Stone Pelting: పోలీసులు-గ్రామస్తులకు మధ్య వాగ్వాదం.. పోలీస్స్టేషన్పై రాళ్ల దాడి
- మహారాష్ట్రలోని జల్గావ్లో పోలీస్స్టేషన్పై రాళ్లు రువ్విన కొందరు వ్యక్తులు
- ఈ ఘటనలో 8 మంది పోలీసులకు గాయాలు
- ఆరుగురిని ఆస్పత్రిలో చేరిపించిన అధికారులు
- పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కర్ఫ్యూ విధింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలోని జల్గావ్లో పోలీస్స్టేషన్పై కొందరు వ్యక్తులు రాళ్లు రువ్విన ఉదంతం వెలుగు చూసింది. ఈ ఘటనలో 8 మంది పోలీసులు గాయపడగా, వారిలో ఆరుగురిని ఆస్పత్రిలో చేరిపించారు. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కర్ఫ్యూ విధించారు. ఈ సంఘటన జల్గావ్లోని జామ్నేర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అసలు విషయానికొస్తే.. జూన్ 11వ తేదీన ఈ ప్రాంతంలో 6 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. ఈ క్రమంలో.. పోలీసులు ఇటీవల నిందితులను అరెస్టు చేశారు. అయితే.. కోపంతో ఉన్న స్థానిక ప్రజలు గురువారం రాత్రి పోలీసు స్టేషన్కు చేరుకున్నారు.
Read Also: Virat – SKY : ఆ విషయంలో అప్పుడే కోహ్లీ రికార్డును సమం చేసిన సూర్య..
Also Read
- Rajasthan: అమానుషం.. రూ.500 నోటు పోయిందని బాలికల బట్టలు విప్పి తనిఖీ చేసిన టీచర్
- India vs England 2nd ODI: కేఎల్ రాహుల్ ఔట్.. ఇషాన్ కిషన్ ఇన్.. అసలు కారణం చెప్పిన కెప్టెన్ గిల్
- EV Market: ఎలక్ట్రిక్ వాహనాల జోరు..12 రెట్లు పెరిగిన EV మార్కెట్..
- Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
కాగా.. నిందితుడిని తమకు అప్పగించాలని పోలీసులను డిమాండ్ చేశారు. దానికి పోలీసులు నిరాకరించడంతో స్థానిక ప్రజలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. అంతేకాకుండా.. ఆగ్రహించిన ప్రజలు పోలీస్ స్టేషన్పై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఒక పోలీసు అధికారి సహా మొత్తం 8 మంది పోలీసులు గాయపడ్డారు. మరోవైపు.. కోపంతో ఉన్న ప్రజలు నగరంలోని పలు ప్రాంతాల్లో నిప్పుపెట్టి కొన్ని వాహనాలను దగ్ధం చేశారు.
Isha Koppikar: ఆ హీరో ఒంటరిగా రమ్మన్నాడు.. సంచలన విషయాలు బయట పెట్టిన హీరోయిన్
అయితే.. పరిస్థితి విషమించడంతో జల్గావ్ నగరం నుండి పోలీసు బలగాలను రప్పించారు. ప్రస్తుతం పోలీసులు కర్ఫ్యూ విధించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడిన 8 మంది పోలీసులలో 6 మందిని జల్గావ్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. వీరిలో కొందరికి తలకు గాయాలు కాగా, మరికొందరికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై జలగావ్ డీఎం ఆయుష్ ప్రసాద్ మాట్లాడుతూ.. రాళ్లదాడి ఘటనలో ఆరుగురు పోలీసులు గాయపడ్డారని చెప్పారు. వారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజావార్తలు
-
Rajasthan: అమానుషం.. రూ.500 నోటు పోయిందని బాలికల బట్టలు విప్పి తనిఖీ చేసిన టీచర్
-
Aishwarya Rajesh: సైకో క్యారెక్టర్లు చేయాలని ఉంది
-
Ganja Seizure : హైదరాబాద్ శివారులో రూ. 1.50 కోట్ల గంజాయి పట్టివేత
-
Harish Rao : ‘కరెంట్ ఉంటేనే వార్త’.. హరీష్ ఫైర్.!
-
Aishwarya Rajesh : భయపడి 50 సినిమాలు చేశ .. ఐశ్వర్య రాజేష్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!