World Cup2023: వరల్డ్ కప్ జట్టులోకి అశ్విన్ ఇన్.. అక్షర్ ఔట్
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ కు వన్డే ప్రపంచకప్-2023లో ఆడే ఛాన్స్ కనిపిస్తుంది. స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ గాయపడటంతో అశ్విన్ జట్టులోకి వచ్చే మార్గం సుగమమయ్యే అవకాశం ఉంది. టీమిండియా సారథి రోహిత్ శర్మ ఇందుకు సంబంధించి సంకేతాలు ఇచ్చాడు.. కాగా, ఆసియా వన్డే కప్-2023లో బంగ్లాదేశ్తో మ్యాచ్ సందర్భంగా అక్షర్ పటేల్ గాయపడి ఇంకా కోలుకోలేదు. ఈ క్రమంలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు అతడు దూరంగా ఉన్నాడు. తొలి రెండు మ్యాచ్లు ఆడకపోయినప్పటికీ.. రాజ్కోట్ వన్డేకు అందుబాటులోకి వస్తాడనుకుంటే గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.
Read Also: UNFPA: రాబోయే దశాబ్దాల్లో యువభారతం వృద్ధాప్య సమాజంగా మారుతుంది..
Also Read
- Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
- MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
- Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
- KKR Vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో విజయానికి బ్రేక్..? కేకేఆర్లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ..
ఇక, వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్ కి మరో ఎనిమిది రోజులు మాత్రమే టైం ఉంది. ఈ నేపథ్యంలో అక్షర్ పటేల్ గనుక కోలుకోకపోతే రవిచంద్రన్ అశ్విన్ ప్రపంచకప్ టీమ్ లోకి ఎంట్రీ ఇవ్వడం గ్యారెంటీ!.. అయితే, సుదీర్ఘ కాలం తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్తో అశ్విన్ పునరాగమనం చేశాడు. రెండు మ్యాచ్లలో కలిపి 4 వికెట్లు తీసుకున్నాడు. వన్డేల్లోనూ సత్తా చాటగలనని అతడూ నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆసీస్తో నామమాత్రపు మూడో వన్డేకు ముందు మీడియాతో మాట్లాడిన కెప్టెన్ రోహిత్ శర్మకు అశ్విన్ గురించి ఓ ప్రశ్న ఎదురైంది.. ఇందుకు సమాధానంగా.. అతడు క్లాస్ బౌలర్. ఒత్తిడిని అధిగమించి ఎలా ఆడాలో తెలిసిన అనుభవజ్ఞుడు.. గతేడాది కాలంగా వన్డేలు ఆడనప్పటికీ గత రెండు మ్యాచ్లతో తన బౌలింగ్ స్థాయి ఏమిటో చాటి చెప్పాడు అంటూ పేర్కొన్నాడు.. అతడి బౌలింగ్లో వైవిధ్యం ఉంటుంది అని రోహిత్ శర్మ వెల్లడించాడు.
Read Also: Vidhi: కంటి చూపులేని వాళ్లు కూడా థియేటర్లో ఎంజాయ్ చేసే ‘విధి’
అయితే, వన్డే ప్రపంచకప్ కు ముందు మాకు అన్నీ సానుకూలాంశాలే కనపడుతున్నాయని రోహిత్ శర్మ అన్నారు. మా బ్యాకప్ ప్లేయర్లందరూ రెడీగా ఉండటం హ్యాపీగా ఉంది అని రోహిత్ సమాధానమిచ్చాడు. కాగా సెప్టెంబరు 28 వరకు ప్రపంచకప్ టీమ్ లో మార్పులకు ఛాన్స్ ఉన్న నేపథ్యంలో రోహిత్ మాటల్ని బట్టి అశ్విన్ వరల్డ్ కప్ ఆడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు.. అక్షర్ పటేల్ ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు. ఇక అక్టోబరు 5 నుంచి ఐసీసీ టోర్నమెంట్ ప్రారంభం కానుండగా.. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడుతుంది.
తాజావార్తలు
-
Hardik Pandya: ప్లేఆఫ్స్ నుంచి ముంబై ఔట్.. వైఫల్యాన్ని నిజాయితీ ఒప్పుకున్న కెప్టెన్ హార్దిక్ పాండ్యా
-
Mumbai Indians playoffs: ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్.. ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమణ!
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!