Nara Lokesh: కష్టపడ్డాను, గెలిచాను.. కష్టమైన విద్యాశాఖలో సంస్కరణలు తెచ్చా!
- ఇప్పుడు ఏఐ (కృత్రిమ మేధ) విప్లవం చూస్తాం
- ఏఐతో ఎన్నో ఉపాధి అవకాశాలు
- ఐదేళ్ల పాటు కష్టపడి గెలిచా
- సైయెంట్ ఆధ్వర్యంలో విశాఖలో ఏఐ ల్యాబ్
Minister Nara Lokesh on AI Revolution: పారిశ్రామిక విప్లవం చూశాం అని, ఇప్పుడు ఏఐ (కృత్రిమ మేధ) విప్లవం చూస్తాం అని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఏఐతో ఎన్నో ఉపాధి అవకాశాలు ఉన్నాయని, వస్తున్నాయని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నిరంతరం కష్టపడుతున్నారన్నారు. తాను మొదటిసారి పోటీ చేసినప్పుడు ఓడిపోయానని.. ఆపై ఐదేళ్ల పాటు కష్టపడి గెలిచానని తెలిపారు. కష్టమైన విద్యాశాఖ తీసుకుని.. మార్పు తీసుకుని రావాలని ప్రయత్నం చేస్తున్నానని పేర్కొన్నారు. విద్యార్థులే మన ఆస్తి అని నారా లోకేష్ చెప్పుకొచ్చారు. సైయెంట్ ఆధ్వర్యంలో విశాఖలో ఏఐ ల్యాబ్ను మంత్రి ప్రారంభించారు.
‘పారిశ్రామిక విప్లవం చూశాం, ఇప్పుడు ఏఐ విప్లవం చూస్తాం. రానున్నది ఏఐ విప్లవం. ఏఐతో ఎన్నో ఉపాధి అవకాశాలు ఉన్నాయి, వస్తున్నాయి. భవిష్యత్తులో ఉన్నతంగా వెళ్లాలి. అందుకు లక్ష్యంతో ముందుకు సాగాలి. దేశంలో ప్రధాని మోడీ, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నిరంతరం కష్టపడుతున్నారు. నేను మొదటిసారి పోటీ చేసినప్పుడు ఓడిపోయాను. ఐదేళ్లు కష్టపడ్డాను గెలిచాను. నన్ను విద్యాశాఖ తీసుకోవద్దని కొందరు చెప్పారు. కానీ కష్టమైన విద్యాశాఖ తీసుకుని మార్పు తీసుకుని రావాలని ప్రయత్నం చేశాను. విద్యాశాఖలో సంస్కరణలు తెచ్చాను. విద్యార్థులే మన ఆస్తి, మన భవిష్యత్. దక్షిణ భారతదేశంలో లెర్నింగ్ టెక్నిక్లో మన రాష్ట్రం ముందు ఉంది’ అని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
Also Read
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
- KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
- LSG vs RR: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్ ఎవరిదంటే?
- CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
Also Read: Vizianagaram News: హృదయవిదారక ఘటన.. తల్లికి పురుడు పోసిన కూతురు!
‘రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహించాం. కొత్త టీచర్ నియమకాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ నుంచి కొత్త టీచర్లు విధుల్లో చేరుతారు. పుస్తకాలు మీద ఎవరి బొమ్మలు ఉండవు. కొన్ని పార్టీలకు ఈ అభివృద్ధి నచ్చడం లేదు. వారు వచ్చి నన్ను కలిసి మాట్లాడచ్చు. జీవితంలో ఉపాధ్యాయులను మరచి పోవద్దు. నేను నా గురువులను మరచిపోలేను. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ ఆట కట్టించారు మన ప్రధాని. యుద్ధంలో మృతి చెందిన మురళి నాయక్ మన రాష్ట్రం వారే. వారి తల్లి తండ్రులను కలిసి మాట్లాడాను. వారిలో దేశభక్తి మాటలు నన్ను కదిలించాయి. దేశం కోసం పని చేసే జవానులను మనం ఎప్పుడు గౌరవించాలి’ అని మంత్రి నారా లోకేష్ చెప్పారు.
- Tags
తాజావార్తలు
-
RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
-
Ukraine: ట్రంప్ను ప్రసన్నం చేసుకునేందుకు ఉక్రెయిన్ మాస్టర్ ప్లాన్!
-
Vaibhav Sooryavanshi: లక్నోపై చేసిన పరుగులు 8.. అయినా అరుదైన రికార్డు సాధించిన వైభవ్ సూర్యవంశీ..
-
Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
-
LSG vs RR: పొదుపుగా బౌలింగ్ చేసిన లక్నో.. టార్గెట్ ఎతంటే?
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?