AP High Court: ఇదేం పద్ధతి, ఇదేం భాష?.. గుంటూరు మేయర్కు హైకోర్టు చురకలు
- గుంటూరు నగర మేయర్ మనోహర్ నాయుడికి ఏపీ హైకోర్టు చురకలు
- నగర మొదట పౌరుడిగా బాధ్యతగా మెలగమని చెప్పాలని మేయర్ తరఫు న్యాయవాదికి ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: అరండల్పేట పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని గుంటూరు నగర మేయర్ మనోహర్ నాయుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గుంటూరు నగర మేయర్ మనోహర్ నాయుడికి ఏపీ హైకోర్టు చురకలు అంటించింది. “ఇదేం పద్ధతి,ఇదేం భాష…?. అసభ్య పదజాలంతో కుటుంబ సభ్యులు, తల్లులపై దాడి చేస్తారా?. నగర మొదటి పౌరుడు మాట్లాడేది ఇలాగేనా. సేవచేసి ప్రజలకు దగ్గరవ్వాలే తప్ప అసభ్యకర భాషతో కాదు. మురికి భాషను ఉపయోగించి ఎన్నికలను గెలవాలని అనుకోకూడదు. అసభ్యకర భాష వాడినవారు ఏ పార్టీ వారైనా శిక్షించాల్సిందే. రాజకీయపార్టీలు అవతలివారి విధానాలు, పాలసీలను విమర్శించాలి…ప్రజాస్వామ్యంలో మేయర్ వాడిన పదజాలాన్ని అంగీకరించలేం. నగరమేయర్ ఇతర పౌరులకు ఆదర్శంగా ఉండాలి ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.” అని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Read Also: Fraud: సైబరాబాద్లో బిగ్ స్కాం.. రూ.300 కోట్లతో బోర్డు తిప్పేసిన సంస్థ
Also Read
- Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
- Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
- Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
- Foods for Naturally Glowing Skin: మెరిసే చర్మం కావాలా? ఈ ఫుడ్ తీసుకుంటే సహజ కాంతి మీ సొంతం..!
నగర మొదట పౌరుడిగా నిందితుడిని బాధ్యతగా మెలగమని చెప్పాలని మనోహర్ నాయుడు తరపు న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు అన్నీ ఏడేళ్లలోపు శిక్షకు వీలున్నవేనని.. పిటిషనర్కు సీఆర్పీసీ సెక్షన్ 41(ఏ) కింద నోటీసులు ఇవ్వాలని న్యాయస్థానం తెలిపింది. కేసుపై పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 6వారాలకు వాయిదా వేసింది.
టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్క వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన చేపడుతున్న తమను మేయర్, ఆయన అనుచరులు దూషించి పోలీసు లాఠీతో దాడి చేశారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు గుంటూరు అరండల్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ను అసభ్య పదజాలంతో దూషించారని ఫిర్యాదులో పేర్కొ్న్నారు. ఫిర్యాదు ఆధారంగా మేయర్, ఆయన అనుచరులపై పోలీసులు ఈ నెల 16న కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేసిన క్రమంలో మేయర్ కావటి మనోహర్ నాయుడు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
తాజావార్తలు
-
Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
-
Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్లోకి స్వాగతం
-
Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
-
DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
-
Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!