Aptech CEO: కంప్యూటర్ విద్యను గ్రామాలకు పరిచయం చేసిన గొప్పవ్యక్తి.. అనిల్ పంత్ కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aptech CEO: కంప్యూటర్ కంపెనీ ఆప్టెక్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ పంత్ (Aptech CEO) కన్నుమూశారు. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో కంపెనీ అనిల్ పంత్ మరణ సమాచారాన్ని ఇచ్చింది. కంపెనీ తెలిపిన ప్రకారం.. అనిల్ పంత్ ఆగస్టు 15 న మరణించాడు. పంత్ సహకారం, సహాయక శక్తిని ఆప్టెక్ బృందం కోల్పోతుందని కంపెనీ తెలిపింది.
అనిల్ పంత్ తన ఆకస్మిక అనారోగ్య కారణంగా నిరవధిక సెలవుపై వెళ్లారు. గత సంవత్సరం జూన్ 19 న కంపెనీ ఒక అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది, దీనిలో సాఫీగా వ్యాపార కార్యకలాపాలు, నిర్వహణ కొనసాగింపును నిర్ధారించడానికి సెలక్టెడ్ బోర్డు సభ్యులతో కంపెనీ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. మధ్యంతర సీఈవోని ఎన్నుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని Aptech బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు కమిటీకి సూచించబడింది. జున్జున్వాలా కుటుంబానికి కూడా ఆప్టెక్లో స్టాక్స్ ఉన్నాయి.
Also Read
- Modi-Trump: మరోసారి మోడీపై ట్రంప్ ప్రశంసల జల్లు.. ఈసారి ఏమన్నారంటే..!
- Meloni-Trump: ఇటలీ ఎప్పుడూ అలా చేయదు.. ట్రంప్పై మెలోని తీవ్ర ఆగ్రహం
- Sai Krishna Missing Case: సాయి కృష్ణ కుటుంబానికి అండగా ప్రభుత్వం.. సీఎం భరోసాతో సంతృప్తి వ్యక్తం చేసిన తల్లి
- Sunil Gavaskar: గిల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్పై గవాస్కర్ ప్రశంసలు.. ఆ 'గట్ ఫీల్' గురించే అంటూ వ్యాఖ్యలు..
Read Also:Viral Video: స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని ఆపిన తాగుబోతు… వీడియో చూస్తే నవ్వులే నవ్వులు
2016 సంవత్సరం నుండి అనిల్ పంత్ ఆప్టెక్ కంపెనీకి సీఈవో, ఎండీగా నడిపించారు. ఇంతకు ముందు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), Sify టెక్నాలజీస్ వంటి సంస్థలలో పనిచేశాడు. అతను 15 సంవత్సరాలకు పైగా ఐటి, కమ్యూనికేషన్ రంగంలో పనిచేశాడు. సేల్స్, క్వాలిటీ కంట్రోల్, ఆన్ టైమ్ డెలివరీ, మార్కెటింగ్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్తో సహా వివిధ పదవులను నిర్వహించారు.
యూనివర్సిటీ ఆఫ్ మలేషియా నుంచి అనిల్ పంత్ ఐటీ ఇంజినీరింగ్లో పీహెచ్డీ చేశాడు. అనిల్ పంత్ 2010 నుంచి 2016 వరకు టీసీఎస్లో ప్రిన్సిపల్ అడ్వైజర్గా పనిచేశారు. దీనికి ముందు 2008 నుండి 2010 వరకు సిఫీ టెక్నాలజీస్కు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఇదే కాకుండా అతను అనేక ఇతర పెద్ద కంపెనీలలో కూడా పనిచేశాడు. ఆప్టెక్ ఇప్పటికే మార్కెట్లోని చిన్న నగరాలు, పట్టణాలలో కంప్యూటర్ విద్యను అందిస్తోంది. అనిల్ పంత్ రాక తర్వాత కంపెనీ పనితీరు వేగంగా విస్తరించింది. కంపెనీ అనేక ప్రశంస పత్రాలను కూడా పొందింది. 2018లో CMMI ఇన్స్టిట్యూట్ నుండి మెచ్యూరిటీ లెవల్-3లో పీపుల్ కెపాబిలిటీ మెచ్యూరిటీ మోడల్ కూడా సాధించింది.
Read Also:Leopard Attack: తిరుమలలో చిరుత దాడులపై టీడీపీ హాట్ కామెంట్లు.. ఇది వైసీపీ ‘పుష్పా’ల వల్లే..!
తాజావార్తలు
-
Vikram Malik: వెల్కమ్ టూ ‘జడల్ జమానా’! ‘ది ప్యారడైజ్’ నుంచి ఇప్పుడు ఎవడు వస్తున్నాడో ఎరికెనా?
-
Nagabandham Trailer: అనంత పద్మనాభ స్వామి ఆలయ రహస్యంతో ‘నాగబంధం’.. ట్రైలర్ చూశారా!
-
Modi-Trump: మరోసారి మోడీపై ట్రంప్ ప్రశంసల జల్లు.. ఈసారి ఏమన్నారంటే..!
-
Hyderabad : కేబీఆర్ పార్క్ దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే.!
-
Ragi Bellam Cake: చిన్న గిన్నెల్లోనే ఎగ్లెస్ రాగి బెల్లం కప్ కేక్స్.. హెల్తీ అండ్ టేస్టీగా ఇలా చేసుకోండి!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?