Konakalla Narayana Rao: డబ్బులు కట్టినా.. పేర్ని నాని కేసు తప్పించుకోలేరు!
- రేషన్ బియ్యం పక్కదారి
- పేర్ని నానిపై ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ ఫైర్
- పేర్ని నాని కుటుంబను దాచారనే ప్రచారం సరికాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని దోంగతనం చేసి డబ్బులు కట్టినంత మాత్రాన కేసు ఉండకుండా ఉండదని టీడీపీ నేత, ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు అన్నారు. బియ్యం దొంగతనం జరిగిందని పేర్ని నాని ఒప్పుకున్నారని, మాయమైన బియ్యానికి ఆయన సమాధానం చెప్పాలన్నారు. పేర్ని నాని కుటుంబ సభ్యులను కూటమి నేతలు దాచారనే ప్రచారం సరికాదని, పేర్ని నానిని దాయాల్సిన అవసరం తమకు లేదని నారాయణరావు పేర్కొన్నారు.
‘పేర్ని నాని దోంగతనం చేసి డబ్బులు కట్టినంత మాత్రాన కేసు ఉండకుండా ఉండదు. మాయమైన బియ్యానికి ఆయన సమాధానం చెప్పాలి. డబ్బులు కట్టినా కేసు నుంచి తప్పించుకోలేరు.బియ్యం వేరే వారికి అమ్మారు కాబట్టి కేసు పెడతారు, చర్యలు తీసుకుంటారు. బియ్యం దొంగతనం జరిగిందని పేర్ని నాని ఒప్పుకున్నారు. డబ్బులు కట్టినంత మాత్రాన క్షమిస్తారని అనుకోవద్దు. పేర్ని నాని కుటుంబ సభ్యులను కూటమి నేతలు దాచారనే ప్రచారం సరికాదు. పేర్ని నానిని దాయాల్సిన అవసరం మాకు లేదు.పేర్ని నాని ఎప్పుడు దొరుకుతాడా? అని ఎదురుచూస్తున్నాం. జోగి రమేష్ తో కలిసి కార్యక్రమంలో పాల్గొనటంపై చంద్రబాబును కలిసి వివరిస్తాను. దీనిపై నన్ను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఎటువంటి వివరణ అడగలేదు. చంద్రబాబు హైదరాబాద్ నుంచి రాగానే కలుస్తాను. అనుకోకుండా కలిశామా, ఉద్దేశపూర్వకంగా కలిశామా అనేది అందరికీ తెలుస్తుంది’ అని ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు చెప్పారు.
Also Read
- IPL 2026 Final: ఫైనల్ కు వర్షం గండం.. మరి రిజర్వ్ డే సంగతేంటి.?
- Shubman Gill Vs Vaibhav Suryavanshi: గిల్ మ్యాచ్ గెలిచాడు.. మనస్సులను గెలిచింది మాత్రం వైభవ్ సూర్యవంశే..!
- Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
- Tamil Nadu: మార్పు మొదలైంది.. అర్చకుల అవినీతిపై మంత్రి స్టింగ్ ఆపరేషన్.! రూ.4 వేలు లంచం ఇచ్చి..
రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించారని పేర్ని నాని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. 32,00 బస్తాల రేషన్ బియ్యం తగ్గినట్టు అధికారులకు పేర్ని నాని లేఖ రాశారు. అధికారుల పరిశీలనలో 3,708 బస్తాలు తగ్గినట్టు తేలింది. రేషన్ బియ్యం తగ్గడంపై 2 దఫాలుగా రూ.1.70 కోట్లు పేర్ని నాని చెల్లించారు. ఈ నెల 13 రూ.కోటి, నిన్న రూ.70 లక్షల డీడీలు అందించారు. రేషన్ బియ్యం తగ్గుదలపై మరోసారి అధికారులు గోదాములలో విచారణ చేయనున్నారు. గోదాములు పేర్ని నాని భార్య జయసుధ పేరుతో ఉండటంతో పోలీసులు కేసు ఆమెపై కూడా కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
IPL 2026 Final: ఫైనల్ కు వర్షం గండం.. మరి రిజర్వ్ డే సంగతేంటి.?
-
Shubman Gill Vs Vaibhav Suryavanshi: గిల్ మ్యాచ్ గెలిచాడు.. మనస్సులను గెలిచింది మాత్రం వైభవ్ సూర్యవంశే..!
-
Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
-
Tamil Nadu: మార్పు మొదలైంది.. అర్చకుల అవినీతిపై మంత్రి స్టింగ్ ఆపరేషన్.! రూ.4 వేలు లంచం ఇచ్చి..
-
Kumar Sangakkara: కెప్టెన్ పరాగ్ మాటలను బహిరంగంగా ఖండించిన కోచ్ సంగక్కర.. అసలు రాజస్థాన్లో ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..