APSRTC: భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత.. ఆ నిర్ణయం వెనక్కి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీఎస్ఆర్టీసీ ఒక నిర్ణయం భక్తులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆ నిర్ణయాన్ని విత్ డ్రా చేసుకోక తప్పలేదు. వచ్చే 10 రోజులు టోకెన్లు ఉంటేనే ఆసీ బస్సుల్లోకి భక్తులను అనుమతి ఇస్తామన్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది ఆర్టీసీ. భక్తుల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆర్టీసీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వైకుంఠ ద్వారం తెరిచే పది రోజులు దర్శన టోకెన్లతో సంబంధం లేకుండా యధావిధిగా ఆర్టీసీ బస్సుల్లో కొండపైకి భక్తులు తమ ప్రయాణాలు చేసుకోవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
Read Also: Rishabh Pant: రిషభ్ పంత్ ఆరోగ్యంపై అప్డేట్.. వైద్యులు ఏం చెప్తున్నారంటే..
అసలేం జరిగిందంటే?
Also Read
- WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
- CM Chandrababu: ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సమస్యకు ఫుల్ స్టాప్.. సీఎం కీలక ఆదేశాలు..
- RudraM-2: చైనా-పాక్ గుండెల్లో గుబులు.. రుద్రమ్-2 క్షిపణి పరీక్ష సక్సెస్..
- EPFO EDLI Scheme: ఉద్యోగులకు శుభవార్త.. ఒక్క రూపాయి చెల్లించకుండానే రూ.7 లక్షల బీమా..
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది తిరుమలకు తరలివస్తుంటారు.. ఇక, వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతి, తిరుమలకు భక్తులు పోటెత్తుతారు. అయితే, ఈ సమయంలో.. ఏపీఎస్ఆర్టీసీ, తిరుపతి విభాగం ఓ నిర్ణయం తీసుకుంది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని వైకుంఠ ద్వారం తెరిచి ఉంచే 10 రోజులపాటు దర్శన టికెట్లు కలిగి ఉన్న ప్రయాణికులను మాత్రమే కొండపైకి అనుమతించాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై వెంకన్న భక్తులు మండిపడ్డారు. అసలు, శ్రీవారి దర్శనానికి, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి సంబంధం ఏంటి? అని మండిపడుతున్నారు శ్రీవారి భక్తులు.
వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యల్లో తరలివచ్చే అవకాశం ఉండడంతో.. టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.. ఓవైపు ప్రత్యేక దర్శనం టికెట్లు.. మరోవైపు సర్వదర్శనం టోకెన్లు జారీచేస్తోంది. భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతోంది. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని. సిఫార్సు లేఖలు అనుమతించడం లేదని టీటీడీ అధికారులు చెబుతున్నారు.. ఇదే సమయంలో.. టికెట్లు, టోకెన్లు ఉంటేనే తిరుమలకు రావాలని స్పష్టం చేశారు. ఈ తరుణంలో.. ఆర్టీసీ నిర్ణయం వివాదాస్పదం అయింది. దీనిని వెనక్కి తీసుకుంది ఆర్టీసీ.
Read Also: Tamil Nadu: మాజీ ఎంపీ మృతిలో ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..
తాజావార్తలు
-
WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
-
CM Chandrababu: ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సమస్యకు ఫుల్ స్టాప్.. సీఎం కీలక ఆదేశాలు..
-
RudraM-2: చైనా-పాక్ గుండెల్లో గుబులు.. రుద్రమ్-2 క్షిపణి పరీక్ష సక్సెస్..
-
Kitchen Hygiene: ఈ చిన్న చిట్కాలు పాటిస్తే మీ ఇంట్లో ఒక్క బొద్దింక కూడా కనిపించదు!
-
EPFO EDLI Scheme: ఉద్యోగులకు శుభవార్త.. ఒక్క రూపాయి చెల్లించకుండానే రూ.7 లక్షల బీమా..
ట్రెండింగ్
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!