CM Revanth Reddy: బనకచర్లపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా..? కేసీఆర్కి సీఎం రేవంత్ సవాల్..
- బనకచర్ల పై అసెంబ్లీలో కేసీఆర్ చర్చకు సిద్ధమా..?
- గోదావరిలోకి 3 వేల టీఎంసీలు వెళ్తున్నాయని చెప్పింది మీరు కాదా?
- చంద్రబాబుతో కలిసి ఉండే వాడినే అయితే అప్పుడే వెళ్లే వాడిని
- సోనియాకు అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన
- రైతు భరోసా విజయోత్సవ సభలో ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బనకచర్ల పై అసెంబ్లీలో కేసీఆర్ చర్చకు సిద్ధమా..? అని సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు. రైతు భరోసా విజయోత్సవ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. 2016లో గోదావరిలోకి 3 వేల టీఎంసీలు వెళ్తున్నాయని చెప్పింది మీరు కాదా? అని నిలదీశారు. చంద్రబాబుతో కలిసి ఉండే వాడినే అయితే అప్పుడే వెళ్లి ఉండే వాడిని కాదా? అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాకు అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీలో కి వచ్చిన.. నీ మాదిరి మోసం చేయలే అని విమర్శించారు. తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని మోసం చేయలేదని.. బనకచర్ల పై చర్చ కోసం కేసీఆర్ స్పీకర్ కు లేఖ రాయాలన్నారు. తెలంగాణకు మరణ శాసనం రాసింది కేసీఆర్ అని.. కేసీఆర్ హయాంలో ఏపీ ముచుమర్రి కట్టారు. పోతిరెడ్డిపాడు పొక్క పెద్దది చేసింది కూడా మీ హయాంలోనే అన్నారు.
READ MORE: Perni Nani: చంద్రబాబు, పవన్, లోకేష్పై పేర్నా నాని తీవ్ర వ్యాఖ్యలు..
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
అనంతరం రాష్ట్రంలో నిరుద్యోగ పరిస్థితిపై సీఏం రేవంత్ ప్రసంగించారు. “పదేళ్లలో కేసీఆర్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావో ప్రజలకు లెక్క చెప్పు.. దేని మీద నువ్వు చర్చకు వస్తావ్ కేసీఆర్ అని నేను అడుతున్న.. 1లక్ష 4 వేల కోట్ల రూపాయలతో రైతును రాజును చేసిన ప్రభుత్వం మాది. వ్యవసాయం అంటే రైతుకు సాయం చేయడం. కాళేశ్వరం పేరుతో కమిషన్లు తీసుకున్నారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పాము. ఆదిశగా మహిళలకు పెట్రోల్ బంకులు పెట్టించాము. ప్రజా పాలనలో అందరూ భద్రంగా ఉండాలని చూస్తున్నాం. పదేళ్ల బీఆర్ఎస్ పాలన.. 18 ఏళ్ల మా పాలనపై ఎక్కడికక్కడ చర్చ పెట్టండి. పదేళ్లలో ఏ ప్రాజెక్టులు చూసిన పూర్తి చేయాలే. కాళేశ్వరం కూలేశ్వరం అయ్యింది. లక్ష కోట్లు వృధా అయ్యాయి. చిన్న కాళేశ్వరం లో నిన్ను ఉరేసినా తప్పులేదని రైతులు అంటున్నారు.” అని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు.
“గోదావరి నీటి పై ఒకరోజు, కృష్ణా నీటిపై ఒకరోజు అసెంబ్లీలో చర్చ చేద్దాం. రాయలసీమను రతనాల సీమ చేస్తానని చెప్పింది ఎవరో ఆధారాలు సహా చెబుతా. అప్పుడంటే పెద్దలు జానారెడ్డి నీతో ఎందుకులే అనుకున్నారు. ఇప్పుడు అలా కాదు. నువ్వు అసెంబ్లీకి రా.. నీ సంగతి చూస్తాం. రాబోయే రోజుల్లో రాజీవ్ యువ వికాసం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని భట్టి విక్రమార్కకు సూచిస్తున్నా. రాబోయే మరో ఐదేళ్లు అధికారంలో ఉండేది కాంగ్రెస్ పార్టీనే. ప్రజలందరూ మరోసారి ఆశీర్వదించండి.” అని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!