NTV Telugu Site icon

AP-TET 2024: ఆగస్టు 3న ముగియనున్న ఏపీ టెట్ దరఖాస్తు గడువు

Ap Tet

Ap Tet

AP-TET 2024: ఏపీలోని విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు జులై 2న నోటిఫికేషన్‌ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు ఆగస్టు మూడో తేదీన దరఖాస్తు ముగియనుందని ఏపీ పాఠశాల విద్యా డైరెక్టర్‌ విజయరామరాజు ఓ ప్రకటనలో తెలియజేశారు. దరఖాస్తు చేసుకోవడానికి ముగింపు తేదీని పొడిగించడం జరగదని, అర్హత కలిగిన అభ్యర్థులు గడువు తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంతవరకు టెట్ పరీక్షకు 3,20,333 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు . ఆన్లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలు అక్టోబర్ నెల 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయని పాఠశాల విద్యా డైరెక్టర్ విజయరామరాజు ప్రకటనలో తెలియజేశారు.

Read Also: AP Ministers: వరద తగ్గేవరకు పునరావాస కేంద్రాలు.. ప్రతీ కుటుంబానికి రూ.3 వేలు..