AP Governor Abdul Nazeer : 2030నాటికల్లా ఆహార భద్రత సాధించాలి : గవర్నర్ అబ్దుల్ నజీర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Governor Abdul Nazeer : భారత్ వ్యవసాయాధారిత దేశం. మన దేశంలో అత్యధిక మంది ఉపాధికోసం వ్యవసాయంపై 66శాతం మంది ఆధారపడతారని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. సోమవారం బాపట్ల జిల్లా పర్యటన సందర్భంగా జిల్లాలోని ఆయన వ్యవసాయ యూనివర్శిటీనిసందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రానున్న 2030కల్లా ఆహార భద్రత సాధించాలని ఐక్యరాజ్యసమితి సూచించిందని, ఇందులో చిరు ధాన్యాల ఉత్పత్తి పెంచటమే ప్రధానమన్నారు. వాతావరణ మార్పులు ఇబ్బంది ఉన్నా.. చిరు ధాన్యాల సాగులో మంచి దిగుబడి వస్తుందన్నారు. చిరు ధాన్యాల్లో నూతన వంగడాలు ఆవిష్కరణకు కృషి చేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. మిల్లెట్ల సాగు చేయడం వల్ల భూసారం పెరుగుతుంది. వాటిని తినడం వలన మనుషులు ఆరోగ్యకరం గా ఉంటారు.
Read Also:Kerala High Court: తోబుట్టువును గర్భవతిని చేసిన సోదరుడు.. గర్భం తొలగింపునకు కోర్టు అనుమతి
Also Read
- Egg Storage Tips in Summer: వేసవిలో గుడ్లు ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి..? తినే ముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి "మామిడికాయ రోటి పచ్చడి" చేసేయండి ఇలా.!
- Telangana Rains: తెలంగాణలో అకాల వర్షాల మోత.. హైదరాబాద్తో పాటు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ.!
- ED Raids: కేరళం రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్.. మాజీ సీఎం పినరయి విజయన్ ఇంట్లో ఈడీ సోదాలు..
వ్యవసాయంలో 17 రకాల నూతన వంగడాలను 2021లో ఆవిష్కరించటం శుభ పరిణామమని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. శాస్త్రవేత్తలు రైతులతో నిత్యం అనుసంధానం కావటం వల్ల మంచి ఫలితాలు వస్తాయన్నారు. డ్రోన్ శిక్షణలో డిజిసిఏ అనుమతి సాధించిన వ్యవసాయ యూనివర్సిటీకి అభినందనలు తెలిపారు. వ్యవసాయం మాత్రమే అన్ని వేలలా సంపద సృష్టికి తోడ్పటుతుందని, వ్యవసాయ విద్యలో మరిన్ని మార్పులు రావాలని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థులు జీవితంలో చేసే చిన్న చిన్న పొరపాట్లను అధిగమించి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. క్షేత్ర పర్యటనలు, సాంకేతికత వినియోగం, సరికొత్త ఆలోచనలు పెంపొందించేలా విద్య ఉండాలన్నారు. విద్యార్థులు వేరొకరి దయ మీద ఆధారపడకుండా పట్టుదలతో విజయం సాధించాలన్నారు. జీవితాంతం కొత్త విషయాలు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని.. ‘మీ కలల్ని సాధించడం మీతోనే సాధ్యం.. మీ లక్ష్యం చేరుకునేందుకు మీరు మాత్రమే కృషి చేయాల్సి ఉంటుంది’ అంటూ గవర్నర్ అబ్దుల్ నజీర్ వ్యాఖ్యానించారు. మహాత్మా గాంధీ చెప్పినట్లు సాధించాలన్న తపన ఉన్న ప్రతి ఒక్కరు తప్పకుండా విజయం సాధించి తీరుతారన్నారు.
Read Also:Karnataka Teacher : కర్ణాటక సీఎంను విమర్శించిన టీచర్ సస్పెండ్
తాజావార్తలు
-
Egg Storage Tips in Summer: వేసవిలో గుడ్లు ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి..? తినే ముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
-
Ravi Teja : ఆగస్ట్ రేస్లో మాస్ మహారాజా.. సాలిడ్ హిట్ కొడతాడా?
-
Sunil: మంగళం శ్రీను పాత్ర వెనుక ఇంత కథ ఉందా..? సునీల్ షాకింగ్ రివీల్!
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
Virat Kohli: ఆర్సీబీ ఫాన్స్ కోసం ప్రాణం పెట్టి ఆడుతున్నాం.. విరాట్ కోహ్లీ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!