AP Half Day Schools:ఏపీలో ఒంటిపూట బడులు… విద్యార్ధులకు మజ్జిగ పంపిణీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ఒంటిపూట బడులకు సంబంధించి ప్రభుత్వం ప్రొసీడింగ్స్ విడుదల చేసింది. ఈ నెల మూడో తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 07:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతుల నిర్వహణ ఉంటుంది. ఏప్రిల్ 30వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహిస్తారు. స్కూల్ ముగిశాక మధ్యాహ్న భోజనం అందివ్వాలని ఉత్తర్వులు జారీచేసింది విద్యాశాఖ. ఒకటవ తరగతి నుండి IX తరగతులకు ఉదయం 7.45 నుండి 12.30 వరకు HALF DAY పాఠశాలలను ప్రకటించాలని నిర్ణయించింది.
Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీపై మరో పరువునష్టం కేసు.. ఈ సారి ఏంటంటే..?
Also Read
- Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
- TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
- CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
- US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, ప్రైవేట్ గుర్తింపు పొందిన అన్ఎయిడెడ్ పాఠశాలలతో సహా అన్ని మేనేజ్మెంట్ పాఠశాలల్లో 03-4-2023 నుండి చివరి పని దినం వరకు అంటే 30-4-2023 వరకు వుంటాయి. ప్రత్యేకంగా SSC పరీక్షా కేంద్రాలు (రాష్ట్రవ్యాప్తంగా 3349 కేంద్రాలు) ఉన్న పాఠశాలల్లో, పరీక్ష రోజుల్లో (మొత్తం ఆరు రోజులు) తరగతులు ఉండవు. ఈ పాఠశాలలు 03.04.23 నుండి 30.04.23 వరకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ సెలవు దినాలలో ఆరు రోజుల పాటు పరిహార తరగతులను నిర్వహించాలి. పరిహార తరగతులు కూడా హాఫ్ డే షెడ్యూల్ను అనుసరిస్తాయి.

ఏప్రిల్ నెలలో 2వ శనివారాన్ని పని చేసేదిగా పరిగణించాలి. అన్ని పాఠశాలల్లో తగినంత తాగునీరు అందించాలి. బహిరంగ ప్రదేశాల్లో/ చెట్ల కింద తరగతులు నిర్వహించరాదని పేర్కొంది. విద్యార్థుల ఉపయోగం కోసం ప్రతి పాఠశాలలో కొన్ని ఓరల్ రీ-హైడ్రేషన్ సొల్యూషన్ (ORS) సాచెట్లను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించింది. ఏదైనా పిల్లవాడు సన్/హీట్ స్ట్రోక్ బారిన పడినట్లయితే, వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో వాటిని ఉపయోగించాలి. మధ్యాహ్న భోజన సమయంలో స్థానికులతో సమన్వయంతో మజ్జిగ అందించాలని ప్రొసీడింగ్స్ లో పేర్కొంది.
Read Also: CM Jagan Cabinet Expansion Live Updates: జగన్ కొత్త టీం ఇదేనా?
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం