Stone Pelting: పోలీసులు-గ్రామస్తులకు మధ్య వాగ్వాదం.. పోలీస్స్టేషన్పై రాళ్ల దాడి
- మహారాష్ట్రలోని జల్గావ్లో పోలీస్స్టేషన్పై రాళ్లు రువ్విన కొందరు వ్యక్తులు
- ఈ ఘటనలో 8 మంది పోలీసులకు గాయాలు
- ఆరుగురిని ఆస్పత్రిలో చేరిపించిన అధికారులు
- పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కర్ఫ్యూ విధింపు
మహారాష్ట్రలోని జల్గావ్లో పోలీస్స్టేషన్పై కొందరు వ్యక్తులు రాళ్లు రువ్విన ఉదంతం వెలుగు చూసింది. ఈ ఘటనలో 8 మంది పోలీసులు గాయపడగా, వారిలో ఆరుగురిని ఆస్పత్రిలో చేరిపించారు. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కర్ఫ్యూ విధించారు. ఈ సంఘటన జల్గావ్లోని జామ్నేర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అసలు విషయానికొస్తే.. జూన్ 11వ తేదీన ఈ ప్రాంతంలో 6 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. ఈ క్రమంలో.. పోలీసులు ఇటీవల నిందితులను అరెస్టు చేశారు. అయితే.. కోపంతో ఉన్న స్థానిక ప్రజలు గురువారం రాత్రి పోలీసు స్టేషన్కు చేరుకున్నారు.
Read Also: Virat – SKY : ఆ విషయంలో అప్పుడే కోహ్లీ రికార్డును సమం చేసిన సూర్య..
Also Read
- House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
- Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
కాగా.. నిందితుడిని తమకు అప్పగించాలని పోలీసులను డిమాండ్ చేశారు. దానికి పోలీసులు నిరాకరించడంతో స్థానిక ప్రజలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. అంతేకాకుండా.. ఆగ్రహించిన ప్రజలు పోలీస్ స్టేషన్పై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఒక పోలీసు అధికారి సహా మొత్తం 8 మంది పోలీసులు గాయపడ్డారు. మరోవైపు.. కోపంతో ఉన్న ప్రజలు నగరంలోని పలు ప్రాంతాల్లో నిప్పుపెట్టి కొన్ని వాహనాలను దగ్ధం చేశారు.
Isha Koppikar: ఆ హీరో ఒంటరిగా రమ్మన్నాడు.. సంచలన విషయాలు బయట పెట్టిన హీరోయిన్
అయితే.. పరిస్థితి విషమించడంతో జల్గావ్ నగరం నుండి పోలీసు బలగాలను రప్పించారు. ప్రస్తుతం పోలీసులు కర్ఫ్యూ విధించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడిన 8 మంది పోలీసులలో 6 మందిని జల్గావ్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. వీరిలో కొందరికి తలకు గాయాలు కాగా, మరికొందరికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై జలగావ్ డీఎం ఆయుష్ ప్రసాద్ మాట్లాడుతూ.. రాళ్లదాడి ఘటనలో ఆరుగురు పోలీసులు గాయపడ్డారని చెప్పారు. వారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!