోకి దిగుతారా? డీఎంకేలో పెరుగుతున్న డిమాండ్
ట్రెండింగ్
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..