Konakalla Narayana Rao: డబ్బులు కట్టినా.. పేర్ని నాని కేసు తప్పించుకోలేరు!
- రేషన్ బియ్యం పక్కదారి
- పేర్ని నానిపై ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ ఫైర్
- పేర్ని నాని కుటుంబను దాచారనే ప్రచారం సరికాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని దోంగతనం చేసి డబ్బులు కట్టినంత మాత్రాన కేసు ఉండకుండా ఉండదని టీడీపీ నేత, ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు అన్నారు. బియ్యం దొంగతనం జరిగిందని పేర్ని నాని ఒప్పుకున్నారని, మాయమైన బియ్యానికి ఆయన సమాధానం చెప్పాలన్నారు. పేర్ని నాని కుటుంబ సభ్యులను కూటమి నేతలు దాచారనే ప్రచారం సరికాదని, పేర్ని నానిని దాయాల్సిన అవసరం తమకు లేదని నారాయణరావు పేర్కొన్నారు.
‘పేర్ని నాని దోంగతనం చేసి డబ్బులు కట్టినంత మాత్రాన కేసు ఉండకుండా ఉండదు. మాయమైన బియ్యానికి ఆయన సమాధానం చెప్పాలి. డబ్బులు కట్టినా కేసు నుంచి తప్పించుకోలేరు.బియ్యం వేరే వారికి అమ్మారు కాబట్టి కేసు పెడతారు, చర్యలు తీసుకుంటారు. బియ్యం దొంగతనం జరిగిందని పేర్ని నాని ఒప్పుకున్నారు. డబ్బులు కట్టినంత మాత్రాన క్షమిస్తారని అనుకోవద్దు. పేర్ని నాని కుటుంబ సభ్యులను కూటమి నేతలు దాచారనే ప్రచారం సరికాదు. పేర్ని నానిని దాయాల్సిన అవసరం మాకు లేదు.పేర్ని నాని ఎప్పుడు దొరుకుతాడా? అని ఎదురుచూస్తున్నాం. జోగి రమేష్ తో కలిసి కార్యక్రమంలో పాల్గొనటంపై చంద్రబాబును కలిసి వివరిస్తాను. దీనిపై నన్ను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఎటువంటి వివరణ అడగలేదు. చంద్రబాబు హైదరాబాద్ నుంచి రాగానే కలుస్తాను. అనుకోకుండా కలిశామా, ఉద్దేశపూర్వకంగా కలిశామా అనేది అందరికీ తెలుస్తుంది’ అని ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు చెప్పారు.
Also Read
- Rajinikanth-Kamal Haasan: రజనీ-కమల్ మెగా మల్టీస్టారర్లో త్రిష..
- 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
- Tim David: ఎందుకు బ్రో అంత కోపం.. RCB విజయంతో టిమ్ డేవిడ్ ఆ వేళ్లు చూపిస్తూ.!
- PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించారని పేర్ని నాని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. 32,00 బస్తాల రేషన్ బియ్యం తగ్గినట్టు అధికారులకు పేర్ని నాని లేఖ రాశారు. అధికారుల పరిశీలనలో 3,708 బస్తాలు తగ్గినట్టు తేలింది. రేషన్ బియ్యం తగ్గడంపై 2 దఫాలుగా రూ.1.70 కోట్లు పేర్ని నాని చెల్లించారు. ఈ నెల 13 రూ.కోటి, నిన్న రూ.70 లక్షల డీడీలు అందించారు. రేషన్ బియ్యం తగ్గుదలపై మరోసారి అధికారులు గోదాములలో విచారణ చేయనున్నారు. గోదాములు పేర్ని నాని భార్య జయసుధ పేరుతో ఉండటంతో పోలీసులు కేసు ఆమెపై కూడా కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Rajinikanth-Kamal Haasan: రజనీ-కమల్ మెగా మల్టీస్టారర్లో త్రిష..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
Drishyam3 : దృశ్యం -3 తెలుగు రీమేక్ నుండి తప్పుకున్న వెంకీ.. డబ్బింగ్ వర్షన్ రిలీజ్ కు రెడీ
-
Tim David: ఎందుకు బ్రో అంత కోపం.. RCB విజయంతో టిమ్ డేవిడ్ ఆ వేళ్లు చూపిస్తూ.!
-
Trisha: త్రిషను ‘పరాన్నజీవి’తో పోల్చుతూ..సింగర్ సుచిత్ర సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?
-
Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!
-
Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత