Arvind Kejriwal: బీజేపీకి సవాలు విసిరిన అరవింద్ కేజ్రీవాల్
- బీజేపీకి సవాలు విసిరిన అరవింద్ కేజ్రీవాల్.
- వారిపై ఉన్న కేసులను ఉపసంహరించుకుంటే ఎన్నికల్లో పోటీ చేయనన్న కేజ్రీవాల్.
- మురికివాడల ప్రజలను అమిత్ షా తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ బీజేపీకి సవాలు విసిరారు. ముఖ్యంగా ఢిల్లీలోని మురికివాడల విషయంలో అరవింద్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు. మురికివాడలను కూల్చివేసిన వారికి అదే స్థలంలో ఇళ్లు ఇప్పించి, వారిపై ఉన్న కేసులను ఉపసంహరించుకుంటే నేను ఎన్నికల్లో పోటీ చేయనని ఆయన అన్నారు. అలాగే డిసెంబర్ 27న షకూర్ బస్తీ రైల్వే కాలనీ సమీపంలోని మురికివాడల భూ వినియోగాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ మార్చారని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీలో చాలా మురికివాడలు ఉన్నాయని, పదేళ్లలో బీజేపీ మురికివాడల స్థానంలో 4700 ఇళ్లు మాత్రమే ఇచ్చిందని అరవింద్ తెలిపారు. ఇక జరగబోయే ఎన్నికలు ముగిసిన వెంటనే బీజేపీ అన్ని మురికివాడలను కూల్చివేస్తుందని ధ్వజమెత్తారు.
Also Read: SpaDeX Docking Update: మూడు మీటర్ల దూరంలో స్పేడెక్స్ ఉపగ్రహాలు..
Also Read
- PBKS: ఒక్క మ్యాచ్తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన 'వాంఖేడే' పోరు..
- Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
- CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
- Hardik Pandya: ఓటమిపై అసహనం.. ఓటమికి కారణం అదే అంటూ నిజాయితీగా ఒప్పుకున్న హార్దిక్ పాండ్యా..
మురికివాడల ప్రజలకు బీజేపీ ద్రోహం చేస్తోందని ఈ సందర్బంగా అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. మురికివాడల స్థానంలో ఇళ్లు ఇస్తామని బీజేపీ చెబుతోందని.. కానీ, అందులోని రైల్వే భూమిని సెప్టెంబర్ 30, 2024న టెండర్ చేసిందని చెప్పుకొచ్చారు. 15 రోజుల క్రితం లెఫ్టినెంట్ గవర్నర్ ఈ మురికివాడల భూ వినియోగాన్ని మార్చారని అన్నారు. ఫిబ్రవరి 8వ తేదీన ఎన్నికలు ముగియగానే మురికివాడలను కూల్చివేస్తారని మురికివాడల ప్రజలకే తెలియదన్నారు. మేము ఈ విషయాన్ని బహిర్గతం చేయడానికి మాత్రమే వచ్చామని కేజ్రీవాల్ అన్నారు.
झुग्गीवासियों को गुमराह कर रहे हैं अमित शाह‼️
BJP कहती है कि ‘जहाँ झुग्गी, वहाँ मकान’, लेकिन ये नहीं बता रहे कि जहाँ झुग्गी, वहाँ इनके दोस्त और Builders के मकान।
पूरी दुनिया जानती है कि इनका एक ही दोस्त है, अपने दोस्त को देने के लिए इनकी झुग्गीवालों की ज़मीन पर बुरी नज़र है।… pic.twitter.com/f681sIyAl3
— AAP (@AamAadmiParty) January 12, 2025
మరోవైపు, మురికివాడల ప్రజలను అమిత్ షా తప్పుదోవ పట్టిస్తున్నారని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ‘స్లమ్ ఉన్నచోట ఇళ్లు’ అని బీజేపీ అంటోంది కానీ, మురికివాడలు ఉన్న చోట తమ మిత్రులు, బిల్డర్ల ఇళ్లు ఉంటాయని చెప్పడం లేదని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. వాళ్లకు ఒకే ఒక్క స్నేహితుడు ఉన్నాడని ప్రపంచం మొత్తానికి తెలుసని, మురికివాడల నివాసుల భూమిని తమ స్నేహితుడికి ఇవ్వాలనుకుంటున్నాడని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
PBKS: ఒక్క మ్యాచ్తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన ‘వాంఖేడే’ పోరు..
-
Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
-
Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
-
CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
-
Aayan: ‘మీట్ అవర్ వైజాగ్ హీరో’.. అక్కయ్యపాలెం టు హైదరాబాద్.. అయాన్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!