అమెరికాలోని టెక్సాస్లో దారుణమైన ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సవన్నా క్రీగర్ అనే 32 ఏళ్ల మహిళ తన 3 ఏళ్ల కుమారుడిని కాల్చి చంపి, ఆ తర్వాత తుపాకీతో తనకు తాను కాల్చుకుంది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. చనిపోయే ముందు తల్లి ఫోన్లో భయంకరమైన వీడియోను రికార్డు చేసింది. ‘మీ తండ్రికి వీడ్కోలు చెప్పు’ అంటూ వీడియోలో రికార్డైంది.
Bastar: The Naxal Story OTT: ఓటీటీలో ఆదాశర్మ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. ఈ సంఘటన మార్చి 19న శాన్ ఆంటోనియోలోని ఒక పార్కులో జరిగింది. తల్లి క్రీగర్, కుమారుడు కాడెన్ తలపై తుపాకీతో కాల్చుకోవడంతో సంఘటనా స్థలంలోనే మరణించారు. కాగా.. హత్య-ఆత్మహత్య కేసును అధికారులు కొన్ని వారాలుగా దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad Metro: మ్యాచ్ కు వెళ్లి తిరుగుప్రయాణం లేట్ అవుతుందా.. మెట్రో రైళ్లు ఉండగా భయమేల..
చనిపోయే ముందు.. క్రీగర్ తన వివాహ ఫోటోలు, దుస్తులను ఫోన్ లో చిత్రీకరించారు. ఆ తర్వాత తన మాజీ భర్తకు ఫోన్ చేసి.. ఫేస్టైమ్ వీడియోలు, సందేశాలను పంపింది. మార్చి 18 మధ్యాహ్నం క్రీగర్ తన పనిని వదిలి పెట్టి తన మాజీ భర్త ఇంటికి వెళ్లింది. కానీ అతను ఇంట్లో లేడు. ఆ తర్వాత తన ఇంటికొచ్చిన క్రీగర్.. తన పెళ్లి దుస్తులపై రెండు బుల్లెట్లను కాల్చింది. ఆ తర్వాత పెళ్లి ఫొటోలను కాల్చేసింది. అనంతరం చనిపోయే ముందు తన మాజీ భర్తకు ఫోన్ చేసి “ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి మీకు ఏమీ లేదు,” ఈ రోజు చివరిలో మీకు ఏమీ ఉండదు. మీ కొడుకుకు వీడ్కోలు చెప్పండి”. అని వీడియో రికార్డ్ చేసి సూసైడ్ చేసుకుంది.