Karnataka: “భారతమాత హిందువులకు మాత్రమే దేవత”.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో కొత్త వివాదం..
- కర్ణాటకలో సరికొత్త వివాదం..
- అండర్ గ్రాడ్యుయేషన్ సిలబస్లో ‘‘విద్వేష’’ కంటెంట్..
- గవర్నర్కి ఫిర్యాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కర్ణాటకలో మరో వివాదం తెర పైకి వచ్చింది. కర్ణాటక యూనివర్సిటీ అండర్ గ్రాడ్యుయేషన్ విద్యార్థుల మొదటి సెమిస్టర్ పాఠ్యపుస్తకాంలో ‘‘విద్వేషపూరిత’’ కంటెంట్ ఉండటంపై వివాదం చెలరేగింది. కర్ణాటక లా స్టూడెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం.. ‘‘బెళగు 1’’ పుస్తకంలో ‘‘రాష్ట్రీయతే’’ అనే శీర్షికతో కూడిన అంశాలు ఉన్నాయని, ఇది భారత ఐక్యతకు భంగం కలిగించే అభిప్రాయాలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఈ అధ్యాయం ద్వారా ఆర్ఎస్ఎస్, రామమందిర నిర్మాణం, భారతమాత, భువనేశ్వరి దేవీ వంటి గౌరవనీయమైన వ్యక్తులనున విమర్శిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Read Also: Rajouri: రాజౌరి మిస్టరీ మరణాల వెనక విష పదార్థాలు.. బ్యాక్టీరియా, వైరస్ కాదు..
Also Read
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
మత విద్వేషాలను ప్రోత్సహించేలా కంటెంట్ ఉందని, ‘‘భారత మాతను హిందువులకు మాత్రమే ప్రత్యేకమైన దేవత’’గా చిత్రీకరించారని ఆరోపించారు. ఈ పుస్తకం ద్వారా ఆర్ఎస్ఎస్ని విమర్శిస్తున్నారని, సంఘ్ పరివార్ వంటి పదాలను అవమానకరమైన రీతిలో ఉపయోగించిందని ఆరోపించారు. సీనియర్ న్యాయవాది, సామాజిక కార్యకర్త అరుణ్ జోషి దీనిపై యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్తో పాటు గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్కి లేఖలు రాశారు. ఈ వివాదాస్పద సిలబస్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
అధ్యాయంలోని చాలా అంశాలు ‘‘జాతీయ వ్యతిరేకతను’’ ప్రోత్సహిస్తున్నాయని జోషి చెప్పారు. రాజ్యంగ వ్యతిరేక, భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక కంటెంట్ ఉందని ఇది ‘‘కమ్యూనిస్ట్ కాంగ్రెస్ ఎజెండా’’లను ముందుకు తీసుకెళ్తుందని పేర్కొన్నారు. భారతమాత హిందువులకు మాత్రమే దేవత అని, ఇతర వర్గాలైన ముస్లిం, సిక్కు, జైన్ వర్గాలకు మినహాయించేలా చిత్రీకరించారని ఆరోపించారు. ముస్లింలు పరాయీకరణ అనే భావనను అనుభవిస్తున్నారని తప్పుడు కథనాలను పాఠ్యాంశంలో జొప్పించారని ఆరోపించారు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!