Minister Kondapalli Srinivas: ఎంఎస్ఎంఈ పార్కుల్లో మౌలిక వసతుల కల్పనపై ఫోకస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Kondapalli Srinivas: ఎంఎస్ఎంఈల అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం.. మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేయనుంది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో అభివృద్ధి చేస్తున్న ఎంఎస్ఎంఈ పార్కులలో మౌలిక వసతుల కల్పన త్వరితగతిన చేపట్టాలని, వీలైనంత త్వరగా నీరు, రోడ్లు, విద్యుత్ తదితర మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని 5వ బ్లాక్ లో ఎంఎస్ఎంఈ, ఏపీఐఐసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి… ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానాల ద్వారా ఎంఎస్ఎంఈల అభివృద్దిని వేగవంతం చేయాలని, ఇందుకు తగిన కార్యాచరణ, స్పష్టమైన భవిష్యత్తు ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని సూచించారు.
Read Also: SSMB 29 : మహేశ్ మూవీకి టైటిల్ ఇష్యూ.. రాజమౌళికి ఏం చేస్తాడో..?
Also Read
- Hydrogen Train: భారత తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్.. ప్రత్యేకతలేంటంటే!
- Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు
- IND Vs IRE: ఆరంభంలో తడబడినా భారీ స్కోరు చేసిన ఐర్లాండ్.. భారత్ ముందు క్రేజీ టార్గెట్..
- LayOffs: అతి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్న దిగ్గజ కంపెనీ.. లక్ష ఉద్యోగాలు హాంఫట్..
ఇక, నూతన పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించే విధంగా అధికారుల పని తీరు ఉండాలని, ప్రభుత్వం అందిస్తున్న పారిశ్రామిక ప్రోత్సాహాకాలను సమర్ధవంతంగా నూతన పారిశ్రామిక వేత్తలు వినియోగించుకునే విధంగా ఎప్పటికప్పుడు పని చేయాలని, వారికి అవసరమైన చట్టపరమైన అనుమతులను జారీ చేసే విషయంలో జాప్యం చేయరాదని మంత్రి సూచించారు. నూతన పారిశ్రామిక వాడల్లో నిర్మించిన తలపెట్టిన భవనాలు, ఇతర మౌలిక వసతులపై ఈ సమీక్షా సమావేశంలో దిశా నిర్దేశం చేసారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, అందిస్తున్న ప్రోత్సాహకాలకు అనుగుణంగా మన పారిశ్రామిక విధానం ఉండాలని, ఇందుకోసం అవసరమైన మార్పులు చేర్పులతో వ్యాపార అనుకూల వాతావరణాన్ని సృష్టించాలని మంత్రి కొండపల్లి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్, ఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థ సీఈఓ విశ్వ మనోహరన్, ఏపీఐఐసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Hydrogen Train: భారత తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్.. ప్రత్యేకతలేంటంటే!
-
Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు
-
IND Vs IRE: ఆరంభంలో తడబడినా భారీ స్కోరు చేసిన ఐర్లాండ్.. భారత్ ముందు క్రేజీ టార్గెట్..
-
Suhas: “చేతిలో కత్తి.. కళ్లలో కసి!” ‘సాట్టపులి’గా సుహాస్ ఊరమాస్ విధ్వంసం!
-
LayOffs: అతి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్న దిగ్గజ కంపెనీ.. లక్ష ఉద్యోగాలు హాంఫట్..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!