AP Legislative Council: న్యాయవాదుల సంక్షేమ నిధి సవరణ బిల్లుకు మండలి ఆమోదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Legislative Council: న్యాయవాదుల సంక్షేమ నిధి సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్ శాసన మండలి.. న్యాయవాదుల గుమస్తాల సంక్షేమ నిధి చట్టం సవరణ బిల్లుకు ఆమోదముద్ర వేసింది.. ఇక, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానం సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ఇచ్చిన మేనిఫెస్టోని 99 శాతం అమలు చేసిన దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ జగన్ విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నారు.. గవర్నర్ ప్రసంగం అక్షరసత్యం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యారంగంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చారు.. విద్య తోనే పేదరికం నిర్మూలన జరుగుతుంది.. వైఎస్ జగన్ ప్రభుత్వం దేశానికి ఆదర్శం.. సామాజిక న్యాయాన్ని అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగనే అన్నారు. తెలుగుదేశం సభ్యులకు అభివృద్ధి ఎక్కడుందో కుప్పం వస్తే చూపిస్తాం.. అని సవాల్ చేశారు. ఇక, సీఎం వైఎస్ జగన్ త్వరలోనే వెలుగొండ ప్రాజెక్ట్ ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు అని తెలిపారు మంత్రి ఆదిమూలపు సురేష్.
మరోవైపు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అణగారిన వర్గాలను, బలహీన వర్గాలను పాలనలో భాగస్వామ్యం చేశారని పేర్కొన్నారు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్.. 30 లక్షల మందికి పైగా నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఏకైక ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.. ఇల్లు ఉంటేనే ఆత్మస్థైర్యం కలుగుతుంది.. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంటిపైన తెలుగుదేశం జెండా.. ఒంటి పైన పసుపు చొక్కా ఉంటేనే పెన్షన్ ఇచ్చే వాళ్లని.. కానీ, మా ప్రభుత్వంలో అన్ని పార్టీ కార్యకర్తలకు అర్హులైన వారందరికీ పింఛన్ ఇస్తున్నాం అని స్పష్టం చేశారు మర్రి రాజశేఖర్.
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
మా ప్రభుత్వం డిబిటి నాన్ డిబిటీ ద్వారా 4 లక్షల 20 కోట్లకు పైగా సంక్షేమాన్ని ప్రజలకు అందించాం అని తెలిపారు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి.. ఉద్దానంలో 85 కోట్లతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ని ఏర్పాటు చేశాం.. వందల కోట్లు పెట్టి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటి అందిస్తున్నాం.. విద్యావ్యవస్థలో సమూలమైన మార్పు తెచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. దేశంలోనే ఎక్కడా లేని విధంగా వైద్య రంగాన్ని అభివృద్ధి చేశారని తెలిపారు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి..
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!