Anti-Govt Protests: పోలీసుల కాల్పుల్లో 17 మంది పౌరులు దుర్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anti-Govt Protests: దక్షిణ పెరూలో పోలీసులతో జరిగిన ఘర్షణల్లో 17మంది పౌరులు చనిపోయారు. ముందస్తు ఎన్నికలు, జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ అధ్యక్షుడు పెడ్రో కాస్టిల్లోని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటివరకు జరిగిన నిరసనల్లో 17 మంది మృతి చెందారని ఆ దేశ మానవ హక్కుల కార్యాలయం సోమవారం వెల్లడించింది. దక్షిణ పెరూలోని పునో ప్రాంతంలోని టిటికాకా సరస్సు ఒడ్డున ఉన్న జూలియాకా అనే నగరంలో ఈ ఘర్షణలు సంభవించాయి. 68 మంది గాయపడ్డారని పునో ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి హెన్రీ రెబాజా తెలిపారు. మృతుల్లో కనీసం ఇద్దరు యువకులు కూడా ఉన్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. కొన్ని మృతదేహాలకు బుల్లెట్ గాయాలు ఉన్నాయని పునో ప్రాంతీయ ఆరోగ్య డైరెక్టర్ ఇస్మాయిల్ కార్నెజో వెల్లడించారు. తాజా మరణాలతో ప్రభుత్వ వ్యతిరేక ఘర్షణలో చోటుచేసుకున్న మరణాల సంఖ్య 39కి చేరింది.
Joshimath: జోషిమఠ్ నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి.. 16న సుప్రీం విచారణ
Also Read
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
డిసెంబర్లో కాస్టిలోను పదవి నుంచి అరెస్ట్ చేసిన తర్వాత నాటకీయ పరిణామాలతో దేశంలో నిరసనలు ప్రారంభమయ్యాయి. తాజాగా మరోసారి ఉద్రిక్తం కావడంతో ఘర్షణ వాతావరణం తలెత్తింది. అయితే తాను గద్దె నుంచి అవకాశం లేదని నూతన ప్రధాని డినా బొలూవార్టె అన్నారు. నిరసనకారుల ప్రధాన డిమాండ్లను తీర్చే అవకాశం లేదని చెప్పారు. అయితే ఎన్నికలను ముందుకు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు పెరూలో పరిస్థితిని అంచనా వేసేందుకు ఇంటర్ అమెరికన్ కమిషన్ బుధవారం నుంచి మూడు రోజుల పాటు పర్యటించనుంది. పరిస్థితిని అంచనా వేయడానికి లిమా, ఇతర నగరాలను సందర్శిస్తానని తెలిపింది.
తాజావార్తలు
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
-
Kittu Pawan: ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా సినిమా ప్రారంభం!
-
Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
-
Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
-
Weight Loss Snack: బరువు తగ్గాలనుకుంటున్నారా? పొట్ట చుట్టూ కొవ్వు కరగాలా? మీ డైట్లో దీనిని చేర్చుకోండి!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!