Arvind Kejriwal: బీజేపీకి సవాలు విసిరిన అరవింద్ కేజ్రీవాల్
- బీజేపీకి సవాలు విసిరిన అరవింద్ కేజ్రీవాల్.
- వారిపై ఉన్న కేసులను ఉపసంహరించుకుంటే ఎన్నికల్లో పోటీ చేయనన్న కేజ్రీవాల్.
- మురికివాడల ప్రజలను అమిత్ షా తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.
Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ బీజేపీకి సవాలు విసిరారు. ముఖ్యంగా ఢిల్లీలోని మురికివాడల విషయంలో అరవింద్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు. మురికివాడలను కూల్చివేసిన వారికి అదే స్థలంలో ఇళ్లు ఇప్పించి, వారిపై ఉన్న కేసులను ఉపసంహరించుకుంటే నేను ఎన్నికల్లో పోటీ చేయనని ఆయన అన్నారు. అలాగే డిసెంబర్ 27న షకూర్ బస్తీ రైల్వే కాలనీ సమీపంలోని మురికివాడల భూ వినియోగాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ మార్చారని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీలో చాలా మురికివాడలు ఉన్నాయని, పదేళ్లలో బీజేపీ మురికివాడల స్థానంలో 4700 ఇళ్లు మాత్రమే ఇచ్చిందని అరవింద్ తెలిపారు. ఇక జరగబోయే ఎన్నికలు ముగిసిన వెంటనే బీజేపీ అన్ని మురికివాడలను కూల్చివేస్తుందని ధ్వజమెత్తారు.
Also Read: SpaDeX Docking Update: మూడు మీటర్ల దూరంలో స్పేడెక్స్ ఉపగ్రహాలు..
Also Read
- MI Vs LSG: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ పటాపంచల్..
- Vijay Anil Army: ‘అనిల్’ నుంచి అసెంబ్లీ వరకు.. విజయ్ రాజకీయ ప్రస్థానంలో ఆ ‘ఈల’ వేసిన మలుపులేంటి..?
- TPCC Mahesh Goud : కేరళలో యూడీఎఫ్ ఘనవిజయం.. తెలంగాణ మోడల్ పాలనే గెలిపించిందన్న మహేష్ గౌడ్.!
- Mamata Banerjee: మమతకు బిగ్ షాక్.. భవానీపూర్లో ఘోర పరాజయం
మురికివాడల ప్రజలకు బీజేపీ ద్రోహం చేస్తోందని ఈ సందర్బంగా అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. మురికివాడల స్థానంలో ఇళ్లు ఇస్తామని బీజేపీ చెబుతోందని.. కానీ, అందులోని రైల్వే భూమిని సెప్టెంబర్ 30, 2024న టెండర్ చేసిందని చెప్పుకొచ్చారు. 15 రోజుల క్రితం లెఫ్టినెంట్ గవర్నర్ ఈ మురికివాడల భూ వినియోగాన్ని మార్చారని అన్నారు. ఫిబ్రవరి 8వ తేదీన ఎన్నికలు ముగియగానే మురికివాడలను కూల్చివేస్తారని మురికివాడల ప్రజలకే తెలియదన్నారు. మేము ఈ విషయాన్ని బహిర్గతం చేయడానికి మాత్రమే వచ్చామని కేజ్రీవాల్ అన్నారు.
झुग्गीवासियों को गुमराह कर रहे हैं अमित शाह‼️
BJP कहती है कि ‘जहाँ झुग्गी, वहाँ मकान’, लेकिन ये नहीं बता रहे कि जहाँ झुग्गी, वहाँ इनके दोस्त और Builders के मकान।
पूरी दुनिया जानती है कि इनका एक ही दोस्त है, अपने दोस्त को देने के लिए इनकी झुग्गीवालों की ज़मीन पर बुरी नज़र है।… pic.twitter.com/f681sIyAl3
— AAP (@AamAadmiParty) January 12, 2025
మరోవైపు, మురికివాడల ప్రజలను అమిత్ షా తప్పుదోవ పట్టిస్తున్నారని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ‘స్లమ్ ఉన్నచోట ఇళ్లు’ అని బీజేపీ అంటోంది కానీ, మురికివాడలు ఉన్న చోట తమ మిత్రులు, బిల్డర్ల ఇళ్లు ఉంటాయని చెప్పడం లేదని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. వాళ్లకు ఒకే ఒక్క స్నేహితుడు ఉన్నాడని ప్రపంచం మొత్తానికి తెలుసని, మురికివాడల నివాసుల భూమిని తమ స్నేహితుడికి ఇవ్వాలనుకుంటున్నాడని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
MI Vs LSG: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ పటాపంచల్..
-
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
Indigo: టేకాఫ్ తర్వాత షాక్.. ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
-
Vijay Anil Army: ‘అనిల్’ నుంచి అసెంబ్లీ వరకు.. విజయ్ రాజకీయ ప్రస్థానంలో ఆ ‘ఈల’ వేసిన మలుపులేంటి..?
-
TPCC Mahesh Goud : కేరళలో యూడీఎఫ్ ఘనవిజయం.. తెలంగాణ మోడల్ పాలనే గెలిపించిందన్న మహేష్ గౌడ్.!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!