AP High Court: ఇదేం పద్ధతి, ఇదేం భాష?.. గుంటూరు మేయర్కు హైకోర్టు చురకలు
- గుంటూరు నగర మేయర్ మనోహర్ నాయుడికి ఏపీ హైకోర్టు చురకలు
- నగర మొదట పౌరుడిగా బాధ్యతగా మెలగమని చెప్పాలని మేయర్ తరఫు న్యాయవాదికి ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: అరండల్పేట పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని గుంటూరు నగర మేయర్ మనోహర్ నాయుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గుంటూరు నగర మేయర్ మనోహర్ నాయుడికి ఏపీ హైకోర్టు చురకలు అంటించింది. “ఇదేం పద్ధతి,ఇదేం భాష…?. అసభ్య పదజాలంతో కుటుంబ సభ్యులు, తల్లులపై దాడి చేస్తారా?. నగర మొదటి పౌరుడు మాట్లాడేది ఇలాగేనా. సేవచేసి ప్రజలకు దగ్గరవ్వాలే తప్ప అసభ్యకర భాషతో కాదు. మురికి భాషను ఉపయోగించి ఎన్నికలను గెలవాలని అనుకోకూడదు. అసభ్యకర భాష వాడినవారు ఏ పార్టీ వారైనా శిక్షించాల్సిందే. రాజకీయపార్టీలు అవతలివారి విధానాలు, పాలసీలను విమర్శించాలి…ప్రజాస్వామ్యంలో మేయర్ వాడిన పదజాలాన్ని అంగీకరించలేం. నగరమేయర్ ఇతర పౌరులకు ఆదర్శంగా ఉండాలి ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.” అని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Read Also: Fraud: సైబరాబాద్లో బిగ్ స్కాం.. రూ.300 కోట్లతో బోర్డు తిప్పేసిన సంస్థ
Also Read
- LayOffs: మరో దిగ్గజ కంపెనీలో భారీగా లే ఆఫ్స్.. 4000 మంది ఉద్యోగుల తొలగింపు..
- UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అద్భుత అవకాశం.. సీనియర్ జట్టులోకి ఒక్క అడుగు దూరంలో..
- Modi-Putin: మోడీ, రాష్ట్రపతికి పుతిన్ సందేశం.. యూపీ తుఫాన్ మృతులకు సంతాపం
నగర మొదట పౌరుడిగా నిందితుడిని బాధ్యతగా మెలగమని చెప్పాలని మనోహర్ నాయుడు తరపు న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు అన్నీ ఏడేళ్లలోపు శిక్షకు వీలున్నవేనని.. పిటిషనర్కు సీఆర్పీసీ సెక్షన్ 41(ఏ) కింద నోటీసులు ఇవ్వాలని న్యాయస్థానం తెలిపింది. కేసుపై పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 6వారాలకు వాయిదా వేసింది.
టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్క వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన చేపడుతున్న తమను మేయర్, ఆయన అనుచరులు దూషించి పోలీసు లాఠీతో దాడి చేశారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు గుంటూరు అరండల్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ను అసభ్య పదజాలంతో దూషించారని ఫిర్యాదులో పేర్కొ్న్నారు. ఫిర్యాదు ఆధారంగా మేయర్, ఆయన అనుచరులపై పోలీసులు ఈ నెల 16న కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేసిన క్రమంలో మేయర్ కావటి మనోహర్ నాయుడు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
తాజావార్తలు
-
LayOffs: మరో దిగ్గజ కంపెనీలో భారీగా లే ఆఫ్స్.. 4000 మంది ఉద్యోగుల తొలగింపు..
-
UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
-
Elon Musk: చైనాలో మస్క్ మేనియా.. ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న షియోమీ బాస్తో సెల్ఫీ
-
Health Tips : రాత్రి పిండి.. ఉదయం రొట్టె..? ఈ నిజం తెలిస్తే షాక్ అవుతారు!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అద్భుత అవకాశం.. సీనియర్ జట్టులోకి ఒక్క అడుగు దూరంలో..
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?