Arvind Dharmapuri: రాజా భాయ్ ఒక్క మిస్డ్కాల్ ఇస్తే చాలు.. ఎంపీ ధర్మపురి ఆసక్తికర వ్యాఖ్యలు!
- ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు
- రాజాసింగ్కు ఒక్క మిస్డ్కాల్ చాలు
- రాజాసింగ్ ఎక్కడున్నా మేము గౌరవిస్తాం
- రాజా బాయ్ సస్పెండ్ కాలేదు, రిజైన్ చేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Dharmapuri on Raja Singh BJP membership: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ పార్టీ రాజీనామాపై ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజా భాయ్ పార్టీ సభ్యత్వం కోసం ఒక్క మిస్డ్కాల్ ఇస్తే చాలన్నారు. రాజా బాయ్ సస్పెండ్ కాలేదని, రిజైన్ చేశారని తెలిపారు. కొన్ని విషయాల్లో మనస్థాపం చెంది రాజాసింగ్ రిజైన్ చేశారని పేర్కొన్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీలకు ఒక్కొక్కరికి రెండు నియోజకవర్గాల బాధ్యతలు ఇవ్వాలని అధిష్టానంకు సూచించారు. ప్రతిఒక్కరికి పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలని, ఫలితం చూపించకపోతే పక్కకు పెట్టాలని ఎంపీ ధర్మపురి చెప్పుకొచ్చారు.
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఈరోజు ఎంపీ ధర్మపురి అరవింద్ బీజేపీ పార్టీకి సంబంధించిన పలు అంశాలపై మాట్లాడారు. ‘రాజాసింగ్ ఎక్కడున్నా మేము గౌరవిస్తాం. ఆయన ఐడియాలాజికల్ మ్యాప్. రాజా బాయ్ సస్పెండ్ కాలేదు, రిజైన్ చేశారు. రాజాసింగ్ పార్టీ సభ్యత్వం కోసం ఒక్క మిస్డ్ కాల్ ఇచ్చి మెంబర్షిప్ తీసుకొచ్చు. కొన్ని విషయాల్లో మనస్థాపం చెంది రిజైన్ చేశారు. తెలంగాణ బీజేపీ ఎంపీలకు ఒక్కొక్కరికి రెండు నియోజకవర్గాల బాధ్యతలు ఇవ్వాలి. పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలి, ఫలితం చూపించకపోతే పక్కకు పెట్టాలి. ఏ పార్టీకైనా కార్యకర్తలు కీలకం. కార్యకర్తలు, నాయకులు అయ్యే సమయం ఇది. ఇందూర్ జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి మేం గెలుస్తున్నాం. తెలంగాణలో వచ్చేవి కార్యకర్తల కోసం జరిగే ఎన్నికలు. ప్రతి నాయకులు ఈ విషయాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలి. తమ కార్యకర్తలను నాయకులుగా చేయాలి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం గెలిపించుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవాలి’ అని ఎంపీ ధర్మపురి అన్నారు.
Also Read
Also Read: Variety Thief: జగిత్యాలలో వెరైటీ దొంగ.. అతడి టార్గెట్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు!
‘కాంగ్రెస్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తున్నారు. కొండా మురళి, కొండా సురేఖలు ఏం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో కవిత, కేటీఆర్ ఏం చేస్తున్నారు. పార్టీ అన్నాక కొన్ని నడుస్తూ ఉంటాయి. బీజేపీ పాత అధ్యక్షుడు, కొత్త అధ్యక్షుడు కలిసి ఈటల, బండి సంజయ్ విషయంలో మాట్లాడాలి. అవసరమైతే అధిష్టానం పెద్దలు మాట్లాడాలి. ఈటల, బండి సంజయ్ విషయంలో సెంట్రల్ పార్టీ నోడల్ ఎంక్వయిరీ కమిషన్ వేసుకోవాలి’ అని ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!