Minister Kondapalli Srinivas: ఎంఎస్ఎంఈ పార్కుల్లో మౌలిక వసతుల కల్పనపై ఫోకస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Kondapalli Srinivas: ఎంఎస్ఎంఈల అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం.. మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేయనుంది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో అభివృద్ధి చేస్తున్న ఎంఎస్ఎంఈ పార్కులలో మౌలిక వసతుల కల్పన త్వరితగతిన చేపట్టాలని, వీలైనంత త్వరగా నీరు, రోడ్లు, విద్యుత్ తదితర మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని 5వ బ్లాక్ లో ఎంఎస్ఎంఈ, ఏపీఐఐసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి… ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానాల ద్వారా ఎంఎస్ఎంఈల అభివృద్దిని వేగవంతం చేయాలని, ఇందుకు తగిన కార్యాచరణ, స్పష్టమైన భవిష్యత్తు ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని సూచించారు.
Read Also: SSMB 29 : మహేశ్ మూవీకి టైటిల్ ఇష్యూ.. రాజమౌళికి ఏం చేస్తాడో..?
Also Read
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
- MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
ఇక, నూతన పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించే విధంగా అధికారుల పని తీరు ఉండాలని, ప్రభుత్వం అందిస్తున్న పారిశ్రామిక ప్రోత్సాహాకాలను సమర్ధవంతంగా నూతన పారిశ్రామిక వేత్తలు వినియోగించుకునే విధంగా ఎప్పటికప్పుడు పని చేయాలని, వారికి అవసరమైన చట్టపరమైన అనుమతులను జారీ చేసే విషయంలో జాప్యం చేయరాదని మంత్రి సూచించారు. నూతన పారిశ్రామిక వాడల్లో నిర్మించిన తలపెట్టిన భవనాలు, ఇతర మౌలిక వసతులపై ఈ సమీక్షా సమావేశంలో దిశా నిర్దేశం చేసారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, అందిస్తున్న ప్రోత్సాహకాలకు అనుగుణంగా మన పారిశ్రామిక విధానం ఉండాలని, ఇందుకోసం అవసరమైన మార్పులు చేర్పులతో వ్యాపార అనుకూల వాతావరణాన్ని సృష్టించాలని మంత్రి కొండపల్లి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్, ఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థ సీఈఓ విశ్వ మనోహరన్, ఏపీఐఐసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!