Atchannaidu: ఎన్నికల వరకూ చంద్రబాబును జైల్లో ఉంచాలని చూస్తున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడుతూ.. ఎన్నికల వరకూ చంద్రబాబు జైల్లో ఉండాలనేది జగన్ తాపత్రయం.. అందుకే హడావుడిగా రేపు జగన్ ఢిల్లీ వెళ్తున్నారు అని ఆయన ఆరోపించారు. చంద్రబాబు అరెస్టు బీజేపీకి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా అనేది దేవుడికే తెలియాలి.. చంద్రబాబు అరెస్టు అక్రమమని తెలిసి కూడా బీజేపీ నేతలు కనీసం స్పందించకపోవటంపై సర్వత్రా చర్చ జరుగుతోంది అని అచ్చెన్నాయుడు అన్నారు. జనసేనతో సమన్వయం కోసం ఐదుగురు సభ్యుల కమిటీని త్వరలో ప్రకటిస్తాం.. ప్రస్తుతానికి జనసేనతో మాత్రమే పొత్తులో ఉన్నామని ఆయన పేర్కొన్నారు.
Read Also: Minister KTR: మోడీని బండి సంజయ్ దేవుడు అంటారు.. ఎవ్వరికి దేవుడో చెప్పాలి..!
Also Read
వామపక్ష పార్టీలతో పొత్తు అంశం అధినేత చంద్రబాబు నిర్ణయిస్తారు అని అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ నెల 9వ తేదీలోపు చంద్రబాబు నాయుడు బయటకు వస్తారని భావిస్తున్నాం.. బాబుతో నేను ఇంటింటి ప్రచారం, రిలే దీక్షలు ఈ నెల 9వ తేదీ వరకూ కొనసాగుతాయన్నారు. చంద్రబాబు బయటకు వచ్చే ప్రక్రియ ఇంకా ఆలస్యమైతే.. 10వ తేదీ నుంచి వివిధ రూపాల్లో నిరసనలకు కొత్త కార్యక్రమం చేపడతామని ఆయన చెప్పారు. చంద్రబాబు అరెస్టుతో మనోవేదనకు గురై దాదాపు 120 మంది చనిపోయారు.. చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించాలని నారా భువనేశ్వరి ఇప్పటికే నిర్ణయించారు అని అచ్చెన్నాయుడు అన్నారు.
Read Also: Nuclear submarine : ప్రమాదానికి గురైన న్యూక్లియర్ సబ్మెరైన్.. 55 మంది మృతి
నారా భువనేశ్వరితో పాటు పార్టీ నేతలు వివిధ రూపాల్లో ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలను కోర్టు పరిణామాలు బట్టి 10వ తేదీన నిర్ణయిస్తామని అచ్చెన్నాయుడు అన్నారు. నారా లోకేష్ కూడా ఈ వారంలో చంద్రబాబుతో ములాకత్ అవుతారు.. చంద్రబాబు అరెస్టుతో పార్టీ కార్యక్రమాలు ఏవీ స్తంభించ లేదు.. ఓట్ల అక్రమాలపై పూర్తి అప్రమత్తంగా ఉన్నాం.. ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేష్ కి సంబంధం లేదని నిన్న ( మంగళవారం ) న్యాయస్థానంలో ప్రభుత్వమే క్లీన్ చిట్ ఇచ్చింది అని ఆయన చెప్పుకొచ్చారు. ఫైబర్ గ్రిడ్ స్కామ్ అంటూ ఎన్నో ఆరోపణలు చేసిన వైసీపీ నేతలు ఇప్పుడేమంటారు?.. నిన్న న్యాయస్థానంలో ప్రభుత్వ వాదనలతో కేసు డొల్లతనం అనేది బహిర్గతమైంది అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు కోసం అక్రమ కేసులు పెడుతోందన్నది అనేది స్పష్టమైందన్నారు.
తాజావార్తలు
-
Work From Bike: వర్క్ ఫ్రం హోం పోయింది.. వర్క్ ఫ్రం బైక్ వచ్చేసింది.. వీడియో వైరల్..
-
Maharashtra: ఫుట్బాల్ కోచ్ దారుణం.. మూడేళ్లుగా మైనర్ బాలికపై అత్యాచారం..
-
NBK 112 గ్రాండ్ లాంచ్ డేట్ ఇదేనా? బాలయ్య – కొరటాల మూవీ ఓపెనింగ్కు సీఎం చంద్రబాబు, లోకేష్!
-
US-Iran: 24 గంటల్లో శాంతి ఒప్పందం ఖరారు.. పాక్ ప్రధాని షరీఫ్ కీలక ప్రకటన
-
Nagarjuna: మనోడు లెనిన్ 10th జులై వస్తున్నాడు!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!