Sports Competitions: నేటి నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్రీడా పోటీలు.. చివరి రోజు సీఎం ఆడే అవకాశం!
- నేటి నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్రీడా పోటీలు
- గురువారం క్రీడా పోటీల ముగింపు ఉత్సవం
- శాప్ ఆధ్వర్యంలో పోటీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నేటి నుంచి మూడు రోజుల పాటు లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ మీట్ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు స్పీకర్, కౌన్సిల్ డిప్యుటీ చైర్మన్ క్రీడా పోటీలను ప్రారంభిస్తారు. మంగళవారం నుంచి గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వరకు పోటీలు నిర్వహిస్తారు. గురువారం ముగింపు ఉత్సవం ఉంటుంది. శాప్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతాయి. ఈ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. ఈరోజు ఉదయం క్రీడా పోటీలకు సన్నాహక ఏర్పాట్లను మంత్రి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు 13 రకాల ఆటల పోటీల్లో పాల్గొననున్నారు. అథ్లెటిక్స్, క్రికెట్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, టెన్నికాయిట్, వాలీబాల్, త్రోబాల్, కబడ్డీ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతాయి. షటిల్ బ్యాడ్మింటన్ను డీఆర్ఆర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తారు. ఈ క్రీడల కోసం రిఫరీలు, అంపైర్లు, సహాయకులు.. మొత్తంగా 200 మంది సిబ్బందిని నియమించారు. అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేలుగా ఉండగా.. క్రీడా పోటీల్లో పాల్గొనడానికి 140 మంది తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అలానే శాసనమండలిలో 58 మంది ఎమ్మెల్సీలు ఉండగా..13 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అసెంబ్లీ, మండలి సమావేశాలు ముగిశాక స్టేడియంలో పోటీలు ప్రారంభమవుతాయి. చివరి రోజు సీఎం చంద్రబాబు ఆడే అవకాశం ఉంది.
Also Read
- ICC T20 Ranking: 1,605 రోజుల సామ్రాజ్యం కుప్పకూలింది.. నంబర్ 1 ర్యాంక్ను కోల్పోయిన భారత్!
- Visakhapatnam Earthquake: విశాఖలో భూప్రకంపనలు.. ప్రాణభయంతో బయటకు పరుగులు తీసిన జనం!
- Hyderabad: ఫిలింనగర్లో ఫెరారీ స్పోర్ట్స్ కారు బీభత్సం..
- Shreyas Iyer: "అందుకే జట్టు నుంచి వైభవ్ సూర్యవంశీని తీసేశాం".. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
శాప్ చైర్మన్ రవి నాయుడుతో కలిసి క్రీడా పోటీల ఏర్పాట్లను మంత్రి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఎన్టీవీతో మాట్లాడుతూ… ’70 శాతం మంది శాసన సభ్యులు రిజిష్ట్రేషన్ చేసుకున్నారు. గత ఐదేళ్లలో ఆడుదాం ఆంధ్ర అంటూ ఏం చేసారో చూశాం. సీఐడీ ఎంక్వైరీ నివేదిక వచ్చాక ఆడుదాం ఆంధ్రపై మాట్లాడుతా. మధ్యాహ్నం 3 గంటల నుంచి మొదలయ్యే పోటీలను ప్రారంభించడానికి స్పీకర్, మండలి డిప్యుటీ చైర్మన్ వస్తారు. క్రీడలకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక స్ధానం కల్పించింది. 3 శాతం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలకు అవకాశం ఇవ్వడమే కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం. ఇవాళ సీఎం ఢిల్లీకి వెళుతుండటంతో.. రేపు లేదా ఎల్లుండు పోటీలలో పాల్గొనే అవకాశం ఉంది. సీఎం చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరగనుంది’ అని చెప్పారు.
తాజావార్తలు
-
Samsung Galaxy Tab S12+: సామ్ సంగ్ గెలాక్సీ ట్యాబ్ S12+ ఫస్ట్ లుక్.. ఫ్రంట్ డిజైన్ వెల్లడి, త్వరలో లాంచ్?
-
ICC T20 Ranking: 1,605 రోజుల సామ్రాజ్యం కుప్పకూలింది.. నంబర్ 1 ర్యాంక్ను కోల్పోయిన భారత్!
-
Nita Ambani: దేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళగా నీతా అంబానీ.. ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో తొలి స్థానం
-
The Odyssey: కటింగ్ చాయ్ కోసం ముంబై వీధుల్లో హాలీవుడ్ స్టార్లు.. వైరల్గా మారిన వీడియో
-
Nandamuri Mokshagna : బాలయ్య వారసుడి కోసం సందీప్ రెడ్డి వంగా?
ట్రెండింగ్
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!