Aptech CEO: కంప్యూటర్ విద్యను గ్రామాలకు పరిచయం చేసిన గొప్పవ్యక్తి.. అనిల్ పంత్ కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aptech CEO: కంప్యూటర్ కంపెనీ ఆప్టెక్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ పంత్ (Aptech CEO) కన్నుమూశారు. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో కంపెనీ అనిల్ పంత్ మరణ సమాచారాన్ని ఇచ్చింది. కంపెనీ తెలిపిన ప్రకారం.. అనిల్ పంత్ ఆగస్టు 15 న మరణించాడు. పంత్ సహకారం, సహాయక శక్తిని ఆప్టెక్ బృందం కోల్పోతుందని కంపెనీ తెలిపింది.
అనిల్ పంత్ తన ఆకస్మిక అనారోగ్య కారణంగా నిరవధిక సెలవుపై వెళ్లారు. గత సంవత్సరం జూన్ 19 న కంపెనీ ఒక అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది, దీనిలో సాఫీగా వ్యాపార కార్యకలాపాలు, నిర్వహణ కొనసాగింపును నిర్ధారించడానికి సెలక్టెడ్ బోర్డు సభ్యులతో కంపెనీ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. మధ్యంతర సీఈవోని ఎన్నుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని Aptech బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు కమిటీకి సూచించబడింది. జున్జున్వాలా కుటుంబానికి కూడా ఆప్టెక్లో స్టాక్స్ ఉన్నాయి.
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
- LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
- Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
- Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
Read Also:Viral Video: స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని ఆపిన తాగుబోతు… వీడియో చూస్తే నవ్వులే నవ్వులు
2016 సంవత్సరం నుండి అనిల్ పంత్ ఆప్టెక్ కంపెనీకి సీఈవో, ఎండీగా నడిపించారు. ఇంతకు ముందు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), Sify టెక్నాలజీస్ వంటి సంస్థలలో పనిచేశాడు. అతను 15 సంవత్సరాలకు పైగా ఐటి, కమ్యూనికేషన్ రంగంలో పనిచేశాడు. సేల్స్, క్వాలిటీ కంట్రోల్, ఆన్ టైమ్ డెలివరీ, మార్కెటింగ్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్తో సహా వివిధ పదవులను నిర్వహించారు.
యూనివర్సిటీ ఆఫ్ మలేషియా నుంచి అనిల్ పంత్ ఐటీ ఇంజినీరింగ్లో పీహెచ్డీ చేశాడు. అనిల్ పంత్ 2010 నుంచి 2016 వరకు టీసీఎస్లో ప్రిన్సిపల్ అడ్వైజర్గా పనిచేశారు. దీనికి ముందు 2008 నుండి 2010 వరకు సిఫీ టెక్నాలజీస్కు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఇదే కాకుండా అతను అనేక ఇతర పెద్ద కంపెనీలలో కూడా పనిచేశాడు. ఆప్టెక్ ఇప్పటికే మార్కెట్లోని చిన్న నగరాలు, పట్టణాలలో కంప్యూటర్ విద్యను అందిస్తోంది. అనిల్ పంత్ రాక తర్వాత కంపెనీ పనితీరు వేగంగా విస్తరించింది. కంపెనీ అనేక ప్రశంస పత్రాలను కూడా పొందింది. 2018లో CMMI ఇన్స్టిట్యూట్ నుండి మెచ్యూరిటీ లెవల్-3లో పీపుల్ కెపాబిలిటీ మెచ్యూరిటీ మోడల్ కూడా సాధించింది.
Read Also:Leopard Attack: తిరుమలలో చిరుత దాడులపై టీడీపీ హాట్ కామెంట్లు.. ఇది వైసీపీ ‘పుష్పా’ల వల్లే..!
తాజావార్తలు
-
CM Revanth Reddy : రేవంత్తో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ భేటీ.. గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానం
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
-
Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
-
LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
-
Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?