Gidugu Rudra Raju: ఏపీలో మాకు ప్రధాన ప్రత్యర్ధి సీఎం జగన్: రుద్రరాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gidugu Rudra Raju Slams AP CM YS Jagan: ఏపీలో తమకు ప్రధాన ప్రత్యర్ధి సీఎం జగనే అని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. ఏపీలో వైఎస్ జగన్, కేంద్రంలో బీజేపీతో రాజీలేని పోరాటం కాంగ్రెస్ చేస్తుందన్నారు. బీజేపీతో అంటకాగేవే వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు అని.. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని విమర్శించారు. తెలంగాణలో టీడీపీ మాయమైపోయిన పార్టీ అని, జెండాలు కనిపించినంత మాత్రాన కాంగ్రెస్ గెలుపుకు టీడీపీ కారణం కాదని గిడుగు రుద్రరాజు తెలిపారు. ఈ రోజు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీపై మండిపడ్డారు.
‘ఏపీలో మాకు ప్రధాన ప్రత్యర్ధి సీఎం జగన్. ఏపీలో జగన్, కేంద్రంలో బిబీజేపీతో రాజీలేని పోరాటం కాంగ్రెస్ చేస్తుంది. బీజేపీతో అంటకాగేవే వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. తెలంగాణలో టీడీపీ మాయమైపోయిన పార్టీ. జెండాలు కనిపించినంత మాత్రాన కాంగ్రెస్ గెలుపుకు టీడీపీ కారణం కాదు. అధికారుల ట్రాన్సఫర్ లు జరుగుతాయి. ఇప్పుడు పొలిటికల్ ట్రాన్సఫర్ లు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు అంతా చెడ్డవారా. వైసీపీలో ఉన్న పాత మిత్రులను స్వాగతిస్తున్నా. నిర్బంధ పరిస్థితులలో ఉండే పదవులు అవసరమా? తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని గిడుగు రుద్రరాజు అన్నారు.
Also Read
- Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
- Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
- BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
- Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
Also Read: Shaik Sabjee Dies: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి!
‘డిసెంబర్ 28న కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం. ప్రతీ కార్యకర్త తమ వాహనాలు, ఇళ్ళ మీద కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి. కాంగ్రెస్ పార్టీ సెషన్ ను కాకినాడలో వందేళ్ళ క్రితం నిర్వహించారు. మరలా ఇప్పుడు కాకినాడలో ఒక సమావేశం నిర్వహించాలని నిర్ణయించాం. జనవరి 5 నుంచి 9 వరకూ మండల పార్టీ అధ్యక్షులకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉంది. జనవరి 20 నుంచి ఇంటింటా కాంగ్రెస్ అనే ప్రోగ్రామ్ అన్ని నియోజకవర్గాలలో నిర్వహిస్తాం. ఎస్సీ, ఎస్టీ, ప్రజా సంఘాలతో ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ఉంటుంది. స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ అంశంపై విశాఖకు రాహుల్, అమరావతి అంశంపై అమరావతికి ప్రియాంక గాంధీ, రాయలసీమ అంశలపై ఖర్గే వస్తారు. ఇండియా అలయెన్స్ పార్టీల కార్యక్రమాలకు మద్దతు పలుకుతున్నాం’ అని రుద్రరాజు చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!