Arvind Kejriwal: బీజేపీకి సవాలు విసిరిన అరవింద్ కేజ్రీవాల్
- బీజేపీకి సవాలు విసిరిన అరవింద్ కేజ్రీవాల్.
- వారిపై ఉన్న కేసులను ఉపసంహరించుకుంటే ఎన్నికల్లో పోటీ చేయనన్న కేజ్రీవాల్.
- మురికివాడల ప్రజలను అమిత్ షా తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ బీజేపీకి సవాలు విసిరారు. ముఖ్యంగా ఢిల్లీలోని మురికివాడల విషయంలో అరవింద్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు. మురికివాడలను కూల్చివేసిన వారికి అదే స్థలంలో ఇళ్లు ఇప్పించి, వారిపై ఉన్న కేసులను ఉపసంహరించుకుంటే నేను ఎన్నికల్లో పోటీ చేయనని ఆయన అన్నారు. అలాగే డిసెంబర్ 27న షకూర్ బస్తీ రైల్వే కాలనీ సమీపంలోని మురికివాడల భూ వినియోగాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ మార్చారని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీలో చాలా మురికివాడలు ఉన్నాయని, పదేళ్లలో బీజేపీ మురికివాడల స్థానంలో 4700 ఇళ్లు మాత్రమే ఇచ్చిందని అరవింద్ తెలిపారు. ఇక జరగబోయే ఎన్నికలు ముగిసిన వెంటనే బీజేపీ అన్ని మురికివాడలను కూల్చివేస్తుందని ధ్వజమెత్తారు.
Also Read: SpaDeX Docking Update: మూడు మీటర్ల దూరంలో స్పేడెక్స్ ఉపగ్రహాలు..
Also Read
- Trump: ఈ రాత్రి ఇరాన్ను ఊహించలేని దెబ్బ కొడతాం.. ఖర్గ్ కూడా స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ వార్నింగ్
- India Loss: ముక్కోణపు వన్డే సిరీస్.. 4 పరుగుల తేడాతో భారత్-ఎపై అఫ్గానిస్థాన్-ఎ విజయం
- Indian Crew Tanker Incident: భారత్ నౌకపై దాడి.. మృతుల్లో విశాఖ వాసి
- ODI World Cup 2027: ఆఫ్రికా వేదికగా 2027 వన్డే ప్రపంచకప్.. 54 మ్యాచ్లు.. షెడ్యూల్ ఖరారు..
మురికివాడల ప్రజలకు బీజేపీ ద్రోహం చేస్తోందని ఈ సందర్బంగా అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. మురికివాడల స్థానంలో ఇళ్లు ఇస్తామని బీజేపీ చెబుతోందని.. కానీ, అందులోని రైల్వే భూమిని సెప్టెంబర్ 30, 2024న టెండర్ చేసిందని చెప్పుకొచ్చారు. 15 రోజుల క్రితం లెఫ్టినెంట్ గవర్నర్ ఈ మురికివాడల భూ వినియోగాన్ని మార్చారని అన్నారు. ఫిబ్రవరి 8వ తేదీన ఎన్నికలు ముగియగానే మురికివాడలను కూల్చివేస్తారని మురికివాడల ప్రజలకే తెలియదన్నారు. మేము ఈ విషయాన్ని బహిర్గతం చేయడానికి మాత్రమే వచ్చామని కేజ్రీవాల్ అన్నారు.
झुग्गीवासियों को गुमराह कर रहे हैं अमित शाह‼️
BJP कहती है कि ‘जहाँ झुग्गी, वहाँ मकान’, लेकिन ये नहीं बता रहे कि जहाँ झुग्गी, वहाँ इनके दोस्त और Builders के मकान।
पूरी दुनिया जानती है कि इनका एक ही दोस्त है, अपने दोस्त को देने के लिए इनकी झुग्गीवालों की ज़मीन पर बुरी नज़र है।… pic.twitter.com/f681sIyAl3
— AAP (@AamAadmiParty) January 12, 2025
మరోవైపు, మురికివాడల ప్రజలను అమిత్ షా తప్పుదోవ పట్టిస్తున్నారని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ‘స్లమ్ ఉన్నచోట ఇళ్లు’ అని బీజేపీ అంటోంది కానీ, మురికివాడలు ఉన్న చోట తమ మిత్రులు, బిల్డర్ల ఇళ్లు ఉంటాయని చెప్పడం లేదని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. వాళ్లకు ఒకే ఒక్క స్నేహితుడు ఉన్నాడని ప్రపంచం మొత్తానికి తెలుసని, మురికివాడల నివాసుల భూమిని తమ స్నేహితుడికి ఇవ్వాలనుకుంటున్నాడని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Trump: ఈ రాత్రి ఇరాన్ను ఊహించలేని దెబ్బ కొడతాం.. ఖర్గ్ కూడా స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ వార్నింగ్
-
Mandadi: సుహాస్, సూరిల ‘మండాడి’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
India Loss: ముక్కోణపు వన్డే సిరీస్.. 4 పరుగుల తేడాతో భారత్-ఎపై అఫ్గానిస్థాన్-ఎ విజయం
-
Isakapatnam : ఆమెజాన్ ఒరిజినల్ ‘ఇసకపట్నం’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Indian Crew Tanker Incident: భారత్ నౌకపై దాడి.. మృతుల్లో విశాఖ వాసి
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!