Asaduddin Owaisi: ముస్లిం కోటాను రద్దు చేస్తాం.. అసదుద్దీన్ ఒవైసీ రియాక్షన్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన హామీపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. వెనుకబడిన ముస్లింలను చేరదీయాలని ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతుండగా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వారి రిజర్వేషన్లను తొలగిస్తామని హామీ ఇస్తున్నారని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన సమాజమైన ‘పాశమంద ముస్లింలను చేరదీయాలి’ అని మోదీ చెప్పారని, వారి రిజర్వేషన్లను తొలగిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారని ఒవైసీ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు న్యాయం చేయడంపై అమిత్ షా సీరియస్గా ఉంటే 50 శాతం కోటా పరిమితిని తొలగించేందుకు రాజ్యాంగ సవరణ తీసుకురావాలని ఓవైసీ ట్వీట్లో పేర్కొన్నారు. “దయచేసి సుధీర్ కమిషన్ నివేదిక చదవండి. మీరు చేయలేకపోతే, దయచేసి ఎవరినైనా అడగండి. ఎస్సీ నుంచి స్టే కింద ముస్లింలకు రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి’ అని ఒవైసీ రాశారు. ఒవైసీ మాట్లాడుతూ.. “సార్ అమిత్ షా.. ఒవైసీ ఒవైసీ అని ఈ ఏడుపు ఎంతకాలం ఉంటుంది? ఖాళీ డైలాగులు కొడుతూనే ఉన్నారు. కనీసం రికార్డు స్థాయి ద్రవ్యోల్బణం, నిరుద్యోగం గురించి మాట్లాడండి. దేశంలోనే తెలంగాణ తలసరి ఆదాయం అత్యధికం.” అని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ముస్లిం వ్యతిరేక ద్వేషపూరిత ప్రసంగం తప్ప తెలంగాణపై బీజేపీకి ఎలాంటి విజన్ లేదని ఏఐఎంఐఎం చీఫ్ ఆరోపించారు.
Read Also: Crop Loss: రాష్ట్రంలో అకాల వర్షాలు.. అన్నదాతకు అపార నష్టాలు
Also Read
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
- 9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
- Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
‘బీఆర్ఎస్ స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉంది’
హైదరాబాద్లోని చేవెళ్లలో జరిగిన ‘విజయ్ సంకల్ప సభ’లో అమిత్ షా ప్రసంగిస్తూ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగ విరుద్ధంగా ముస్లింలకు రెండు పడక గదుల ఇళ్ల పథకం, విద్యా పథకాల కింద రిజర్వేషన్లు కల్పించారని ఆరోపించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ మజ్లిస్కు భయపడవద్దని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్ను రద్దు చేస్తామన్నారు. ఒవైసీ ఎజెండాను కేసీఆర్ పాటిస్తున్నారని షా ఆరోపించారు. బీఆర్ఎస్ స్టీరింగ్ మజ్లిస్, ఒవైసీల వద్ద ఉందని ఆరోపణలు చేశారు. తెలంగాణలో ముస్లింలకు రిజర్వేషన్ల తొలగింపుపై షా మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. ఆయన గతంలో అనేక సందర్భాల్లో వాగ్దానం చేశారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దీనిని పునరుద్ఘాటించారు. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం గత నెలలో ఓబీసీ ముస్లింలకు 4 శాతం కోటాను రద్దు చేసింది. తెలంగాణలో వెనుకబడిన ముస్లింలు కూడా విద్య, ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు. 15 ఏళ్ల క్రితం అవిభక్త ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టింది.రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేతృత్వంలోని ప్రభుత్వం ముస్లిం కోటాను 12 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చింది. ఐదేళ్ల క్రితమే తెలంగాణ అసెంబ్లీలో ఈ మేరకు తీర్మానం చేసి కేంద్రానికి పంపగా, ఆ ప్రతిపాదనను బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం తిరస్కరించింది.
తాజావార్తలు
-
Dil Raju: టాలీవుడ్కి కొండంత ధైర్యాన్నిచ్చిన ‘ఇరుముడి’.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
-
Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ తీవ్ర ఆగ్రహం
-
CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
-
America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!