Asia Cup 2025: ఆ ఐదుగురు ప్లేయర్లు దుబాయ్కు వెళ్లరు: బీసీసీఐ
- సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ 2025 మొదలు
- సెప్టెంబర్ 10న యూఏఈతో టీమిండియా తొలి మ్యాచ్
- సెప్టెంబర్ 4న దుబాయ్కు టీమిండియా ప్లేయర్లు
- ఆ ఐదుగురు ప్లేయర్లు దుబాయ్కు వెళ్లరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI Confirms Standby Players Will Not Travel to Dubai: యూఏఈ వేదికగా ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి మొదలు కానుంది. టోర్నీ మొదటి మ్యాచ్లో అఫ్గానిస్తాన్, హాంకాంగ్ టీమ్స్ తలపడనున్నాయి. టీమిండియా తన తొలి మ్యాచ్ను సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది. ఆసియా కప్ కోసం బీసీసీఐ ఇప్పటికే 15 మందితో కూడిన జట్టును ప్రకటించగా.. అందరూ టోర్నీ కోసం సన్నద్ధమవుతున్నారు. మెగా టోర్నీ కోసం టీమిండియా ప్లేయర్లు సెప్టెంబర్ 4న దుబాయ్కు వెళ్లనున్నారు. సెప్టెంబర్ 5న ఐసీసీ అకాడమీలో ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది.
అయితే ఆసియా కప్ 2025 కు ఎంపికైన స్టాండ్బై ప్లేయర్లు ప్రధాన జట్టుతో పాటు దుబాయ్కు వెళ్లరని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. టోర్నీలో ఎవరైనా గాయపడితే.. అతడి స్థానంలో స్టాండ్బై ప్లేయర్ (భర్తీ చేసే ఆటగాడు) అప్పటికప్పుడు దుబాయ్ చేరుకుంటారని చెప్పారు. ఆసియా కప్ కోసం ఎంపికైన ప్లేయర్స్ తమ ప్రాంతాల నుంచే నేరుగా దుబాయ్కు వెళ్తారని, యూఏఈలోనే అందరూ కలుసుకుంటారని సదరు బీసీసీఐ అధికారి చెప్పుకొచ్చారు. యశస్వి జైస్వాల్, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్ స్టాండ్బై ప్లేయర్లుగా ఎంపికైన విషయం తెలిసిందే.
Also Read
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
- Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
- KC Venugopal: కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
- Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
Also Read: Nara Lokesh: కష్టపడ్డాను, గెలిచాను.. కష్టమైన విద్యాశాఖలో సంస్కరణలు తెచ్చా!
2025 ఆసియా కప్ స్క్వాడ్లో 17 మంది ఆటగాళ్లకు అవకాశం ఉన్నా.. బీసీసీఐ మాత్రం 15 మందినే ఎంపిక చేసింది. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్, శుభ్మన్ గిల్ ఎంపికయ్యారు. వీరిలో ఎవరైనా గాయపడితే.. అప్పటికప్పుడు యశస్వి జైస్వాల్ దుబాయ్ వెళ్తాడు. ఆల్రౌండర్గా అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ వెళ్తాడు. పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణాలకు గాయం అయితే.. ప్రసిద్ధ్ కృష్ణకు అవకాశం దక్కుతుంది.
తాజావార్తలు
-
Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
-
Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
-
KC Venugopal: కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
-
Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
-
Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!