Kejriwal: కేజ్రీవాల్ బెయిల్ సందర్భంగా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు 50 రోజుల తర్వాత భారీ ఊరట లభించింది. శుక్రవారం ఆయనకు దేశ సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం కీలక తీర్పు వెలువరించారు. పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సిన అవసరం ఉందని.. న్యాయస్థానానికి కేజ్రీవాల్ విన్నవించుకున్నారు. మొత్తానికి కేజ్రీవాల్ అభ్యర్థనను మన్నించిన ధర్మాసనం.. జూన్ 1 వరకు బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉంటే ఢిల్లీలో ఆరు దశలో పోలింగ్ జరగనుంది. అనగా మే 25న ఓటింగ్ జరగనుంది. జైలు నుంచి విడుదల కాగానే ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనవచ్చని ఆప్ నేతలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆప్ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.
ఇది కూడా చదవండి: SBI Jobs: ఎస్బీఐలో 12,000 ఉద్యోగాలు.. వివరాలు ఇలా..
Also Read
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
- Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ "పెసర గారెలు" చేసేయండి ఇలా.!
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం రెండు సార్లు ఈడీ కస్టడీకి అనుమతించింది. అటు తర్వాత జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఏప్రిల్ 1న తీహార్ జైలుకు తరలించారు. తాజాగా ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దాదాపు 21 రోజులు కేజ్రీవాల్కు బెయిల్ లభించింది. జూన్ 2న లొంగిపోవాలని కోర్టు తెలిపింది.
ఇది కూడా చదవండి: Ronald Rose : హైదరాబాద్లో పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి..
కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు సందర్భంగా కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తా మాట్లాడుతూ.. కేజ్రీవాల్ ఒక జాతీయ పార్టీకి నాయకుడని తెలిపారు. సమాజానికి ఎటువంటి ముప్పు కలిగించలేదని కోర్టు వ్యాఖ్యానించింది. అయినా కూడా ఇంకా దోషిగా నిర్ధారించబడలేదని అభిప్రాయపడ్డింది. ఎటువంటి నేర చరిత్రలు లేవు కాబట్టి.. సమాజానికి ముప్పులేదని పేర్కొంది. కేవలం లోక్సభ ఎన్నికల ప్రచారం కోసమే బెయిల్ ఇస్తున్నట్లు తెలిపింది. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన వద్దని సూచించింది. ఈ కేసుకు సంబంధించి గత నెలలో బెయిల్ పొందిన ఆప్ నాయకుడు సంజయ్ సింగ్కు విధించిన బెయిల్ షరతులు వర్తిస్తాయని స్పష్టం చేసింది.
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే మూడు విడతల్లో ఏప్రిల్ 19, 26, మే 7న పోలింగ్ ముగిసింది. నాల్గో విడత మే 13న జరగనుంది. అనంతరం మే 20, 25, జూన్ 1న జరగనుంది. ఢిల్లీలో మాత్రం మే 25న ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: Beer Cans: మద్యం తాగుతూ లక్షాధికారిగా మారిన వ్యక్తి.. ఎలా అంటే..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!