TTE: నకిలీ టీటీఈ అవతారమెత్తిన ఆర్మీ జవాన్.. ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ..
- నకిలీ టీటీఈ అవతారమెత్తిన ఆర్మీ జవాన్
- ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైళ్లలో అప్పుడప్పుడు కొందరు వ్యక్తులు ఫేక్ టీటీఈ(ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్) లుగా, టీసీలు(టికెట్ చెక్కర్స్)గా అవతారమెత్తి ప్రయాణికుల నుంచి వసూళ్లకు పాల్పడుతుంటారు. ఆ తర్వాత పోలీసులకు దొరికిపోతుంటారు. అయితే తాజాగా ఓ వ్యక్తి కూడా ఇదేవిధంగా ఫేక్ టీటీఈగా వ్యవహరిస్తూ పోలీసులకు పట్టబడ్డాడు. అయితే ఇక్కడ షాకిచ్చే విషయం ఏంటంటే? ఓ ఆర్మీ జవాన్ నకిలీ టీటీఈగా వసూళ్లకు పాల్పడడం. రైలులో ప్రయాణికుల నుండి డబ్బు వసూలు చేస్తూ పట్టుబడ్డాడు. ఈ సంఘటన ఝాన్సీ నుంచి గ్వాలియర్కు ప్రయాణిస్తున్న జీలం ఎక్స్ప్రెస్లో చోటుచేసుకుంది.
Also Read:Carbide gun: దీపావళి రోజు ‘‘కార్బైడ్ గన్’’ విషాదం.. కంటిచూపు కోల్పోయిన 14 మంది చిన్నారులు..
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
నివేదికల ప్రకారం, సైనికుడు కమల్ పాండే, TTEగా నటిస్తూ, రైలు బోగీలో ప్రయాణికుల నుండి డబ్బు వసూల్ కు పాల్పడ్డాడు. సీట్లు లేని ప్రయాణీకులకు సీట్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చి వారి నుంచి డబ్బు వసూలు చేశాడు. ఈ సమయంలో ఆ బోగీలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు ఈ తతంగాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అంతేకాదు రైల్వే హెల్ప్లైన్ నంబర్ 139కి కూడా ఈ సంఘటన గురించి ఫిర్యాదు చేశాడు.
Also Read:PM Modi: రేపటి నుంచే బీహార్లో మోడీ ఎన్నికల ప్రచారం.. ఎక్కడ నుంచంటే..!
ఫిర్యాదు అందిన వెంటనే, RPF బృందం స్పందించింది. జీలం ఎక్స్ప్రెస్ కోచ్లోకి వచ్చి నకిలీ టీటీఈని గుర్తించారు. ప్రయాణికుల నుండి డబ్బు వసూలు చేస్తుండగా వారు కమల్ పాండేను పట్టుకున్నారు. గ్వాలియర్ రైల్వే స్టేషన్లో అతన్ని దింపి GRPకి అప్పగించారు. నిందితుడు కమల్ పాండే ఆర్మీలో పనిచేస్తున్నాడని, ఉత్తరప్రదేశ్లో పోస్టింగ్ పొందాడని జిఆర్పి స్టేషన్ ఇన్చార్జ్ జితేంద్ర చందేలియా తెలిపారు. అతని వద్ద ప్రయాణికుల నుండి వసూలు చేసిన రూ.1,620 దొరికింది. అతనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారని తెలిపారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!