POK Protests: పీవోకేలో నిరసనల వేళ కాశ్మీర్ కార్డు.. పాక్ ఆర్మీ చీఫ్ తాజా వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
POK Protests: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్రరూపం దాల్చుతున్న వేళ, పాకిస్తాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ మరోసారి కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ భారత్పై ఆరోపణలు చేశారు. రావల్పిండిలోని జనరల్ హెడ్క్వార్టర్స్లో జరిగిన 276వ కార్ప్స్ కమాండర్ల సమావేశంలో ఆయన కాశ్మీర్ను పాకిస్తాన్కు అత్యంత కీలకమైన అంశంగా అభివర్ణించారు. ఈ సందర్భంగా జమ్మూ-కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలు, జనాభా మార్పులకు భారత్ పాల్పడుతోందని పాకిస్తాన్ సైన్యం ఆరోపించింది. పాకిస్తాన్ సైన్యం మీడియా విభాగం ఐఎస్పీఆర్ విడుదల చేసిన ప్రకటనలో కాశ్మీర్ పాకిస్తాన్కు “జుగులర్ వెయిన్” (అత్యంత కీలకమైన నాడి)గా పేర్కొంది.
మరోవైపు పీవోకేలో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు ఉంచింది. జూలై 8లోగా వాటిని అమలు చేయకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకే అసిమ్ మునీర్ కాశ్మీర్ అంశాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే సమావేశంలో పాకిస్తాన్ భద్రతా పరిస్థితులు, ఉగ్రవాద వ్యతిరేక చర్యలపై కూడా సమీక్ష జరిగింది. అలాగే భారత్పై హైబ్రిడ్ యుద్ధం, తప్పుడు ప్రచారం, సింధు జలాల ఒప్పందానికి సంబంధించిన ఆరోపణలను కూడా పాకిస్తాన్ సైన్యం మరోసారి పునరావృతం చేసింది.
Also Read
- Ethnic Unity Law: ముస్లింలే టార్గెట్.. కమ్యూనిస్టు దేశంలో మైనార్టిలపై అణచివేత చట్టాలు!
- Trump-Meloni: ‘‘వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు’’.. ట్రంప్ పోస్టుకు ఇటలీ కౌంటర్..
- Trump: ఒప్పందం చేసుకోకపోతే మిషన్ పూర్తవుతుంది.. ఖమేనీ అంత్యక్రియల వేళ ఇరాన్కు వార్నింగ్
- Trump: ఫుట్బాల్ ప్లేయర్ నిషేధంపై ట్రంప్ సమీక్ష.. దుమారం రేపుతోన్న అధ్యక్షుడి తీరు
మొత్తంగా.. పేదరికం, తిరుగుబాటు, నిస్సహాయత ఓవైపు.. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పెరుగుతున్న నిరసనల మరోవైపు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ.. పాకిస్థాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ మరోసారి భారత్కు వ్యతిరేకంగా ప్రకటన చేస్తూ, కాశ్మీర్ను పాకిస్తాన్ ‘సంక్షోభం’గా అభివర్ణించారు. రావల్పిండిలో జరిగిన 276వ కార్ప్స్ కమాండర్ల సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన, భారత్ మానవ హక్కుల ఉల్లంఘనలకు, జనాభా మార్పులకు పాల్పడుతోందని ఆరోపించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో నిరసనలు తీవ్రమవుతున్న తరుణంలో ఈ ప్రకటన వెలువడింది. కాశ్మీర్ను పాకిస్తాన్ ‘జుగులర్ వెయిన్’ (మెడ నరం)గా, అంటే దాని అత్యంత కీలకమైన నాడిగా అభివర్ణించారు. పీఓకేలో నిరసనలు తీవ్రమవుతున్న తరుణంలో, పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్న సమయంలో ఈ ప్రకటన వెలువడింది.
తాజావార్తలు
-
POK Protests: పీవోకేలో నిరసనల వేళ కాశ్మీర్ కార్డు.. పాక్ ఆర్మీ చీఫ్ తాజా వ్యాఖ్యలు
-
TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!
-
Queen 2: విడుదలకు ముందే చిక్కుల్లో కంగనా సినిమా.. రూ.250 కోట్ల కేసుతో కొత్త ట్విస్ట్!
-
CM Chandrababu: రెండు నెలల్లో ప్రతీ జిల్లాకు డిస్ట్రిక్ట్ ఎకనామిక్ ప్రొఫైల్.. సీఎం కీలక వ్యాఖ్యలు
-
Happy Birthday Dhoni: 17,266 పరుగులు, 829 డిస్మిసల్స్, 3 ఐసీసీ ట్రోఫీస్.. భారత క్రికెట్లో ధోని శకం ఇలా.!
ట్రెండింగ్
-
Telangana Drought Alert: వాన జాడే లేదు.. కరువు కోరల్లోకి తెలంగాణ.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన!
-
Sanju Samson: జింబాబ్వే టూర్లో నో ఛాన్స్.. సంజు కెరీర్ అప్పుడే ముగియలేదు.. ముందుంది మరో సూపర్ ఛాన్స్!
-
ICC Team: టీ20 ప్రపంచకప్ అత్యుత్తమ జట్టు.. భారత్ నుంచి ఒక్కరికే చోటు.. ఆ ఒక్కరు మన అమ్మాయే!
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!