AP Governor Abdul Nazeer : 2030నాటికల్లా ఆహార భద్రత సాధించాలి : గవర్నర్ అబ్దుల్ నజీర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Governor Abdul Nazeer : భారత్ వ్యవసాయాధారిత దేశం. మన దేశంలో అత్యధిక మంది ఉపాధికోసం వ్యవసాయంపై 66శాతం మంది ఆధారపడతారని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. సోమవారం బాపట్ల జిల్లా పర్యటన సందర్భంగా జిల్లాలోని ఆయన వ్యవసాయ యూనివర్శిటీనిసందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రానున్న 2030కల్లా ఆహార భద్రత సాధించాలని ఐక్యరాజ్యసమితి సూచించిందని, ఇందులో చిరు ధాన్యాల ఉత్పత్తి పెంచటమే ప్రధానమన్నారు. వాతావరణ మార్పులు ఇబ్బంది ఉన్నా.. చిరు ధాన్యాల సాగులో మంచి దిగుబడి వస్తుందన్నారు. చిరు ధాన్యాల్లో నూతన వంగడాలు ఆవిష్కరణకు కృషి చేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. మిల్లెట్ల సాగు చేయడం వల్ల భూసారం పెరుగుతుంది. వాటిని తినడం వలన మనుషులు ఆరోగ్యకరం గా ఉంటారు.
Read Also:Kerala High Court: తోబుట్టువును గర్భవతిని చేసిన సోదరుడు.. గర్భం తొలగింపునకు కోర్టు అనుమతి
Also Read
- TVK: కర్ణాటకలో కుదిరినప్పుడు.. తమిళనాడులో ఎందుకు కుదరదు.. గవర్నర్పై ఆగ్రహంతో టీవీకే కార్యకర్తలు..
- Age Relaxation: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు పదేళ్లు వయోపరిమితి పెంపు..?
- Abhishek Sharma: రికార్డుల వేటలో అభిషేక్ శర్మ.. ఆ క్లబ్లోకి కూడా చేరిన అభిషేక్.
- Heinrich Klaasen: ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న కాటేరమ్మ పెద్ద కొడుకు.. టాప్ 5లో ముగ్గురు హైదరాబాద్ ఆటగాళ్లే..
వ్యవసాయంలో 17 రకాల నూతన వంగడాలను 2021లో ఆవిష్కరించటం శుభ పరిణామమని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. శాస్త్రవేత్తలు రైతులతో నిత్యం అనుసంధానం కావటం వల్ల మంచి ఫలితాలు వస్తాయన్నారు. డ్రోన్ శిక్షణలో డిజిసిఏ అనుమతి సాధించిన వ్యవసాయ యూనివర్సిటీకి అభినందనలు తెలిపారు. వ్యవసాయం మాత్రమే అన్ని వేలలా సంపద సృష్టికి తోడ్పటుతుందని, వ్యవసాయ విద్యలో మరిన్ని మార్పులు రావాలని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థులు జీవితంలో చేసే చిన్న చిన్న పొరపాట్లను అధిగమించి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. క్షేత్ర పర్యటనలు, సాంకేతికత వినియోగం, సరికొత్త ఆలోచనలు పెంపొందించేలా విద్య ఉండాలన్నారు. విద్యార్థులు వేరొకరి దయ మీద ఆధారపడకుండా పట్టుదలతో విజయం సాధించాలన్నారు. జీవితాంతం కొత్త విషయాలు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని.. ‘మీ కలల్ని సాధించడం మీతోనే సాధ్యం.. మీ లక్ష్యం చేరుకునేందుకు మీరు మాత్రమే కృషి చేయాల్సి ఉంటుంది’ అంటూ గవర్నర్ అబ్దుల్ నజీర్ వ్యాఖ్యానించారు. మహాత్మా గాంధీ చెప్పినట్లు సాధించాలన్న తపన ఉన్న ప్రతి ఒక్కరు తప్పకుండా విజయం సాధించి తీరుతారన్నారు.
Read Also:Karnataka Teacher : కర్ణాటక సీఎంను విమర్శించిన టీచర్ సస్పెండ్
తాజావార్తలు
-
NBK 111 : రొమాంటిక్ సింహం.. బాలయ్యతో బాలీవుడ్ హీరోయిన్ ఐటం సాంగ్
-
TVK: కర్ణాటకలో కుదిరినప్పుడు.. తమిళనాడులో ఎందుకు కుదరదు.. గవర్నర్పై ఆగ్రహంతో టీవీకే కార్యకర్తలు..
-
Vaibhav Suryavanshi: అది బుడ్డోడి రేంజ్.. వైభవ్ సూర్యవంశీ కోసం వేలం వ్యూహాన్ని మార్చుకున్న రాజస్థాన్..!
-
Age Relaxation: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు పదేళ్లు వయోపరిమితి పెంపు..?
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!