AP Fiber Net: ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ కీలక నిర్ణయం.. త్వరలోనే సంస్థ విస్తరణ..!
- ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి కీలక నిర్ణయం
- ఫైబర్ నెట్ లో ఇప్పటి వరకు 600 మందిని తొలగించాం- జీవీ రెడ్డి
- త్వరలోనే సంస్థ విస్తరణ చేయనున్నాం- ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్
- సంస్థలో తొలగించిన వారి స్థానంలో మళ్ళీ ఉద్యో గాలు ఇస్తాం- జీవీ రెడ్డి
- ఈసారి రాజకీయ కొలువులు మాదిరి కాకుండా పారదర్శకంగా చేస్తాం
- త్వరలోనే సంస్థలో నియామకాలు ఉంటాయి- ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్.
ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫైబర్ నెట్లో ఇప్పటి వరకు 600 మందిని తొలగించాం.. త్వరలోనే సంస్థ విస్తరణ చేయనున్నామని తెలిపారు. సంస్థలో తొలగించిన వారి స్థానంలో మళ్ళీ ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. ఈసారి రాజకీయ కొలువులు మాదిరి కాకుండా పారదర్శకంగా చేస్తామని చెప్పారు. త్వరలోనే సంస్థలో నియామకాలు ఉంటాయన్నారు. కేబుల్ ఆపరేటర్ల మీద గత ప్రభుత్వ హయంలో రూ.100 కోట్లు జరిమానా వేశారు.. ఇదంతా కక్ష పూరితంగా జరిగిందని ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. దీనిపై విచారణ జరిపి అడ్డగోలుగా వేసిన జరిమానాలను రద్దు చేయాలని నిర్ణయించామని జీవీ రెడ్డి తెలిపారు.
Read Also: Skoda SUV Kylaq: రూ. 7.89 లక్షల విలువైన స్కోడా ఎస్యూవీ.. బ్రెజ్జా కంటే ఎక్కువ మైలేజీ!
Also Read
- Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
- Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
- MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
- Natural Home Cooling Tips: మీ ఇల్లు ఫ్రిజ్లా కూల్గా మారిపోతుంది.. 3000 ఏళ్ల నాటి చిట్కాలు.. కరెంట్ అవసరమే లేదు..!
కేబుల్ ఆపరేటర్లు నుంచి కనెక్షన్ల నుంచి రెంట్ వసూలు చేశారు.. ఈ కనెక్షన్ల మీద వసూలు చేసిన రెంట్లు రద్దు చేయాలని నిర్ణయించామని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పేర్కొన్నారు. బినామీలతో అడ్డగోలుగా కాంట్రాక్టులు గత ప్రభుత్వ హయంలో అప్పజెప్పారు.. రూపాయికి 10 రూపాయలు చెల్లింపులు జరిగాయని ఆరోపించారు. ఇప్పటి వరకు ఉద్యోగాలను తొలగించినా.. ఒక్కరు కూడా వచ్చి అడిగిన పరిస్థితి లేదని తెలిపారు. దీన్ని బట్టే అన్నీ గతంలో నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగాయనేది స్పష్టం అయిందని అన్నారు.
Read Also: Karnataka: “భారతమాత హిందువులకు మాత్రమే దేవత”.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో కొత్త వివాదం..
ఫైబర్ నెట్ ప్లాన్స్ కూడా రివైజ్ చేస్తాం.. గ్రామాల్లో అందరికీ తక్కువ ధరకు ఇవ్వాలనే బేసిక్ ప్యాకేజ్ అందుబాటులోకి తెస్తామని జీవీ రెడ్డి తెలిపారు. టీటీడీ దేవస్థానం మీద ఉచిత కనెక్షన్లు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం.. టీటీడీ ప్రతిపాదనలు ఇస్తే తాము ఉచితంగా ఇవ్వటానికి సిద్ధమని అన్నారు. వివిధ రకాల మార్గాల్లో పెట్టుబడులు సేకరణకు ప్రణాళికలు సిద్ధం చేశాం.. 2 నెలల్లో రుణాలు తీసుకుని సంస్థ విస్తరణ చేస్తామని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
-
MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
-
Natural Home Cooling Tips: మీ ఇల్లు ఫ్రిజ్లా కూల్గా మారిపోతుంది.. 3000 ఏళ్ల నాటి చిట్కాలు.. కరెంట్ అవసరమే లేదు..!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!