Ramprasad Reddy: ఇకపై ఆటోమేటిక్ ఆమోదం.. 24 గంటల్లోనే రిజిస్ట్రేషన్.. ఆ వాహనాలకు మినహాయింపు!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం
- 24 గంటల్లోనే కొత్త వాహనాల రిజిస్ట్రేషన్
- పెండింగ్ రిజిస్ట్రేషన్లను క్లియర్ చేసేందుకు ప్రత్యేక చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాహనదారులకు మరింత వేగవంతమైన, పారదర్శక సేవలు అందించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను 24 గంటల్లో పూర్తి చేసే కొత్త విధానాన్ని త్వరలోనే అమలు చేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ఈ కొత్త విధానం ద్వారా వాహనదారులు ఇకపై రిజిస్ట్రేషన్ కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేశారు.
మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్త వాహనం కొనుగోలు చేసిన తర్వాత డీలర్ తాత్కాలిక రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన 24 గంటల్లోనే అధికారుల ఆమోదం లభించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యంగా శాశ్వత రిజిస్ట్రేషన్, వాహన నంబర్ జనరేషన్ వంటి ప్రక్రియలు కూడా ఒకే రోజులో పూర్తవుతాయని పేర్కొన్నారు. అయితే ఫ్యాన్సీ నంబర్ తీసుకునే వాహనాలకు మాత్రమే ఈ గడువు వర్తించదని చెప్పారు. కొత్త విధానంలో మరో కీలక అంశం ఆటోమేటిక్ ఆమోదం. నిర్ణయించిన గడువులోపు అధికారులు స్పందించకపోతే.. వ్యవస్థ స్వయంచాలకంగా రిజిస్ట్రేషన్ను ఆమోదించేలా టెక్నాలజీ ఆధారిత విధానాన్ని తీసుకొస్తున్నామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. దీంతో పెండింగ్లో ఉన్న దరఖాస్తులు తగ్గడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు లేకుండా సేవలు అందే అవకాశం ఉంటుందని తెలిపారు.
Also Read
- Rajasthan: అమానుషం.. రూ.500 నోటు పోయిందని బాలికల బట్టలు విప్పి తనిఖీ చేసిన టీచర్
- India vs England 2nd ODI: కేఎల్ రాహుల్ ఔట్.. ఇషాన్ కిషన్ ఇన్.. అసలు కారణం చెప్పిన కెప్టెన్ గిల్
- EV Market: ఎలక్ట్రిక్ వాహనాల జోరు..12 రెట్లు పెరిగిన EV మార్కెట్..
- Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
సెలవు రోజుల్లో కూడా ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్లకు ఆమోదం లభించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్ వాహన రిజిస్ట్రేషన్లను క్లియర్ చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రజలకు సులభమైన, పారదర్శక సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. త్వరలో ఈ కొత్త విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నిర్ణయంతో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భారీ మార్పులు రానున్నాయని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Rajasthan: అమానుషం.. రూ.500 నోటు పోయిందని బాలికల బట్టలు విప్పి తనిఖీ చేసిన టీచర్
-
Aishwarya Rajesh: సైకో క్యారెక్టర్లు చేయాలని ఉంది
-
Ganja Seizure : హైదరాబాద్ శివారులో రూ. 1.50 కోట్ల గంజాయి పట్టివేత
-
Harish Rao : ‘కరెంట్ ఉంటేనే వార్త’.. హరీష్ ఫైర్.!
-
Aishwarya Rajesh : భయపడి 50 సినిమాలు చేశ .. ఐశ్వర్య రాజేష్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!