Asia Cup 2025: బెంచ్లో ‘ఆ నలుగురు’.. భారత తుది జట్టు ఇదేనా?
- సెప్టెంబర్ 9న ఆసియా కప్ 2025 ఆరంభం
- భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ
- ప్లేయింగ్ 11లో ఎవరుంటారనే ఉత్కంఠ
- భారత తుది జట్టు ఇదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India predicted playing XI for Asia Cup 2025: ఆసియా కప్ 2025 యూఏఈలో సెప్టెంబర్ 9న ఆరంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ కోసం 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. దాంతో ఆసియా కప్లో బరిలోకి దిగే జట్టుపై సస్పెన్స్ వీడింది. భారత జట్టుపై సస్పెన్స్ వీడినా.. ప్లేయింగ్ 11లో ఎవరుంటారనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. బౌలింగ్ విషయంలో క్లారిటీ ఉన్నా.. బ్యాటింగ్ లైనప్ ఎలా ఉంటుందనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. 15 మందిలో 11 మందికి అవకాశం వస్తుంది. మిగతా నలుగురు బెంచ్లో ఉండాల్సిందే. తుది జట్టులో ఉండే అవకాశాలు ఎవరికి మెండుగా ఉన్నాయో ఓసారి చూద్దాం.
ఓపెనింగ్ కాంబినేషన్పై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ హింట్ ఇచ్చాడు. సంజూ శాంసన్ రెగ్యులర్ ఓపెనర్ కాదని.. శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ లేకపోవడంతోనే అవకాశం దక్కిందని చెప్పాడు. దాంతో అభిషేక్ శర్మతో కలిసి గిల్ ఓపెనర్గా దిగడం ఖాయం అయింది. ఫస్ట్ డౌన్లో తెలుగు ఆటగాడు తిలక్ వర్మ రెండు సెంచరీలు చేశాడు కాబట్టి ఆ ప్లేస్ ఫిక్స్. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఐదో స్థానంలో బరిలోకి దిగుతారు. వికెట్ కీపర్గా జితేష్ శర్మ కంటే సంజూ శాంసన్ ఆడే అవకాశాలే ఎక్కువ. సంజూ 6 లేదా 5వ స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. సంజూ 5లో ఆడితే.. హార్దిక్ 6లో వస్తాడు. రింకూ సింగ్కు తుది జట్టులో చోటు కష్టమే.
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
స్పిన్ ఆల్రౌండర్గా అక్షర్ పటేల్ ఆడడం పక్కా. అక్షర్ ఇటీవలి రోజుల్లో బాగా ఆడుతున్న విషయం తెలిసిందే. శివమ్ దూబెకు నిరాశ తప్పదు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి బరిలోకి దిగుతారు. దుబాయ్ పిచ్లు స్పిన్ అనుకూలంగా కాబట్టి ఈ ఇద్దరు ఆడే అవకాశం ఉంది. ఒకవేళ అభిషేక్ శర్మ, అక్షర్ రూపంలో ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు కాబట్టి.. కుల్దీప్, చక్రవర్తిలో ఒకరికే అవకాశం దక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదే జరిగితే ఫినిషర్గా రింకూ సింగ్ ఆడతాడు. ఇది జరిగే అవకాశాలు చాలా తక్కువ. ఇక పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్ జట్టులో ఉండడం ఖాయం. మూడో పేసర్ హార్దిక్ పాండ్యా ఉండనే ఉన్నాడు. హర్షిత్ రాణా బెంచ్లో ఉంటాడు.
Also Read: Asia Cup 2025: 165 స్ట్రైక్రేట్ ఉన్నా భారత జట్టులో లేడు.. ఆడడం తప్ప ఇంకేం చేయగలం?
భారత తుది జట్టు (అంచనా):
శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్ (కీపర్), అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్.
బెంచ్ ప్లేయర్స్: రింకూ సింగ్, శివమ్ దూబె, హర్షిత్ రాణా, జితేష్ శర్మ.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..