Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Ap Land Registration Price Hike Decision Delayed

AP Registration Charges : ఏపీలో రిజిస్ట్రేషన్‌ ఛార్జీల పెంపుపై కొనసాగుతున్న సస్పెన్స్‌

Published Date :December 27, 2024 , 1:57 pm
By Gogikar Sai Krishna
  • ఇప్పటికే పెంచిన ఛార్జీల ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుంచిన అధికారులు
  • ప్రతి ఏడాది ఆగస్ట్‌ 1న ఛార్జీల పెంపు నిర్ణయం అమలు
  • ఈ ఏడాది జనవరి 1 నుంచి పెంపు నిర్ణయం వాయిదాకు ప్రభుత్వానికి వినతులు
  • వచ్చే సోమవారం రిజిస్ట్రేషన్‌ ఛార్జీల పెంపుపై క్లారీటీ వచ్చే అవకాశం
AP Registration Charges : ఏపీలో రిజిస్ట్రేషన్‌ ఛార్జీల పెంపుపై కొనసాగుతున్న సస్పెన్స్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

AP Registration Charges : ఏపీలో రిజిస్ట్రేషన్‌ ఛార్జీల పెంపుపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 1 నుంచి భూముల మార్కెట్‌ ధరలను పెంచే నిర్ణయంపై వెనకడుగు వేసింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తమవడంతో, ఈ నిర్ణయంపై పునరాలోచన చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 2025 జనవరి 1 నుండి భూముల మార్కెట్‌ ధరలను పెంచే యోచన తాత్కాలికంగా వాయిదా వేసింది. ఈ నిర్ణయంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి, అవసరమైన మార్పులు తీసుకోవాలని నిర్ణయించారు. ప్రజల్లో నెలకొన్న ఆందోళనను ప్రభుత్వం దృష్టిలోకి తీసుకువెళ్లింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ విలువలను సవరించడం ద్వారా ప్రభుత్వ ఆదాయం పెంచుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2025 జనవరి 1 నుండి కొత్త రిజిస్ట్రేషన్ విలువలను అమలులోకి తీసుకురావాలని భావించారు. ఈ మేరకు అన్ని జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు కొత్త ధరలను ప్రతిపాదించి, ప్రజాభిప్రాయం సేకరించాలని రెవెన్యూ శాఖ ఆదేశించింది.

భూములకు ఉన్న డిమాండ్‌ను, ప్రస్తుతం ఉన్న ధరలను పరిశీలించి కొత్త ధరలపై ముసాయిదాలు తయారు చేయాలని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయంపై ప్రజల నుంచి, ప్రభుత్వ వర్గాల నుంచి వచ్చిన సూచనలతో మార్కెట్ ధరల పెంపు నిర్ణయం పునరాలోచనకు గురైంది. ప్రజా ప్రతినిధుల నుంచి కూడా వ్యతిరేకత వచ్చిందని సమాచారం.

గత ఐదేళ్లలో భూముల మార్కెట్‌ రిజిస్ట్రేషన్‌ ధరలను పెంచడం వల్ల ప్రజలపై తీవ్ర భారం పడింది. పట్టణాల్లో రిజిస్ట్రేషన్ ధరలు మార్కెట్ ధరలకు సమానంగా చేరాయి. ఈ సమయంలో టీడీపీ ధరల పెంపుదలపై వ్యతిరేకంగా నిలిచింది. రియల్ ఎస్టేట్ క్షీణించినా, ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునే కోసం 14,000 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించే ప్రయత్నం చేసింది.

Pawan Kalyan : పవర్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. తన గాత్రంతో కొత్త ఏడాదికి వెల్ కమ్ చెప్పనున్న పవన్

ప్రభుత్వ నిర్ణయంతో ప్రజల్లో కలకలం నెలకొంది. భూములు, అపార్ట్‌మెంట్ల అమ్మకం భారీగా పడిపోయింది. 2025 జనవరి 1 నుండి భూముల మార్కెట్‌ ధరల పెంపు అమలు చేసే నిర్ణయంతో ప్రజలు ఆందోళనకు దిగారు. అందుకే, ఈ అంశంపై సమగ్రంగా చర్చించి, జనవరి 1 నుండి భూముల ధరల పెంపు అమలును వాయిదా వేసినట్టు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ప్రకటించారు.

ఏపీ రియల్ ఎస్టేట్ ఇప్పటికే కుదేలై ఉంది. 2022లో రిజిస్ట్రేషన్‌ విలువలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్‌ ధరలకు సమానంగా ఉండే రిజిస్ట్రేషన్‌ ధరలు లావాదేవీలను తగ్గించాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆదాయం పెంచుకునేందుకు పాత ప్రభుత్వ బాటలోనే కొనసాగుతోంది.

రాష్ట్రంలోని అన్ని జిల్లా శాఖల నుంచి రిజిస్ట్రేషన్‌ విలువల సవరణకు ప్రతిపాదనలు సేకరించారు. ఈ నిర్ణయంతో ఈ ఏడాది డిసెంబర్‌లో రిజిస్ట్రేషన్లు పెరిగే అవకాశం ఉంది. 2025 నుండి పట్టణాలు, గ్రామాల్లో ఒకేసారి కొత్త విలువలు అమలులోకి రానున్నాయి. 10% నుంచి 15% వరకు రిజిస్ట్రేషన్ విలువలు పెరిగే అవకాశం ఉంది. అయిదే.. దీనిపై సోమవారం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Realme 14 Pro Launch: భారత్‌కు రంగు మారే స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది.. ప్రపంచంలోనే మొదటి మొబైల్!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 2025
  • Andhra Pradesh
  • AP Government
  • Government Decision
  • Land Prices

తాజావార్తలు

  • Telangana Assembly : ఈ నెల 30 వరకు అసెంబ్లీ సమావేశాలు.. ఈనెల 20న బడ్జెట్..

  • Stock Market: పండిన ఇన్వెస్టర్ల పంట.. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

  • Sunil Gavaskar: పాక్‌ క్రికెటర్‌ కొనుగోలుపై విమర్శలు.. కావ్య మారన్‌ను నిలదీసిన గవాస్కర్..

  • NavIC: ఇబ్బందుల్లో స్వదేశీ GPS వ్యవస్థ ‘‘నావిక్’’.. 11 శాటిలైట్లలో 3 వర్కింగ్..

  • Telangana: కీలక నిర్ణయం దిశగా తెలంగాణ ప్రభుత్వం.. పదో తరగతి మార్కుల ఆధారంగా ఒకొక్కరికీ రూ.2500..

ట్రెండింగ్‌

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • Ulavala Rasam Recipe : నోరూరించే ఉలవల రసం.. సింపుల్ టిప్స్ తో ఇలా చేసుకోండి..

  • Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions