AP DGP Rajendranath Reddy: బాలికలు, మహిళల అదృశ్యం నిజమే.. కానీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP DGP Rajendranath Reddy: ఆంధ్రప్రదేశ్లో బాలికలు, మహిళల మిస్సింగ్ కేసులపై ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. 2019-21 మధ్య 26వేల మంది బాలికలు, మహిళలు అదృశ్యమైతే.. 23 వేల మంది తిరిగొచ్చారని ఆయన చెప్పారు. అంతకుముందు సంవత్సరాల్లో తప్పిపోయిన వారిని కలపటం వల్లే 30వేల మంది అని లెక్కలు చెబుతున్నారని డీజీపీ అన్నారు. శాంతిభద్రతలపై కడప జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
Also Read: Andhrapradesh: సీఎం జగన్తో తిరుపతి ఎమ్మెల్యే భూమన భేటీ.. కీలక పదవిపై చర్చలు!
Also Read
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 2019 నుంచి 2021 మధ్య మహిళలు, బాలికల మిస్సింగ్పై రాజ్యసభకు కేంద్ర హోంశాఖ వివరాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. రాజ్యసభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో మహిళలు, బాలికల అదృశ్యంపై రాజ్యసభలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా సమాచారం ఇచ్చారు. ఏపీలో 2019 నుంచి 2021 వరకు 7,918 మంది బాలికలు, 22,278 మంది మహిళలు, యువతుల అదృశ్యమయ్యారని రాజ్యసభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్కుమార్ మిశ్రా లిఖితపూర్వకంగా వెల్లడించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో దీనిపై డీజీపీ వివరణ ఇచ్చారు.
మరోవైపు, రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసు యంత్రాంగం కృషి చేస్తోందని డీజీపీ వెల్లడించారు. నేర పరిశోధనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా వినియోగిస్తామని ఆయన అన్నారు. ఇందుకోసం అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. పోలీసులకు సాంకేతిక పరిజ్ఞానంపై మరింత శిక్షణ ఇస్తామని డీజీపీ చెప్పారు. పోలీస్ సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. రాజమండ్రిలో క్రీడల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!