TB BCG Vaccines in AP: రాష్ట్రంలో టీబీ నిర్మూలనకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి..
- పెద్దలకు టీబీ బీసీజీ టీకాల లక్ష్యాన్ని చేరుకోవాలి
- రాష్ట్రంలో టీబీ నిర్మూలనకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి
- ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సి.హరికిరణ్ ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TB BCG Vaccines in AP: పెద్దలకు టీబీ బీసీజి టీకాలు వేయడంలో నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు. ఈ టీకాలు వేసినప్పుడు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ గుర్తింపు సంఖ్యను కూడా ఏఎన్ఎంలు క్రియేట్ చేయాలన్నారు. మంగళగిరి ఏపీఐఐసీ టవర్స్లోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో బుధవారం జాతీయ టీబీ నిర్మూలనా కార్యక్రమంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 17.78 లక్షల మందికి టీబీ బీసీజీ టీకాలు వేశారని, 50 లక్షల మందికి టీకాలు వేయాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు మరింతగా కృషి చేయాలని సూచించారు. టీబీ పేషెంట్లకు అదనపు పోషాకాహారాన్ని పంపిణీ చేసేందుకు గాను పలు పారిశ్రామిక వేత్తల్ని సంప్రదించాలని, జిల్లాల్లో ఆయా జిల్లా పరిశ్రమల అధికారుల సహాయాన్ని తీసుకోవడం ద్వారా మరింత విస్తృతంగా దీన్ని అమలు చేయాలన్నారు. సబ్ సెంటర్లలో కూడా టీబీ శాంపిళ్లను సేకరించాలన్నారు.
Read Also: AP CM Chandrababu: మైనింగ్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష.. ఇసుక లభ్యత, ధరలపై కీలక చర్చ
Also Read
- TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
- 50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
- 144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
- Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
టీబీ పరీక్షలు నిర్వహించేందుకు ఇప్పటికే ఉన్న ల్యాబ్లతో పాటు ఇంకా అవసరమైన ల్యాబ్ల విషయమై ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. రాష్ట్రంలో టీబీ నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాథమిక దశలోనే టీబీని గుర్తించడం ద్వారా మరింత సమర్ధవంతంగా నిర్మూలించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. టీబీ రోగులకు సరిపడా మందుల్ని అందుబాటులో ఉంచాలన్నారు. ఎక్కడా మందుల కొరత రాకూడదన్నారు. దేశ వ్యాప్తంగా 35 నుండి 40 శాతం వరకు టీబీ బారిన పడుతున్నారన్నారు. 2025 నాటికి టీబీ రహిత రాష్ట్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు అన్నివిధాలా కృషి చేయాలన్నారు. టీబీ విభాగంలో ఖాళీ పోస్టుల భర్తీకి ప్రతిపాదనల్ని సిద్ధం చేయాలన్నారు. గతేడాది 84 వేల టీబీ కేసుల్ని గుర్తించగా, ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 43 కేసుల్ని గుర్తించామని రాష్ట్ర టీబీ అధికారి జేడీ డాక్టర్ టి.రమేష్ వివరించారు. 94 శాతం మంది టీబీ రోగులకు విజయంతంగా చికిత్స అందించి స్వస్థత చేకూర్చామన్నారు. స్టేట్ కన్సల్టెంట్లు, ఐటీ నిపుణులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Vivo T5 Lite: వివో T5 లైట్ 44W 5G ఫోన్ రిలీజ్.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, MediaTek Dimensity 6300 ప్రాసెసర్
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
Iran Missile Attack: అమెరికా-ఇరాన్ యుద్ధం మరింత ఉధృతం.. గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు
-
FIFA WC 2026: 39 ఏళ్ల మెస్సీని ఇప్పటికీ ఎందుకు ఎవరూ ఆపలేకపోతున్నారు? కారణం ఇదే!
-
Fauzi Release Date : ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!