Atchannaidu: ఎన్నికల వరకూ చంద్రబాబును జైల్లో ఉంచాలని చూస్తున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడుతూ.. ఎన్నికల వరకూ చంద్రబాబు జైల్లో ఉండాలనేది జగన్ తాపత్రయం.. అందుకే హడావుడిగా రేపు జగన్ ఢిల్లీ వెళ్తున్నారు అని ఆయన ఆరోపించారు. చంద్రబాబు అరెస్టు బీజేపీకి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా అనేది దేవుడికే తెలియాలి.. చంద్రబాబు అరెస్టు అక్రమమని తెలిసి కూడా బీజేపీ నేతలు కనీసం స్పందించకపోవటంపై సర్వత్రా చర్చ జరుగుతోంది అని అచ్చెన్నాయుడు అన్నారు. జనసేనతో సమన్వయం కోసం ఐదుగురు సభ్యుల కమిటీని త్వరలో ప్రకటిస్తాం.. ప్రస్తుతానికి జనసేనతో మాత్రమే పొత్తులో ఉన్నామని ఆయన పేర్కొన్నారు.
Read Also: Minister KTR: మోడీని బండి సంజయ్ దేవుడు అంటారు.. ఎవ్వరికి దేవుడో చెప్పాలి..!
Also Read
- Su-57E Stealth Fighter: భారత్కు రష్యా Su-57E ఎందుకు అవసరం.? చైనా, పాక్కు చెక్..
- Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
- BRICS: భారత్కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
- PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్లో జాయిన్ అయితే చాలు..
వామపక్ష పార్టీలతో పొత్తు అంశం అధినేత చంద్రబాబు నిర్ణయిస్తారు అని అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ నెల 9వ తేదీలోపు చంద్రబాబు నాయుడు బయటకు వస్తారని భావిస్తున్నాం.. బాబుతో నేను ఇంటింటి ప్రచారం, రిలే దీక్షలు ఈ నెల 9వ తేదీ వరకూ కొనసాగుతాయన్నారు. చంద్రబాబు బయటకు వచ్చే ప్రక్రియ ఇంకా ఆలస్యమైతే.. 10వ తేదీ నుంచి వివిధ రూపాల్లో నిరసనలకు కొత్త కార్యక్రమం చేపడతామని ఆయన చెప్పారు. చంద్రబాబు అరెస్టుతో మనోవేదనకు గురై దాదాపు 120 మంది చనిపోయారు.. చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించాలని నారా భువనేశ్వరి ఇప్పటికే నిర్ణయించారు అని అచ్చెన్నాయుడు అన్నారు.
Read Also: Nuclear submarine : ప్రమాదానికి గురైన న్యూక్లియర్ సబ్మెరైన్.. 55 మంది మృతి
నారా భువనేశ్వరితో పాటు పార్టీ నేతలు వివిధ రూపాల్లో ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలను కోర్టు పరిణామాలు బట్టి 10వ తేదీన నిర్ణయిస్తామని అచ్చెన్నాయుడు అన్నారు. నారా లోకేష్ కూడా ఈ వారంలో చంద్రబాబుతో ములాకత్ అవుతారు.. చంద్రబాబు అరెస్టుతో పార్టీ కార్యక్రమాలు ఏవీ స్తంభించ లేదు.. ఓట్ల అక్రమాలపై పూర్తి అప్రమత్తంగా ఉన్నాం.. ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేష్ కి సంబంధం లేదని నిన్న ( మంగళవారం ) న్యాయస్థానంలో ప్రభుత్వమే క్లీన్ చిట్ ఇచ్చింది అని ఆయన చెప్పుకొచ్చారు. ఫైబర్ గ్రిడ్ స్కామ్ అంటూ ఎన్నో ఆరోపణలు చేసిన వైసీపీ నేతలు ఇప్పుడేమంటారు?.. నిన్న న్యాయస్థానంలో ప్రభుత్వ వాదనలతో కేసు డొల్లతనం అనేది బహిర్గతమైంది అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు కోసం అక్రమ కేసులు పెడుతోందన్నది అనేది స్పష్టమైందన్నారు.
తాజావార్తలు
-
UIDAI App: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇంట్లో కూర్చునే నిమిషాల్లో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు! ఓ లుక్ వేయండి..
-
Su-57E Stealth Fighter: భారత్కు రష్యా Su-57E ఎందుకు అవసరం.? చైనా, పాక్కు చెక్..
-
Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
-
BRICS: భారత్కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!