TB BCG Vaccines in AP: రాష్ట్రంలో టీబీ నిర్మూలనకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి..
- పెద్దలకు టీబీ బీసీజీ టీకాల లక్ష్యాన్ని చేరుకోవాలి
- రాష్ట్రంలో టీబీ నిర్మూలనకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి
- ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సి.హరికిరణ్ ఆదేశం
TB BCG Vaccines in AP: పెద్దలకు టీబీ బీసీజి టీకాలు వేయడంలో నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు. ఈ టీకాలు వేసినప్పుడు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ గుర్తింపు సంఖ్యను కూడా ఏఎన్ఎంలు క్రియేట్ చేయాలన్నారు. మంగళగిరి ఏపీఐఐసీ టవర్స్లోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో బుధవారం జాతీయ టీబీ నిర్మూలనా కార్యక్రమంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 17.78 లక్షల మందికి టీబీ బీసీజీ టీకాలు వేశారని, 50 లక్షల మందికి టీకాలు వేయాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు మరింతగా కృషి చేయాలని సూచించారు. టీబీ పేషెంట్లకు అదనపు పోషాకాహారాన్ని పంపిణీ చేసేందుకు గాను పలు పారిశ్రామిక వేత్తల్ని సంప్రదించాలని, జిల్లాల్లో ఆయా జిల్లా పరిశ్రమల అధికారుల సహాయాన్ని తీసుకోవడం ద్వారా మరింత విస్తృతంగా దీన్ని అమలు చేయాలన్నారు. సబ్ సెంటర్లలో కూడా టీబీ శాంపిళ్లను సేకరించాలన్నారు.
Read Also: AP CM Chandrababu: మైనింగ్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష.. ఇసుక లభ్యత, ధరలపై కీలక చర్చ
Also Read
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
- Renault Bridger: పెట్రోల్ నుంచి CNG, EV వరకు.. భారీ ప్లాన్తో వస్తున్న రెనాల్ట్ బ్రిడ్జర్
- Hero Splendor: సేల్స్ లో గర్జిస్తున్న స్ల్పెండర్ ప్లస్.. FY26 బెస్ట్ సెల్లింగ్ బైక్స్ టాప్ 5 లిస్ట్ ఇదే
- Terror Attack: మాలిలో భారీ ఉగ్రవాద దాడి.. రక్షణ మంత్రి హతం..
టీబీ పరీక్షలు నిర్వహించేందుకు ఇప్పటికే ఉన్న ల్యాబ్లతో పాటు ఇంకా అవసరమైన ల్యాబ్ల విషయమై ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. రాష్ట్రంలో టీబీ నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాథమిక దశలోనే టీబీని గుర్తించడం ద్వారా మరింత సమర్ధవంతంగా నిర్మూలించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. టీబీ రోగులకు సరిపడా మందుల్ని అందుబాటులో ఉంచాలన్నారు. ఎక్కడా మందుల కొరత రాకూడదన్నారు. దేశ వ్యాప్తంగా 35 నుండి 40 శాతం వరకు టీబీ బారిన పడుతున్నారన్నారు. 2025 నాటికి టీబీ రహిత రాష్ట్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు అన్నివిధాలా కృషి చేయాలన్నారు. టీబీ విభాగంలో ఖాళీ పోస్టుల భర్తీకి ప్రతిపాదనల్ని సిద్ధం చేయాలన్నారు. గతేడాది 84 వేల టీబీ కేసుల్ని గుర్తించగా, ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 43 కేసుల్ని గుర్తించామని రాష్ట్ర టీబీ అధికారి జేడీ డాక్టర్ టి.రమేష్ వివరించారు. 94 శాతం మంది టీబీ రోగులకు విజయంతంగా చికిత్స అందించి స్వస్థత చేకూర్చామన్నారు. స్టేట్ కన్సల్టెంట్లు, ఐటీ నిపుణులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
తాజావార్తలు
-
IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
-
Realme C100x: రియల్మీ C100x భారత్లో త్వరలో లాంచ్.. 8000mAh బ్యాటరీతో బిగ్ సర్ప్రైజ్!
-
Buchi Babu: ఫ్యాన్స్ అరుపుల మధ్య అదిరిపోయే అప్డేట్… ‘పెద్ది’ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన బుచ్చిబాబు.. మెగా ఫ్యాన్స్కు పండగే!
-
Ashu Reddy Case : నటి అషు రెడ్డి కేసులో కీలక అంశాలు.. విస్తుపోయే నిజాలు.!
-
Cole Thomas Allen: సాఫ్ట్వేర్ డెవలపర్ నుంచి నాసా ఫెలో వరకు.. ట్రంప్ పార్టీలో కాల్పులకు పాల్పడిన కోల్ థామస్ అలెన్ ఎవరు?
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!