Crime News: మహిళను హత్య చేసి.. ఆమె 10 నెలల శిశువును కిడ్నాప్ చేసి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: అస్సాంలో దారుణం జరిగింది. ఎగువ అస్సాంలో మహిళను హత్య చేసి, ఆమె 10 నెలల శిశువును కిడ్నాప్ చేసినందుకు నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నలుగురు నిందితుల్లో దంపతులు, వారి కుమారుడు, బాధితురాలి తల్లి ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కేసులో అరెస్టయిన దంపతులు సంతానం లేని తమ కుమార్తెకు శిశువును అప్పగించేందుకు ప్రయత్నించారు.
కెందుగురి బైలుంగ్ గ్రామానికి చెందిన నిటుమోని లుఖురాఖోన్ అనే మహిళ మృతదేహాన్ని మంగళవారం ఉదయం చరైడియో జిల్లాలోని రాజబారి టీ ఎస్టేట్ వద్ద కాలువ నుంచి స్వాధీనం చేసుకున్నారు. సోమవారం సాయంత్రం సిమలుగురిలోని మార్కెట్ నుంచి మహిళ కనిపించకుండా పోయింది. సిమలుగురి, శివసాగర్, చరైడియో, జోర్హాట్ నుంచి పోలీసు బృందాలు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి జోర్హాట్లోని ఇంటర్-స్టేట్ బస్ టెర్మినల్ నుంచి శిశువును రక్షించారు.
Also Read
- MK Stalin: “విజయ్ ప్రభుత్వం డీఎంకే దయపైనే”.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- Hyderabad: మాదాపూర్లో అర్ధరాత్రి బైకులు, కార్లతో రేసర్ల హంగామా.. పోలీసులు ఏం చేశారో చూడండి..
- Ebola outbreak: ఎబోలా అలర్ట్.. 3 ఆఫ్రికా దేశాలకు వెళ్లొద్దన్న భారత్
- Suryakumar Yadav: సూర్యకుమార్కు సెలెక్టర్లు షాక్.. కోచ్ గౌతమ్ గంభీర్ చేతుల్లోనే ‘స్కై’ భవితవ్యం!
అసలేం జరిగిందంటే.. ఏదో పనిసాకుతో నిటుమోని లుఖురాఖోన్ అనే మహిళను తెంగాపుఖురికి చెందిన ప్రణాలి గొగోయ్, బసంత గొగోయ్ దంపతులు ఇంటికి ఆహ్వానించారు. హిమాచల్ ప్రదేశ్లో ఉంటున్న తమ వివాహిత కుమార్తెకు పిల్లలు లేని కలను నెరవేర్చడానికి గొగోయ్ దంపతులు ముందుగానే ఆమె శిశువును లాక్కోవడానికి పన్నాగం పన్నారు. దీనికి బాధితురాలి తల్లి కూడా సహకరించింది. ఆ దంపతుల కుమారుడు కూడా ఇందులో భాగమయ్యాడు. పని కోసమని నిటుమోని ఆ ఇంటికి వచ్చింది. ఇంటికి రాగానే ఆ మహిళ శిశువును లాక్కోవడానికి ప్రయత్నించారు. నిటుమోని ప్రతిఘటించడంతో .. ఆ జంట ఆమెపై మొద్దుబారిన వస్తువుతో దాడి చేసి చంపింది. ఆ శవాన్ని టీ ఎస్టేట్లో పడేశారు. టీ ఎస్టేట్ వద్ద మృతదేహం కనిపించగా.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.
Bharat Jodo Yatra: అంబులెన్స్కు దారి ఇచ్చేందుకు యాత్రను నిలిపివేసిన రాహుల్
అనంతరం శిశువును హిమాచల్ ప్రదేశ్లోని కుమార్తె వద్దకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో గొగోయ్ దంపతుల కుమారుడు శిశువును తీసుకుని రైలు ఎక్కాడు. మొత్తం నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శిశువుతో పాటు రైలులోకి ఎక్కిన గొగోయ్ దంపతుల కుమారుడిని కూడా అరెస్ట్ చేశారు. హిమాచల్ ప్రదేశ్లో ఉంటున్న తమ వివాహిత కుమార్తెకు పిల్లలు లేని కలను నెరవేర్చడానికి గొగోయ్ దంపతులు ఈ నేరానికి పాల్పడ్డారని శివసాగర్ సీనియర్ పోలీసు అధికారి సుభ్రజ్యోతి బోరా తెలిపారు. నలుగురు నిందితులను స్థానిక కోర్టు పోలీసు కస్టడీకి పంపింది.
తాజావార్తలు
-
Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ .. ‘హెల్లాళ్లాలో’ వీడియో సాంగ్ అవుట్!
-
MI vs RR: వాంఖడేలో హోరాహోరీ పోరు.. ముంబై vs రాజస్థాన్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ లో ఎవరిది పైచేయి?
-
Lenin: ‘లెనిన్’ టీజర్లో అఖిల్ వాయిస్ మార్పుకు అసలు కారణం ఇదే.. ఫ్యాన్స్కు క్రేజీ అప్డేట్!
-
MK Stalin: “విజయ్ ప్రభుత్వం డీఎంకే దయపైనే”.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
-
Hyderabad: మాదాపూర్లో అర్ధరాత్రి బైకులు, కార్లతో రేసర్ల హంగామా.. పోలీసులు ఏం చేశారో చూడండి..
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?