Stone Pelting: పోలీసులు-గ్రామస్తులకు మధ్య వాగ్వాదం.. పోలీస్స్టేషన్పై రాళ్ల దాడి
- మహారాష్ట్రలోని జల్గావ్లో పోలీస్స్టేషన్పై రాళ్లు రువ్విన కొందరు వ్యక్తులు
- ఈ ఘటనలో 8 మంది పోలీసులకు గాయాలు
- ఆరుగురిని ఆస్పత్రిలో చేరిపించిన అధికారులు
- పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కర్ఫ్యూ విధింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలోని జల్గావ్లో పోలీస్స్టేషన్పై కొందరు వ్యక్తులు రాళ్లు రువ్విన ఉదంతం వెలుగు చూసింది. ఈ ఘటనలో 8 మంది పోలీసులు గాయపడగా, వారిలో ఆరుగురిని ఆస్పత్రిలో చేరిపించారు. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కర్ఫ్యూ విధించారు. ఈ సంఘటన జల్గావ్లోని జామ్నేర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అసలు విషయానికొస్తే.. జూన్ 11వ తేదీన ఈ ప్రాంతంలో 6 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. ఈ క్రమంలో.. పోలీసులు ఇటీవల నిందితులను అరెస్టు చేశారు. అయితే.. కోపంతో ఉన్న స్థానిక ప్రజలు గురువారం రాత్రి పోలీసు స్టేషన్కు చేరుకున్నారు.
Read Also: Virat – SKY : ఆ విషయంలో అప్పుడే కోహ్లీ రికార్డును సమం చేసిన సూర్య..
Also Read
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
- Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఈ నెల 28 నుంచే ప్రారంభం..
- France: ఫ్రాన్స్లో ఎండలు భగభగ.. ఏసీల కోసం ఎగబడ్డ జనాలు
- Chilli Garlic Egg Salad Recipe: ఉదయాన్నే ఎనర్జీ కావాలా? 5 నిమిషాల్లో రెడీ.. రుచికరమైన హై-ప్రోటీన్ ఎగ్ సలాడ్
కాగా.. నిందితుడిని తమకు అప్పగించాలని పోలీసులను డిమాండ్ చేశారు. దానికి పోలీసులు నిరాకరించడంతో స్థానిక ప్రజలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. అంతేకాకుండా.. ఆగ్రహించిన ప్రజలు పోలీస్ స్టేషన్పై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఒక పోలీసు అధికారి సహా మొత్తం 8 మంది పోలీసులు గాయపడ్డారు. మరోవైపు.. కోపంతో ఉన్న ప్రజలు నగరంలోని పలు ప్రాంతాల్లో నిప్పుపెట్టి కొన్ని వాహనాలను దగ్ధం చేశారు.
Isha Koppikar: ఆ హీరో ఒంటరిగా రమ్మన్నాడు.. సంచలన విషయాలు బయట పెట్టిన హీరోయిన్
అయితే.. పరిస్థితి విషమించడంతో జల్గావ్ నగరం నుండి పోలీసు బలగాలను రప్పించారు. ప్రస్తుతం పోలీసులు కర్ఫ్యూ విధించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడిన 8 మంది పోలీసులలో 6 మందిని జల్గావ్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. వీరిలో కొందరికి తలకు గాయాలు కాగా, మరికొందరికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై జలగావ్ డీఎం ఆయుష్ ప్రసాద్ మాట్లాడుతూ.. రాళ్లదాడి ఘటనలో ఆరుగురు పోలీసులు గాయపడ్డారని చెప్పారు. వారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజావార్తలు
-
Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఈ నెల 28 నుంచే ప్రారంభం..
-
France: ఫ్రాన్స్లో ఎండలు భగభగ.. ఏసీల కోసం ఎగబడ్డ జనాలు
-
Maa Inti Bangaram : సమంత ‘గోల్డెన్ రన్’.. 17 లక్షలకు పైగా టికెట్లతో ‘మా ఇంటి బంగారం’ సరికొత్త రికార్డ్!
-
Chilli Garlic Egg Salad Recipe: ఉదయాన్నే ఎనర్జీ కావాలా? 5 నిమిషాల్లో రెడీ.. రుచికరమైన హై-ప్రోటీన్ ఎగ్ సలాడ్
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!