Rajasthan: రాజస్థాన్లో కాంగ్రెస్దే అధికారం.. 3 కారణాలను చెప్పిన గెహ్లాట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan: రాజస్థాన్లో ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా కాంగ్రెస్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. ఆయన తన వాదనను బలపరిచేందుకు మూడు కారణాలను ప్రస్తావించారు. కేవలం రాజస్థాన్లోనే కాదు, అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో దేనిలోనూ బీజేపీ గెలవబోదని అన్నారు. గెహ్లాట్ విలేకరులతో మాట్లాడుతూ, రాజస్థాన్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకత లేదని పేర్కొన్నారు. రెండో కారణం ఏంటంటే.. అభివృద్ధి పనులు చేయడంలో ముఖ్యమంత్రికి తిరుగులేదని, మూడోది.. ప్రధాని, హోంమంత్రి, బీజేపీ ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు ఉపయోగించే భాష అని, ప్రచార సమయంలో ఆ భాష ఎవరికీ నచ్చలేదని గెహ్లాట్ తెలిపారు. తమ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నాయకులు బెదిరింపు, భయపెట్టే పదజాలాన్ని ఉపయోగించారని, దానిని రాష్ట్ర ప్రజలు ఆమోదించరని రాజస్థాన్ ముఖ్యమంత్రి అన్నారు.
Read Also: Telangana Assembly Election 2023: తెలంగాణలో ముగిసిన పోలింగ్..
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
గత వారం రాజస్థాన్లోని ప్రతి మూలలో కాంగ్రెస్ ఓడిపోతుందని, రాష్ట్రంలో తదుపరి ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నొక్కిచెప్పారు. గెహ్లాట్ నేతృత్వంలోని ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ, రాజస్థాన్ ముఖ్యమంత్రిపై కూడా అమిత్ షా మండిపడ్డారు. “అశోక్ గెహ్లాట్కు సొంతంగా ఎలాంటి హామీ లేదు. ఆయన ఇస్తున్న హామీ ఏమిటి?” అమిత్ షా అడిగారు. రామ మందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన ఉదాహరణలను ఉటంకిస్తూ, అత్యంత కఠినమైన తీర్మానాలను నెరవేర్చిన ఘనత బీజేపీకి ఉందని అమిత్ షా అన్నారు.
Read Also: తెలంగాణ పోలింగ్: మెదక్లో అత్యధికంగా 70 శాతం పోలింగ్
అంతేకాకుండా, ఈ నెల ప్రారంభంలో రాజస్థాన్లో ఎన్నికల ప్రచారంలో గెహ్లాట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ “జాదూగర్” (మాంత్రికుడు) అని పిలిచారు. ‘జాదూగర్’కు ఓటు వేయకూడదని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ రాష్ట్రం నుంచి డిసెంబర్ 3 తర్వాత కనుమరుగవుతుందని.. ‘ అని ప్రధాని మోడీ తన ప్రచార ప్రసంగంలో అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ఆయన విరుచుకుపడ్డారు. ఆ పార్టీ తన బుజ్జగింపు విధానం కారణంగా సంఘ వ్యతిరేక వ్యక్తులను అనుమతించడం ద్వారా నేరాలు, అల్లర్ల పరంగా రాష్ట్రాన్ని చార్టులో అగ్రస్థానానికి పంపిందని పేర్కొన్నారు. రాజస్థాన్లో నవంబర్ 25న పోలింగ్ జరగగా.. తెలంగాణ (ఇవాళ ఓటింగ్ జరుగుతున్నది), మధ్యప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్గఢ్లతో పాటు ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న ప్రకటించబడతాయి.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?