Asaduddin Owaisi: ముస్లిం కోటాను రద్దు చేస్తాం.. అసదుద్దీన్ ఒవైసీ రియాక్షన్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన హామీపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. వెనుకబడిన ముస్లింలను చేరదీయాలని ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతుండగా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వారి రిజర్వేషన్లను తొలగిస్తామని హామీ ఇస్తున్నారని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన సమాజమైన ‘పాశమంద ముస్లింలను చేరదీయాలి’ అని మోదీ చెప్పారని, వారి రిజర్వేషన్లను తొలగిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారని ఒవైసీ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు న్యాయం చేయడంపై అమిత్ షా సీరియస్గా ఉంటే 50 శాతం కోటా పరిమితిని తొలగించేందుకు రాజ్యాంగ సవరణ తీసుకురావాలని ఓవైసీ ట్వీట్లో పేర్కొన్నారు. “దయచేసి సుధీర్ కమిషన్ నివేదిక చదవండి. మీరు చేయలేకపోతే, దయచేసి ఎవరినైనా అడగండి. ఎస్సీ నుంచి స్టే కింద ముస్లింలకు రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి’ అని ఒవైసీ రాశారు. ఒవైసీ మాట్లాడుతూ.. “సార్ అమిత్ షా.. ఒవైసీ ఒవైసీ అని ఈ ఏడుపు ఎంతకాలం ఉంటుంది? ఖాళీ డైలాగులు కొడుతూనే ఉన్నారు. కనీసం రికార్డు స్థాయి ద్రవ్యోల్బణం, నిరుద్యోగం గురించి మాట్లాడండి. దేశంలోనే తెలంగాణ తలసరి ఆదాయం అత్యధికం.” అని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ముస్లిం వ్యతిరేక ద్వేషపూరిత ప్రసంగం తప్ప తెలంగాణపై బీజేపీకి ఎలాంటి విజన్ లేదని ఏఐఎంఐఎం చీఫ్ ఆరోపించారు.
Read Also: Crop Loss: రాష్ట్రంలో అకాల వర్షాలు.. అన్నదాతకు అపార నష్టాలు
Also Read
‘బీఆర్ఎస్ స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉంది’
హైదరాబాద్లోని చేవెళ్లలో జరిగిన ‘విజయ్ సంకల్ప సభ’లో అమిత్ షా ప్రసంగిస్తూ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగ విరుద్ధంగా ముస్లింలకు రెండు పడక గదుల ఇళ్ల పథకం, విద్యా పథకాల కింద రిజర్వేషన్లు కల్పించారని ఆరోపించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ మజ్లిస్కు భయపడవద్దని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్ను రద్దు చేస్తామన్నారు. ఒవైసీ ఎజెండాను కేసీఆర్ పాటిస్తున్నారని షా ఆరోపించారు. బీఆర్ఎస్ స్టీరింగ్ మజ్లిస్, ఒవైసీల వద్ద ఉందని ఆరోపణలు చేశారు. తెలంగాణలో ముస్లింలకు రిజర్వేషన్ల తొలగింపుపై షా మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. ఆయన గతంలో అనేక సందర్భాల్లో వాగ్దానం చేశారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దీనిని పునరుద్ఘాటించారు. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం గత నెలలో ఓబీసీ ముస్లింలకు 4 శాతం కోటాను రద్దు చేసింది. తెలంగాణలో వెనుకబడిన ముస్లింలు కూడా విద్య, ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు. 15 ఏళ్ల క్రితం అవిభక్త ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టింది.రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేతృత్వంలోని ప్రభుత్వం ముస్లిం కోటాను 12 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చింది. ఐదేళ్ల క్రితమే తెలంగాణ అసెంబ్లీలో ఈ మేరకు తీర్మానం చేసి కేంద్రానికి పంపగా, ఆ ప్రతిపాదనను బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం తిరస్కరించింది.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!